Adilabad

News October 4, 2024

ఆదిలాబాద్: వెబ్ అప్షన్స్ పెట్టుకోవడానికి నేడే LAST

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పీజీ M.A ఎకనామిక్స్ M.Com రెగ్యులర్ కోర్సులలో రెండవ విడతలో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఈనెల 4వ తేదీవరకు గడువు ఉందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతీక్ బేగం కోఆర్డినేటర్ చంద్రకాంత్ తెలిపారు. CPGET రాసిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఇతర వివరాలకై కళాశాలను సంప్రదించాలని కోరారు.

News October 4, 2024

ఆదిలాబాద్: ఈనెల 5న అంతర్జాతీయ ఉద్యోగ మేళా

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 5న అంతర్జాతీయ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వ, ఉద్యోగ, శిక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 21 నుంచి 41 ఏళ్లలోపు ఉండి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులన్నారు.

News October 4, 2024

ఆర్థిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఆర్థిక మోసలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దౌత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదనపు కలెక్టర్ దాసరి వేణు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఏజీఎం రాధికభరత్ లతో కలిసి ఆర్థిక మోసాలు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలు ఓటిపిలు ఎవరికి చెప్పవద్దని, అపరిచిత ఫోన్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 4, 2024

ఆదిలాబాద్: అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని 163 ప్రాథమిక ఉన్నత, ఉన్నత పాఠశాలల్లో బాలికల ఆత్మరక్షణ సాధనకై సుశిక్షితులు అయిన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ డీఈవో ప్రణీత తెలిపారు. దరఖాస్తుదారులు https://forms.gle/KWHjcwmyrCoodwWm9 లింక్
ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. శిక్షకులను జిల్లా కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. ఈనెల 8న డిఈఓ ఆఫీసులో అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.

News October 3, 2024

వరి కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి: సీఎం

image

ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీ రాజర్షిషా, గౌస్ ఆలం పాల్గొన్నారు. అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే DSC అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News October 3, 2024

బెల్లంపల్లి: PG సీట్ల వెబ్ ఆప్షన్స్.. ఈనెల 4న చివరి తేదీ

image

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న కాకతీయ యూనివర్సిటీ PG రెగ్యులర్ కోర్సుల కోసం 2వ విడతలో అక్టోబర్ 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి గడువు ఉందని ప్రిన్సిపల్ శంకర్, కోఆర్డినేటర్ తిరుపతి తెలిపారు. వారు మాట్లాడుతూ..2024-25 విద్య సంవత్సరానికి CPGET ఎంట్రన్స్ పరీక్షలు రాసిన విద్యార్థులు విషయాన్ని గమనించాలని సూచించారు.

News October 3, 2024

నిర్మల్: కల్లులో కలిపే కెమికల్స్ పట్టివేత

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని భారీగా కల్లులో కలిపే రసాయనాలను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. స్థానిక శాంతినగర్ కాలనీలోఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.43 లక్షల విలువైన 26 సంచుల క్లోరల్ హైడ్రేడ్, మూడు కిలోల ఆల్ఫోజోలం సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 3, 2024

బెల్లంపల్లి: ‘ఆధారాలతో నిరూపిస్తే రూ.60 లక్షలు చెల్లిస్తా’

image

ఆరిజన్ డైరీ CAOబోడపాటి శేజల్ చేసిన ఆరోపణలపై బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రూ.30లక్షలు తీసుకున్నట్టు ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఏసీపీ దగ్గర ఆధారాలతో సహా బయట పెడితే రూ.60లక్షలు చెల్లిస్తానని ఛాలెంజ్ విసిరారు. లేని పోనీ ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

News October 3, 2024

ఆదిలాబాద్: కృష్ణా EXPRESSకి 50 ఏళ్లు

image

కృష్ణా EXPRESSకి 50 ఏళ్లు పూర్తయ్యాయి. అక్టోబరు 2, 1974లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకి డీజిల్ ఇంజిన్‌తో లాంఛనంగా ప్రారంభించారు. ఇరు ప్రాంతాల మధ్య కృష్ణా నది ఉండటం వల్లే దానికి ‘కృష్ణా ఎక్స్‌ప్రెస్’ అనే పేరును పెట్టారు. అప్పట్లో పగటిపూట నడిచే మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్ రైలు ఇదే. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు నడుస్తోంది కృష్ణా ఎక్స్‌ప్రెస్‌తో మీకున్న అనుబంధం ఎలాంటిదో కామెంట్ చేయండి.

News October 3, 2024

ఆదిలాబాద్: వ్యక్తిపై కత్తితో దాడి

image

ఆదిలాబాద్ రాంపూర్ వంతెన సమీపంలో ఓ వ్యక్తిపై పలువురు హత్యాయత్నానికి పాల్పడినట్లు రూరల్ ఎస్సై ముజాహిద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఇజ్రాయెల్‌‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన పలువురు ఆయనను రాంపూర్ వద్దకు పిలిపించారు. అక్కడికి వచ్చిన ఇజ్రాయిల్ పై లక్షెట్టిపేటకు చెందిన అఫ్రోజ్ తో పలువురు కత్తితో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.