Adilabad

News August 27, 2024

ఆదిలాబాద్: చోరీ కేసులో నలుగురి అరెస్ట్

image

చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఆదిలాబాద్ లోని కే.ఆర్.కే కాలనీలో నివాసం ఉండే పెన్నేశ్వరి ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. దీంతో ఆమె మావల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేస్ దర్యాప్తు చేయగా ఐదుగురు యువకులు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. వీరిలో అర్బాజ్, షెహబాజ్, సోహెల్, వాజిద్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు అశోక్ కోసం గాలిస్తున్నామన్నారు.

News August 27, 2024

ADB: ముగ్గురి మృతదేహాలు వెలికితీత

image

ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన అక్షయ్, ఆకాశ్, విజయ్ తాంసీ మండలంలోని బండల్ నాగపూర్‌లోని తమ బంధువు శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. అయితే సరదాగా మంగళవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో గల్లంతు కాగా, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి, ముగ్గురు యువకుల మృతదేహాలు వెలికితీశారు.

News August 27, 2024

ఆదిలాబాద్: చేపల వేటకు వెళ్లి ముగ్గురి గల్లంతు

image

చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు కూలీలు తాంసి మండలంలోని బండల్ నాగపూర్ గ్రామంలో గల బంధువుల ఇంటికి వచ్చారు. మంగళవారం పొచ్చర వాగులో చేపల వేటకు వెళ్లగా వాగులో గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 27, 2024

అడవుల జిల్లాలో.. అందమైన దృశ్యం

image

అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలో సహజ సిద్ధమైన అందాలకు, ప్రకృతి రమణీయతకు కొదవలేదు. వర్ష కాలంలో ఆకుపచ్చని చీరను చుట్టినట్లు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దట్టమైన అడవితో అందాలు కనువిందు చేస్తాయి. ఆకుపచ్చని దట్టమైన చెట్ల మధ్యలో నుంచి నల్లటి తారురోడ్డు ఆదిలాబాద్ మీదుగా వెళ్లే 44 జాతీయ రహదారి విహంగ దృశ్యం కనువిందు చేస్తోంది.

News August 27, 2024

ఆదిలాబాద్‌లో నేడు ఏజెన్సీ బంద్‌కు పిలుపు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్‌ను మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏజెన్సీలోని గిరిజనుల సమస్యల పరిష్కరణ, ఐటీడీఎలోని బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై బంద్ నిర్వహిస్తున్నామన్నారు. దీంతో అన్ని సంఘాల నాయకులు, వ్యాపారస్తులు సహకరించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ విద్యార్థి సంఘం, తుడుందెబ్బ నాయకులు పేర్కొన్నారు.

News August 27, 2024

MNCL: ప్రజలకు నమ్మకం కలిగేలా పోలీసులు విధులు నిర్వర్తించాలి: డీసీపీ

image

పోలీసులు పై ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించేలా ప్రతిఒక్కరూ విధులు నిర్వర్తించాలని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన జైపూర్ సబ్ డివిజన్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. విచారణలోని కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమగ్ర విచారణతో ప్రతి నిందితుడికి శిక్షపడేలా పోలీసు అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.

News August 26, 2024

ఆదిలాబాద్: పంజా విసురుతున్న డెంగీ

image

ఉమ్మడి జిల్లాలో దగ్గు, జలుబు, ఫ్లూ, విష జ్వరాలకు తోడు డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షపు నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసంగా మారింది. నీటి నిల్వలు ఉండకుండా చూసుకుంటూ పరిసరాల పారిశుద్ధ్యం పాటించాలని వైద్య శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఉమ్మడి జిల్లాలో 204 డెంగీ కేసులు నమోదయ్యాయి.

News August 26, 2024

MNCL: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

News August 26, 2024

ADB: ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య

image

ADB జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. చాలా ప్రాథమిక పాఠశాలల్లో 10 నుంచి 25 లోపు విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు. జిల్లాలో ఒక్క టీచర్ కూడా లేని పాఠశాలలు 18 ఉండగా, 85 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇక విద్యార్థులు లేక మూతపడిన స్కూళ్లు 10 ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని పలు పాఠశాలల్లో పలువురు టీచర్ల నిర్లక్ష్య వైఖరే విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

News August 26, 2024

ADB: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ముంబాయి-బల్లార్ష మధ్య నడిచే నందిగ్రాం ఎక్స్‌ప్రెస్ 28, 29 తేదీల్లో ఆదిలాబాద్ వరకే పరిమితం కానుందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నాగపూర్ డివిజన్లో మరమ్మతుల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. 28న సీఎస్ ముంబయి నుంచి బయలుదేరే రైలు(నెంబరు 11401) ఆదిలాబాద్లో నిలిపివేయునున్నట్లు పేర్కొంది. 29న నందిగ్రామ్ రైలు(నెంబరు 11402) ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ముంబయికి బయలుదేరనుంది.