India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాలు నీట మునిగి అపార నష్టం వాటిల్లిందని, ముంపు బాధిత రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన అదిలాబాద్ జిల్లా రైతు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పెన్ గంగ నది పరివాహక ప్రాంతంలో వరదలు పోటెత్తి పత్తి, సోయాబీన్, కంది పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.
నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం వద్ద కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు వేదన అనుభవిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విశ్రాంతి గదులు లేవు. మెట్ల మార్గంలో కనీసం సేద తీరే పరిస్థితి లేదు. మార్గమధ్యలో వర్షం కురిస్తే పూర్తిగా తడిసి పోవాల్సిందే. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జలపాతం వద్ద మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
DOST ద్వారా DEGREE కళాశాలలో స్పెషల్ ఫెజ్ ద్వార ప్రవేశాలు పొందేందుకు నేడు చివరి తేదీ అని ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సంగీత పేర్కొన్నారు. SEP 9 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని SEP 4 నుంచి 9 వరకు వెబ్ అప్షన్ పెట్టుకోవాలన్నారు. SEP 11న సీట్ల కేటాయింపు ఉంటుందని SEP 11 నుంచి 13 వరకు ఆన్ లైన్ పేమెంట్ పూర్తి చేయాలని, SEP 12 నుంచి 13లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని వెల్లడించారు.
కోర్టులో తన తండ్రికి శిక్ష పడుతుందేమో అన్న భయంతో కొడుకు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన జైనథ్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గూడ రాంపూర్కు చెందిన దేవన్నపై జైనథ్ PSలో గతంలో అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నేటి నుంచి వాదనలు ప్రారంభంకానున్నాయి. తండ్రికి శిక్ష పడుతుందేమోనని కొన్ని రోజులుగా కుంగిపోతున్న కొడుకు బండారి సంతోశ్(15)ఈ నెల 6న ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదిలాబాద్ 2- పట్టణ పోలీసులు పేకట స్థావరలపై దాడుల చేసినట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఓ మద్యం షాప్ యజమాని ఇంట్లో తనిఖీలు చేయగా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.2.28 లక్షల నగదు స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేశామన్నారు. అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉన్నారు. మరో చోట దాడులు చేయగా ఐదురిని అరెస్ట్ చేసి, రూ.5.090 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈనెల 29న స్పోర్ట్స్ అండ్ కరాటే అసోసియేషన్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్-2024 పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ తెలంగాణ ఉపాధ్యక్షుడు జితేందర్ సింగ్ భాటియా తెలిపారు. పోటీల్లో వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటుడు సుమన్, టీపీసీసీ అధ్యక్షుడు మహశ్: కుమార్ గౌడ్ హాజరవుతారన్నారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి మహరాష్ట్రలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పిప్పలకోటికి చెందిన జానకొండ నారాయణ(38) గురువారం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కాగా ఇవాళ మహరాష్ట్రలోని అంబాడీ అడవుల్లో అతను కాలిబూడిదై కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఎవరైనా హత్యా చేశారా.. అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.
లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో మున్నూరు కాపు సంఘం యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడు చూపరులను ఆకట్టుకుంటోంది. ఎలుకలు లంబోదరుడిని ఎగరేసి పట్టుకున్నట్లు ఉండే ఈ విగ్రహాన్ని గ్రామ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 11 రోజులు ప్రత్యేక పూజలు చేసి, అనంతరం గోదావరి నదిలో నిమజ్జనం చేస్తామని యూత్ సభ్యులు తెలిపారు.
వినాయక చవితికి మహారాష్ట్ర ప్రాంతంలోని పాలజ్ కర్ర గణపతికి ఓ ప్రత్యేకత ఉంది. కుబీర్ సమీపంలో ఉంటే ఈ గణపతిని 1948లో ప్రతిష్ఠించారు. 1948లో పాలజ్లో అంటువ్యాధులు ప్రబలి 30మందికి పైగా మరణించారు. ఆ సంవత్సరం వచ్చిన వినాయకచవితికి అక్కడి ప్రజలు నిర్మల్లో కొయ్య గణపతిని చేయించి వారి గ్రామంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతిసంవత్సరం నిమజ్జనం చేయకుండా గణపతికి పూజలు చేస్తున్నారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై మండల తాహశీల్దార్లతో ఆమె సమీక్షించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.