Adilabad

News October 15, 2024

SUPER: మంచిర్యాల: ఫ్రెండ్స్ అంటే వీళ్లే

image

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బోడకుంట మహేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా.. అతడి మిత్రులు మహేశ్ జ్ఞాపకార్థం గ్రామశివారు ఎక్స్‌రోడ్డు వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుషెల్టర్ ఏర్పాటుచేశారు. ఈ షెల్టర్‌ను మహేశ్ తల్లిదండ్రులు సోమవారం ప్రారంభించారు. దీంతో వారిని గ్రామస్థులు అభినందించారు.

News October 15, 2024

ఆదిలాబాద్: ఈనెల 18న పోటీలు… GET READY

image

ప్రపంచ పర్యాటక దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మూడు అంశాలపై ఫోటో ఎక్సిబిషన్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి రవికుమార్ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలు, వైల్డ్ లైఫ్, సంస్కృతి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీలు ఈనెల 18న టీటీడీసీలో ఉంటాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే ఔత్సాహికులు వివరాలకు 9440816087 సంప్రదించాలన్నారు.

News October 15, 2024

నిజాయితీ చాటుకున్న బెల్లంపల్లి కండక్టర్

image

బెల్లంపల్లికి చెందిన బస్ కండక్టర్ గాజనవేణి రాజేందర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ‌మందమర్రికి చెందిన ఓ మహిళ బస్సులో సీటు కోసం పర్సు వేసింది. కాని బస్సులో రద్దీ కారణంగా బస్సు ఎక్కలేకపోయింది. దీంతో ఆమె తన పర్సులోనే మరిచిపోయిన ఫోన్‌కు కాల్ చేయగా కండక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి పర్సును భద్రపరిచి బాధితురాలికి అందించాడు. కాగా పర్సులో రూ. 20వేలు, 2 తులాల బంగారం ఉన్నట్లు సదరు మహిళ తెలిపింది.

News October 14, 2024

ఆదిలాబాద్: కాల్ చేసుకుంటానని చెప్పి… ఫోన్‌తో జంప్

image

ఫోన్ కాల్ మాట్లాడతానని చెప్పి ఓ వ్యక్తి ఫోన్ తీసుకొని పారిపోయిన ఘటన ADBలో చోటుచేసుకుంది. పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సామ సతీష్ రెడ్డి ఆదివారం సాయంత్రం సమయంలో బస్టాండు వద్ద నిలుచున్నాడు. అయితే గుర్తుతెలియని ఓ వ్యక్తి వచ్చి ఫోన్ చేసుకుంటా అని చెప్పి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ మాట్లాడుతూ.. ఫోన్ తీసుకొని పారిపోయాడు. దీంతో బాధితుడు ఆదిలాబాద్ 2 టౌన్ PS లో ఫిర్యాదు చేశాడు.

News October 14, 2024

ADB: దుర్గామాత నిమజ్జనంలో విషాదం.. నదిలో ఒకరు గల్లంతు

image

దుర్గాదేవి విగ్రహ నిమజ్జనంలో విషాదం నెలకొంది. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి పెన్ గంగా నదిలో గల్లంతైన విషాద ఘటన ADBలో చోటుచేసుకుంది. సోమవారం రణదీవే నగర్ కాలనీకి చెందిన గజ్జు అనే వ్యక్తి దుర్గామాత విగ్రహ నిమజ్జనానికి జైనథ్ మండలంలోని డొలారా వద్ద గల పెన్ గంగా నదికి వెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టారు.

News October 14, 2024

ఆదిలాబాద్: OPEN అడ్మిషన్లకు రేపే ఆఖరు తేదీ

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై దరఖాస్తులు చేసుకోవాలని ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. డిగ్రీ, పీజీ, తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరవచ్చని సూచించారు. కాగా గడువు ఈ నెల 15తో ముగుస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
>>SHARE IT

News October 14, 2024

ADB: మళ్లీ పులి వచ్చింది

image

ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గత రెండు నెలల్లో పరందోలి, కరంజివాడ, లక్మాపూర్, ఇందాపూర్ ప్రాంతాల్లో పులి సంచరించగా స్థానికులు ఆందోళన చెందారు. తాజాగా ఇదే మండలంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలియడంతో జంకుతున్నారు. మరోవైపు ఆయా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జోడేఘాట్ FRO జ్ఞానేశ్వర్ సూచిస్తున్నారు.

News October 14, 2024

ఆదిలాబాద్ MP నేటి పర్యటన ఇలా..

image

ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ నేడు (సోమవారం) సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివరాలు ఇలా.. కాగజ్‌నగర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న అలాయ్- బలాయ్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు దహెగాం ప్రెస్‌క్లబ్ మొదటి వార్షికోత్సవానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బెజ్జూర్ మండల కేంద్రంలో, 4 గంటలకు ఈస్గాంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

News October 13, 2024

బాసర అమ్మవారికి దిల్ రాజు పూజలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు <<14345490>>తనికెళ్ల భరణి<<>> కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం బాసర వేదభారతి పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారి సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు అన్నారు.

News October 13, 2024

కడెం ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద నీరు

image

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేనందున కడెం ప్రాజెక్టు వరద తగ్గింది. ప్రాజెక్టులోకి 461 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుందని అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 499.350 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ కెనాళ్లకు 669, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.