India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పార్ట్ టైం ఉపాధ్యాయ పోస్టులకు ఉట్నూర్లోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్సీఓ ఓ ప్రకటన విడుదల చేశారు. టీజీటీ సామాన్య శాస్త్రం 3, ఇంగ్లిష్ 3, పీజీటీ భౌతిక శాస్త్రం 1, వృక్ష, భౌతిక, ఆర్థిక, వాణిజ్యశాస్త్రాల్లో ఒక్కో లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. బాలికల పాఠశాలల్లో మహిళలతోనే భర్తీ చేస్తామన్నారు.

గ్రూప్-III పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో గ్రూప్-III పరీక్షల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ III పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ జాబితాలో పేరు నమోదులో ఎదురవుతున్న సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టరేట్లో 1950 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఓటర్ జాబితాలో పేరు నమోదులో ఏమైనా సందేహాలు ఉంటే 1950 టోల్ ఫ్రీ నంబర్ (ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు) సంప్రదించాలని సూచించారు.

10వ తరగతి వరకు తరగతులు పెంచాలని విద్యార్థులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ను కోరారు. భీమిని మండలంలోని చిన్నగుడిపేట్ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి వరకే ఉందని, ఆపై చదువులకు వెళ్లే వసతి, రోడ్డులేక చదువు ఆపేయాల్సి వస్తోందని చిన్నారులు వాపోయారు. తమ అభ్యర్థనను, ప్రభుత్వం, కలెక్టర్ గమనించి గ్రామంలోని పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో బుధవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,521గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,030గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ, ప్రైవేటు ధరలో ఎటువంటి మార్పులేదు. పత్తికి సరైన గిట్టుబాటు ధరను కల్పించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.

దిలావర్పూర్లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్థులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వారు ఓ కీలక లేఖ విడుదల చేశారు. నేటి నుంచి చేపడుతున్న కులగణన కార్యక్రమాన్ని నిషేధిస్తున్నట్లు వారు ప్రకటించారు. బుధవారం స్థానిక తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాన్ని సమర్పించారు. ఫ్యాక్టరీని తొలగిస్తేనే కులగణనలో పాల్గొంటామని తెలిపారు.

దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామానికి చెందిన విద్యార్థి ఆయాన్ హుస్సేన్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన సంతాపాన్ని తెలిపారు. విద్యార్థి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

దండేపల్లి మండలంలోని మేదర్ పేట రోడ్డుపై రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మేదరిపేటలో రోడ్డుపై ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని లక్సెట్టిపేట మండలంలోని హనుమంతుపల్లికి చెందిన బోనాల మహేశ్ (34) అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు కార్పెంటర్గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సుద్దవాగులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ (జి) మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై హనుమాన్లు వివరాలు.. నిజామాబాద్ జిల్లా రాంనగర్కు చెందిన దినేష్ (22) తన భార్య బంధువులు బుర్గుపల్లికి వచ్చారు. నిన్న సాయంత్రం బయటకు వెళ్తునానని బైక్పై వెళ్లి గ్రామ సమీపంలోని సుద్దవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అన్నారు.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రేపటితో ముగియనున్నట్లు KU అధికారులు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.