India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వినాయక చవితి పండుగ ను శాంతియుత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ కే. సంపత్ వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని సున్నంబట్టి వాడకు చెందిన రాజమల్లు (37) ఇంటీరియర్ వర్క్ చేస్తుంటాడు. ఇవాళ అతను రైలు పట్టాల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొట్టింది. అతనికి తీవ్రగాయాలు కావటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సంపత్ తెలిపారు.
రానున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 28న ఓటర్ తుది జాబితాను విడుదల చేయనున్నట్లు డీపీఓ శ్రీలత తెలిపారు. ఈ నెల 13న వార్డుల వారీగా ఓటర్ జాబితా ముసాయిదా ప్రదర్శన, 14 నుంచి 21 వరకూ అభ్యంతరాల స్వీకరణ, 18, 19 తేదీల్లో రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 26న ఓటర్ జాబితాపై వచ్చిన అభ్యంతరాలు స్వీకరించి 28న తుది జాబిత విడుదల చేస్తామని వెల్లడించారు.
జైనూర్లో జరిగిన ఘర్షణతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జైనూర్ను పూర్తిగా అదుపులోకి తీసుకొని కొత్తవారిని రానివ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మీదుగా వెళ్లే బస్సులను రద్దు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అడిషనల్ DG మహేశ్ భగవత్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, SP గౌష్ ఆలం, SP శ్రీనివాసరావు, ఇతర అధికారులతో చర్చలు జరిపారు.
మందమర్రి పట్టణంలోని ఇందూ గార్డెన్స్లో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు.
2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయలో ఆరో తరగతి అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదిలాబాద్ DEO ప్రణీత పేర్కొన్నారు. ఎంపిక పరీక్ష ద్వారా ప్రవేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 16 లోపు www.navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 2025 జనవరి 18న పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కావున జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT
జైనూర్లో జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరారు. జైనూరు ఘటనలో పోలీసు యంత్రాంగం కేసులను నమోదు చేసిందని, దర్యాప్తు కొనసాగుతుందని, కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. వదంతులను ప్రచారం చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన రక్షిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను అభినందించారు.
పేపర్ బాయ్ టు MLA వరకు ఎదిగిన ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శనీయం. నేడు పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆయన చిన్నతనంలో చదువుతోపాటు పేపర్ బాయ్గా, కాలేజీ రోజుల్లో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరోవైపు విలేకరిగా పనిచేశారు. అనంతరం ITDA పైసా చట్టం ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలుపొందారు.
Sorry, no posts matched your criteria.