Adilabad

News November 10, 2024

ఆదిలాబాద్: జాతీయ స్థాయి పోటీల్లో హర్షవర్ధన్ సత్తా

image

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాడు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 68వజాతీయ స్థాయి SGF జూడో పోటీల్లో కాంస్య పతకంతో మెరిశాడని జూడో కోచ్ రాజు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలవడం పట్ల పలువురు క్రీడా సంఘాల బాధ్యులు అభినందనలు తెలిపారు.

News November 10, 2024

నిర్మల్: భార్యాభర్తల మధ్య గొడవ ఆ తర్వాత.. సూసైడ్

image

ఒంటరితనంతో మద్యానికి బానిసై మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం బన్సపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జయరాజ్ తన భార్య స్వప్న మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో స్వప్న పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపం చెంది ఒంటరితనం భరించలేక జయరాజ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

News November 10, 2024

నిర్మల్: పారిపోయిన విద్యార్థులను గుర్తించిన పోలీసులు

image

నర్సాపూర్‌(జి) ఆశ్రమ పాఠశాల నుంచి వినీత్, వినాయక్, నితీశ్ అనే ముగ్గురు విద్యార్థులు పారిపోయి బస్టాండ్‌ వద్దకు వెళ్లారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా డయల్‌ 100 సిబ్బంది చౌహాన్‌ కృష్ణ, శ్రీనివాస్‌ పిల్లలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఐ హనుమాండ్లు ఆధ్వర్యంలో విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులకు అప్పగించారు.

News November 10, 2024

చెన్నూర్‌లో వ్యక్తి దారుణ హత్య

image

ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన చెన్నూర్‌లో జరిగింది. CI రవీందర్ వివరాలు.. ముత్తరావుపల్లికి చెందిన రాజశేఖర్ అదే గ్రామానికి చెందిన భూమయ్య భార్య సౌందర్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెతో పాటు ఊరు నుంచి పారిపోయాడు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తతో ఉండేందుకు ఆమె నిరాకరించింది. దీంతో రాజశేఖర్ పై కక్ష పెంచుకున్న భూమయ్య శనివారం అతడి తండ్రి మల్లయ్యను గొడ్డలితో నరికి చంపాడు.

News November 10, 2024

రంజీలో సెంచరీ చేసిన ఆదిలాబాద్ జిల్లా కుర్రాడు

image

ఆదిలాబాద్ జిల్లా నుంచి క్రికెట్‌లో రాణిస్తూ హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతున్న కొడిమెల హిమతేజ తొలి సెంచరీ సాధించారు. రాజస్తాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆయన శతకం సాధించగా, క్రీడాభిమానులు అభినందనలు తెలియచేశారు. జిల్లా నుంచి ట్రోఫీకి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హిమతేజ ట్రోఫీ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ సెంచరీ సాధించడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News November 10, 2024

ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక

image

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక షాద్నగర్ చెందిన హబీబ్ అలీ, కబీర్, రెహమాన్, మక్దూం, అల్తాఫ్, అహ్మద్, ఇమ్రాన్ శనివారం కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.

News November 10, 2024

మందమర్రి: సైబర్ వల..లింక్ పై క్లిక్ చేశారో అంతే

image

వాట్సాప్‌లో వచ్చే గుర్తు తెలియని ఏపీకే అప్లికేషన్లను క్లిక్ చేయడం వల్ల సైబరు నేరస్తుల వలలో చిక్కుకునే ప్రమాదం ఉందని మందమర్రి ఎస్సై రాజశేఖర్ హెచ్చరించారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని చెర్రకుంటకు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేయడంతో అతను తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.50వేలు పొగోట్టుకున్నట్లు తెలిపారు. సైబర్ మోసానికి గురైతే 1930నంబర్‌కు కాల్ చేయాలన్నారు.

News November 9, 2024

MNCL: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

image

2025 మార్చిలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. పరీక్ష రుసుం అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, వృత్తి విద్యా కోర్సులకు అదనంగా రూ.60 చెల్లించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఈ నెల 18, రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 2, రూ.200తో 12వ తేదీ, రూ.500తో 21వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.

News November 9, 2024

మంచిర్యాల: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు రైలు ఢీకొని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మరణించినట్లు రైల్వే అధికారి మహేందర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, హమాలివాడ రైల్వే గేట్ వద్దకు ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని సింగరేణి రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.

News November 9, 2024

మంచిర్యాల: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు రైలు ఢీకొని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మరణించినట్లు రైల్వే అధికారి మహేందర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, హమాలివాడ రైల్వే గేట్ వద్దకు ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని సింగరేణి రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.