Adilabad

News March 19, 2024

ఎదురు కాల్పులు..మంచిర్యాల జిల్లా మావోలు మృతి

image

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూర్ ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ మృతి చెందారు. ఈ కాల్పుల్లో మెుత్తం నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏకే-47, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

News March 19, 2024

తలమడుగు: పురుగుల మందు తాగి వ్యక్తి SUICIDE

image

తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కాకర్ల ఆశరెడ్డి (55) అనే రైతు అప్పుల బాధ భరించలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా పొలానికి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పంట దిగుబడి రాక.. బ్యాంకు అప్పులు పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు.

News March 19, 2024

ADB: అన్న చనిపోయాడని సమాచారం.. తమ్ముడికి గుండెపోటు

image

చావు గురించి తప్పుడు సమాచారం ఓ నిండు ప్రాణాన్ని తీసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలో జరిగింది. బోథ్‌కు చెందిన నరసింహదాస్‌, బాపు ఇద్దరు అన్నదమ్ములు. అనారోగ్యంతో బాధపడుతున్న బాపు బతికే ఉన్నా, ఆయన చనిపోయాడంటూ బంధువులు ఫోన్‌ చేసి చెప్పడంతో తమ్ముడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అన్న ఇక లేడని రోదించిన దాస్ గంటల వ్యవధిలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నింపింది.

News March 19, 2024

ఇంద్రవెల్లి: గొంతు తడవాలంటే 2KM వెళ్లాల్సిందే..!

image

ఇంద్రవెల్లి మండలం సాలెగూడ గ్రామస్థులకు తాగు నీరు లేక అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గిరిజనులు గ్రామంలో ప్రతీ ఇంటి ముందు డ్రమ్ములతో కూడిన ఎడ్లబండ్లే దర్శనమిస్తున్నాయి. నీళ్లు కావాలంటే బండి కట్టాల్సిందేనని.. రోజూ సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పంట చేల వద్దకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పనులు సైతం వదులుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.

News March 19, 2024

ADB: యువకుడి ఆత్మహత్య.. తల, మొండెం వేరు

image

తలమడుగు గ్రామానికి చెందిన పెందూర్ సునీల్(27) సోమవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సునీల్ కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా ఇంటి వద్ద ఖాళీగా ఉండటంతో తండ్రి భూమన్న మందలించాడు. మనస్తాపం చెందిన యువకుడు ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న ప్యాసింజర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News March 19, 2024

తాంసి: వార్డెన్‌ సస్పెండ్.. సిబ్బందికి షోకాజ్ నోటీసులు

image

తాంసి ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ ఎటువంటి అనుమతి లేకుండా గైర్హాజరు అవుతున్నట్లు ఆమె గుర్తించారు. పరీక్షల సమయంలో వార్డెన్ గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన ఆమె వార్డెన్ స్వప్నను సస్పెండ్ చేశారు. అదేవిధంగా విధులకు గైర్హాజరు అవుతున్న బోధనేతర సిబ్బంది విజయ్, మహేందర్‌కు షోకాజ్ నోటీసులు అందజేశారు.

News March 19, 2024

ADB: BJP ST మోర్చా ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌ల నియామకం

image

తెలంగాణ రాష్ట్ర 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా  BJP ST మోర్చా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను రాష్ట్ర BJP ST మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ప్రకటించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ BJP ST ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌గా జెడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్, పెద్దపల్లి పార్లమెంట్ ST మోర్చా ఇన్‌ఛార్జ్‌గా ఆసిఫాబాద్ MLA అభ్యర్థి ఆత్మారాం నాయక్‌ని నియమించారు.

News March 18, 2024

MNCL: ATMలో చోరీకి యత్నించిన నిందితుడి అరెస్ట్

image

మంచిర్యాలలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ATMలో ఆదివారం రాత్రి చోరీకి యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ATMను పగులగొట్టి చోరీకి యత్నిస్తున్న శబ్దాలు విని అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు వచ్చి వివరాలు అడగగా బ్యాగ్ అక్కడే వదిలి పారిపోయినట్లు CI బన్సీలాల్ తెలిపారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన గౌరవం మిశ్రాను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

News March 18, 2024

ADB: ముళ్లపొదల్లో మగశిశువు.. వెలుగులోకి సంచలన విషయం

image

ఇటీవల ఓ మగశిశువును ముళ్లపొదల్లో పడేసిన ఘటన భీంపూర్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును పోలీసులు ఛేదించారు. ఆ మగబిడ్డకు జన్మనిచ్చింది మైనర్ బాలికగా గుర్తించారు. సదరు బాలిక గర్భం దాల్చడానికి కారకుడైన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక ఓ హాస్టల్ లో ఉంటూ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. వరుసకు బావనే గర్భం దాల్చడానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

News March 18, 2024

బెల్లంపల్లి: పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

image

పెళ్లి కావడం లేదనే మనోవ్యధతో ఓ యువతి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన కొత్తూరు సుమలత ఆదివారం కన్నాల రైల్వేగేట్ వద్ద గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లీడు దాటి పోతున్నా వివాహం కావడం లేదనే బాధతో ఆత్మహత్య చేసుకుందని జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.