India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. సర్పంచ్గా పోటీ చేయడానికి ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయా గ్రామాలలో పాత వారితో పాటు కొత్తగా బరిలో నిలవడానికి నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్లో 468, మంచిర్యాల 311, నిర్మల్ 396, ఆసిఫాబాద్లో 355 పంచాయతీలు ఉన్నాయి.
భవిష్యత్తు కోసం అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందామని కడెం మండలంలోని ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ అనిత సూచించారు. 70వ అటవీ సంరక్షణ వారోత్సవాలలో భాగంగా సోమవారం ఉడుంపూర్ పరిధిలోని అటవీ ప్రాంతాలలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషికి మనుగడ ఉంటుందన్నారు. వాటిని కాపాడుకుందామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందింది. ఏఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడిగూడకు చెందిన అల్లూరి లక్ష్మీ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లింది. నీళ్లు తీసుకువచ్చే క్రమంలో కాలుజారి బావిలో పడి మృతి చెందింది. భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.
TYSA ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెవులో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో నిర్మల్ జిల్లా బాసరకు చెందిన చరణ్, అవినాశ్ జాతీయస్థాయికి ఎంపికైనట్లు సోమవారం నిర్మల్ జిల్లా యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేశ్ తెలిపారు. ఇందులో అవినాష్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఇది ఐదో సారి అని తెలిపారు. విద్యార్థులకు పలువురు అభినందించారు.
నిర్మల్ పట్టణంలోని ధ్యాగవాడ హనుమాన్ ఆలయంలో కొలువు దీరిన దుర్గా మాత మండపం వద్ద ఆదివారం రాత్రి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించారు. రూ.500, రూ.200, రూ.100 ఇతర నోట్లతో మొత్తం రూ .7,66,999తో అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు..
పెళ్లి చేసుకుంటానని ప్రియుడు మోసం చేయడంతో ప్రియురాలు అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. బాధితురాలి వివరాల ప్రకారం.. మంచిర్యాల నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి, గొల్లపల్లి గ్రామానికి చెందిన రేచవేని రాజశేఖర్ 2ఏళ్లుగా ప్రేమించుకున్నారు. తనను శారీరకంగా లోబరుచుకొని, పెళ్లి మాట ఎత్తే సరికి ముఖం చాటేశాడని యువతి తెలిపింది. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని పేర్కొంది.
బోథ్ PHCలో గత మార్చి నెలలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్న ఆదివాసి మహిళ డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 31న మహిళ అనారోగ్యంతో మరణించిందని సివిల్ అసిస్టెంట్ సర్జన్ ద్వారా పోస్టుమార్టం నివేదికలో తేలిందని జిల్లా DSP జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సాధారణ మరణంపై ప్రస్తుతం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆరో విడత ద్వారా ఐటీఐ కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ITI కళాశాల ప్రిన్సిపాల్ రొడ్డ శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 9 వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నమోదు చేసుకున్న అభ్యర్థులు, తిరిగి నమోదు చేయనవసరం లేదని పేర్కొన్నారు. ఇంకా నమోదు చేయని అభ్యర్థులు ఐటీఐ పోర్టల్లో కొత్తగా నమోదు చేసుకుని, కళాశాలకు హాజరు కావాలని సూచించారు.
ఖానాపూర్ పట్టణంలోని సుభాష్నగర్ కాలనీలో గల వాగ్దేవి కళాశాల సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్సై రాహుల్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని కొత్తచెరువులో ఆదివారం గుర్తుతెలియని శవం లభ్యమయింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. అటువైపు వెళ్లిన కొందరు నీటిపై తేలుతున్న శవాన్ని చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.