India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఆదివారం జరిగిన మాలల మహా గర్జన సభకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా మాలలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్య అటవీ క్షేత్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఆదివారం సాయంత్రం ఆయన జన్నారం మండలంలోని గోండుగూడా అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా అడవి, వన్యప్రాణుల రక్షణకు అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. అలాగే అటవీ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రేపటి నుంచి యథావిధిగా ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గ్రహించి తమ అర్జీలను అధికారులకు సమర్పించుకోవచ్చని సూచించారు.

బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అమ్మమ్మ, మనవరాలు మృతి చెందారు. కన్నాలబస్తీకి చెందిన రాజేశ్ తన కుటుంబంతో భూపాలపల్లిలోని ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. కారు బెల్లంపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రాజేశ్ అత్త కళ్యాణి, కూతురు ప్రియమేఘన స్పాట్లోనే చనిపోయారు. అతడి భార్య అలేఖ్య, కుమారుడు సాయి తీవ్రంగా గాయపడ్డారు.

సైనిక సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికులకు TGS RTCలో ఉద్యోగాలు కల్పించనుంది. ఈ మేరకు RTC నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,201 డ్రైవింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 92 ఉద్యోగాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 18నెలల అనుభవంతో కూడిన హెవీ డ్యూటీ లైసెన్స్, 58 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు అర్హులు. ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి గత రెండు వారాలుగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సందర్భంగా రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 25న నిర్వహించే ప్రజావాణి కలెక్టరేట్లో యథావిధిగా కొనసాగుతుందన్నారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి ప్రజావాణి కార్యక్రమానికి రావాలని సూచించారు.

త్వరలో ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్- కరీంనగర్ పరిధిలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా మంది పట్టభద్రులు, టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అర్హులు ఇంకా ఎవరైనా ఉండవచ్చన్న అనుమానంతో డిసెంబర్ 9 వరకు ఓటుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. 2021 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి అయిన వాళ్లు ఆన్లైన్లో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం చెల్లాయిపేటకు చెందిన మౌనిక నిన్నవిడుదలైన జెఎల్ (ఇంగ్లీష్) ఫలితాల్లో ఉద్యోగాన్ని సాధించింది. కాగా గతంలో మరో నాలుగు ఉద్యోగాలు సాధించారు. టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్ జాబ్స్ కి ఎంపికయ్యారు. దీంతో ఆమెకు కుటుంబ సభ్యులు, స్నేహతుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. తమ కుతూరు అయిదు ఉద్యోగాలు సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు హన్మయ్య- అంకుపోసు హార్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవజాత శిశువుకు వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా చేసి పాప ప్రాణాలు కాపాడిన ఘటన గురువారం నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. వైద్యులు సంతోష్ రాజ్ మాట్లాడుతూ.. ఇచ్చోడ మండలానికి చెందిన ఓ గర్భిణి నవజాత శిశువుకు జన్మనిచ్చింది. అన్నవాహికకు జీర్ణాశయానికి సంబంధం లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడినట్లు డాక్టర్ తెలిపారు.

పది, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం నిర్వహించారు. పదో తరగతలో ప్రత్యేక తరగతులు నిర్వహించి డిసెంబర్ నాటికి సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేసి జనవరి నుంచి 2025 రివిజన్ చేపట్టాలని సూచించారు. ఇంటర్మీడియట్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.