Adilabad

News March 24, 2024

లోకేశ్వరంలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఒకరికి తీవ్ర గాయలైన ఘటన లొకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన అభిషేక్, జితెందర్ భైంసా మండలం వానల్పాడ్ గ్రామంలోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నారు. బైక్ పై ఆదివారం నిజామాబాద్ వెళ్తుండగా పంచగుడి గోదావరి వంతెనపై ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందగా జితెందర్‌కు తీవ్రగాయాలనైనట్లు పేర్కొన్నారు.

News March 24, 2024

తలమడుగు: చెక్ పోస్ట్ వద్ద రెండు లక్షల నగదు స్వాధీనం

image

ఎన్నికల నియమావళి లో భాగంగా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేని రెండు లక్షల నగదును ఆదివారం అధికారులు సీజ్ చేశారు. మహారాష్ట్ర కు చెందిన ఓ కారును ఎన్నికల సిబ్బంది తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో రూరల్ సీఐ ఫణిందర్, తలమడుగు ఎస్ఐ ధనశ్రీ, ఎస్ఎస్‌టీ సభ్యులు తదితరులు ఉన్నారు.

News March 24, 2024

నిర్మల్: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్…!

image

నిర్మల్ జిల్లా నాయకులు BRSను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు నివాసంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నిర్మల్ మాజీ మండల అధ్యక్షులు ఆయిండ్ల పోశెట్టి, మంజులాపూర్ మాజీ సర్పంచ్ నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలను కప్పి మంత్రి ఆహ్వానించారు.

News March 24, 2024

మంచిర్యాల: LOVE ఎఫెక్ట్.. వైద్యురాలి ఆత్మహత్యాయత్నం

image

MNCL జిల్లా కాసిపేటలో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు యత్నించింది. కాసిపేటకి చెందిన యువతి ASF జిల్లాలోని ఓ మండలంలో వైద్యురాలిగా పనిచేసేది. అదే మండలంలో విధులు నిర్వర్తించే ఓ వైద్యాధికారితో ఆమెకు పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారింది. ఈక్రమంలో అతను మరోకరితో ప్రేమాయణం నడిపారు. విషయం ఆమెకు తెలియడంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. మానసిక వేదనకు గురైన వైద్యురాలు విషం తాగగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

News March 24, 2024

గుడిహత్నూర్: కౌలు రైతు ఆత్మహత్య

image

పంట దిగుబడులు రాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహాత్నూర్ మండలంలో చోటుచేసుకుంది. మన్నూరు గ్రామానికి చెందిన రైతు జాదవ్ రాజారాం (56) 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. రబీలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటల దిగుబడి రాక మనస్తాపానికి గురైన రాజారాం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 24, 2024

కడెం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి…!

image

కడెం మండలం పెద్దూర్ గ్రామ సమీపంలోని గిరిజన వసతిగృహం సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దూరుకు చెందిన కత్తె రాపాక గంగన్న(38)కు తీవ్రగాయాలయ్యాయి. ఖానాపూర్ ఆస్పత్రికి తరలించగా కాసేపటికే మరణించినట్లు బంధువుల తెలిపారు. సైకిల్ పై కడెం నుంచి పెద్దూరుకు వెళ్తున్న గంగన్నను ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహన చోదకుడికి గాయాలైనట్లు సమాచారం.

News March 24, 2024

ADB: మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ

image

కాలినడకన వెళ్తున్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్ళిన సంఘటన శనివారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ స్ధానిక పంజాబ్ చౌక్ వద్ద బస్సు దిగి భూక్తాపూర్‌లోని బంధువుల ఇంటికి కాలినడకన వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన అగంతకుడు అకస్మాత్తుగా రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News March 23, 2024

నిర్మల్: ఇఫ్తార్ విందులో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు

image

పట్టణంలో కాంగ్రెస్ నేత అర్జుమన్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్, జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు.

News March 23, 2024

MNCL: రైలు కింద పడి సింగరేణి రిటైర్డ్ కార్మికుడి సూసైడ్

image

రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంచిర్యాలలో జరిగింది. పట్టణంలోని బృందావన కాలనీకి చెందిన మాటేటి రాజయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో మద్యానికి బానిసై మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 23, 2024

ADB: నేటితో ముగియనున్న గురుకులాల దరఖాస్తు ప్రక్రియ

image

తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ కొరకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా గురుకుల విద్యాలయాల సెక్రటరీ సీతాలక్ష్మీ వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.