Adilabad

News October 8, 2024

ADB, ASF, MNCL జిల్లాలను ఆ జాబితాలో చేర్చండి: CM రేవంత్

image

ఢిల్లీలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. వామపక్ష, తీవ్రవాద ప్రభావిత (ఎల్‌డబ్ల్యూఈ) జిల్లాల జాబితాలో నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల,ఆసిఫాబాద్ జిల్లాలను తిరిగి ఆ జాబితాలో చేర్చాలని అమిత్ షా ను రేవంత్ రెడ్డి కోరారు.

News October 8, 2024

తాండూర్: స్నేహితులతో క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి

image

క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన తాండూర్ మండలంలో చోటు చేసుకుంది. విద్యాభారతి పాఠశాలలో విద్యాభారతి బలగం పేరిట పూర్వ విద్యార్థులు క్రికెట్ ఆడుతున్నారు. ఇందులో భాగంగా రాచకొండ లక్ష్మీనారాయణ క్రికెట్ ఆడుతూ అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి వరకు తమతో ఉత్సాహంగా క్రికెట్ ఆడిన మిత్రుడి మరణంతో తోటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.

News October 8, 2024

ఆదిలాబాద్: గ్రామాల్లో అప్పుడే మొదలైన ఎన్నికల హడావుడి

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. సర్పంచ్‌గా పోటీ చేయడానికి ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయా గ్రామాలలో పాత వారితో పాటు కొత్తగా బరిలో నిలవడానికి నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 468, మంచిర్యాల 311, నిర్మల్ 396, ఆసిఫాబాద్‌లో 355 పంచాయతీలు ఉన్నాయి.

News October 7, 2024

భవిష్యత్తు కోసం అడవులను కాపాడుకుందాం:ఎఫ్ఆర్ఓ

image

భవిష్యత్తు కోసం అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందామని కడెం మండలంలోని ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ అనిత సూచించారు. 70వ అటవీ సంరక్షణ వారోత్సవాలలో భాగంగా సోమవారం ఉడుంపూర్ పరిధిలోని అటవీ ప్రాంతాలలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషికి మనుగడ ఉంటుందన్నారు. వాటిని కాపాడుకుందామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

News October 7, 2024

బెజ్జూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళా మృతి

image

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందింది. ఏఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడిగూడకు చెందిన అల్లూరి లక్ష్మీ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లింది. నీళ్లు తీసుకువచ్చే క్రమంలో కాలుజారి బావిలో పడి మృతి చెందింది. భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

News October 7, 2024

యోగా ఛాంపియన్షిప్‌లో జాతీయస్థాయికి బాసర విద్యార్థులు

image

TYSA ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెవులో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో నిర్మల్ జిల్లా బాసరకు చెందిన చరణ్, అవినాశ్ జాతీయస్థాయికి ఎంపికైనట్లు సోమవారం నిర్మల్ జిల్లా యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేశ్ తెలిపారు. ఇందులో అవినాష్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఇది ఐదో సారి అని తెలిపారు. విద్యార్థులకు పలువురు అభినందించారు.

News October 7, 2024

నిర్మల్: రూ.7,33,999తో అమ్మవారి అలంకరణ

image

నిర్మల్ పట్టణంలోని ధ్యాగవాడ హనుమాన్ ఆలయంలో కొలువు దీరిన దుర్గా మాత మండపం వద్ద ఆదివారం రాత్రి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించారు. రూ.500, రూ.200, రూ.100 ఇతర నోట్లతో మొత్తం రూ .7,66,999తో అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు..

News October 7, 2024

మంచిర్యాల: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

image

పెళ్లి చేసుకుంటానని ప్రియుడు మోసం చేయడంతో ప్రియురాలు అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. బాధితురాలి వివరాల ప్రకారం.. మంచిర్యాల నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి, గొల్లపల్లి గ్రామానికి చెందిన రేచవేని రాజశేఖర్ 2ఏళ్లుగా ప్రేమించుకున్నారు. తనను శారీరకంగా లోబరుచుకొని, పెళ్లి మాట ఎత్తే సరికి ముఖం చాటేశాడని యువతి తెలిపింది. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని పేర్కొంది.

News October 7, 2024

బోథ్: ‘సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు’

image

బోథ్ PHCలో గత మార్చి నెలలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్న ఆదివాసి మహిళ డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 31న మహిళ అనారోగ్యంతో మరణించిందని సివిల్ అసిస్టెంట్ సర్జన్ ద్వారా పోస్టుమార్టం నివేదికలో తేలిందని జిల్లా DSP జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సాధారణ మరణంపై ప్రస్తుతం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News October 7, 2024

ఆదిలాబాద్: ఆరో విడత ద్వారా ITIలో అడ్మిషన్లు

image

ఆరో విడత ద్వారా ఐటీఐ కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ITI కళాశాల ప్రిన్సిపాల్ రొడ్డ శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 9 వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నమోదు చేసుకున్న అభ్యర్థులు, తిరిగి నమోదు చేయనవసరం లేదని పేర్కొన్నారు. ఇంకా నమోదు చేయని అభ్యర్థులు ఐటీఐ పోర్టల్‌లో కొత్తగా నమోదు చేసుకుని, కళాశాలకు హాజరు కావాలని సూచించారు.