Adilabad

News August 10, 2024

ADB: కాలం చెల్లిన మందుల ఘటనలో ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్

image

ఖానాపూర్ సామాజిక ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను వినియోగించిన ఘటనలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు ఐదుగురు ఉద్యోగులకు మెమోలు జారీ చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఘటనకు సంబంధించి డీఎంహెచ్ఓ రాజేందర్, డీసీహెచ్ఎస్ సురేష్‌ల ఆధ్వర్యంలో విచారణ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా సునీత (ఫార్మసిస్ట్), చంద్రకళ (స్టాఫ్ నర్స్)లను విధుల నుంచి తొలగించారు. పలువురికి మెమోలు జారీ చేశారు.

News August 10, 2024

కాసిపేట: జ్వరంతో ఎనిమిది నెలల గర్భిణి మృతి

image

కాసిపేట మండలంలోని రేగులగూడెంకు చెందిన గెడెం పార్వతి (22) 8 నెలల గర్భిణి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పార్వతికి నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో మంచిర్యాల మాతా శిశు కేంద్రం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందగా పరిస్థితి విషమించడంతో వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వరంగల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

News August 10, 2024

బెల్లంపల్లి ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక లేఖ

image

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు మావోయిస్టులు హెచ్చరికలు చేస్తూ లేఖ విడుదల చేయడం సంచలనం రేపింది. ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని మావోయిస్టు సింగరేణి డివిజన్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ మండిపడ్డారు. ఢిల్లీలో మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో రౌడీలను, గూండాలను ప్రోత్సహిస్తే బుద్ధి చెబుతామన్నారు. వినోద్ తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.

News August 10, 2024

ఉమ్మడి ADB జిల్లాలో నిండుగా జలాశయాలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 15 కు పైగా ప్రాజెక్టులు, వాగులు ఉన్నాయి. ఇవన్నీ కురుస్తున్న వర్షాలకు నిండి పోయాయి. వీటి పైనే ఆధారపడి అన్నదాతలు పంటలు సాగు చేస్తున్నారు. కడెం, స్వర్ణ, కొరాట చనఖా, సత్నాల, గడ్డెన్న, వట్టివాగు, పీపీరావు, నీల్వాయి, ర్యాలీ వాగు, ఎన్టీఆర్ , గొల్లవగు, ఎన్టీఆర్, జగన్నాథ్ పూర్, కొమరం భీం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో 6.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

News August 10, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సైల బదిలీలు

image

బాసర జోన్ పరిధిలో ఎస్ఐలను బదిలీలు చేస్తూ బాసర జోన్ 2 ఐజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ADB, నిర్మల్ జిల్లాలో పలువురు ఎస్ఐలకు స్థానచలనం కలిగింది. కుంటాల ఎస్ఐ రజినీకాంత్ బదిలీకాగా ఆయన స్థానంలో భాస్కర్ చారి, బోథ్ ఎస్ఐ రాము బదిలీకాగా ఆయన స్థానంలో ఎల్.ప్రవీణ్, బజరహత్నూర్ ఎస్సై నరేష్ బదిలీ కాగా ఆయన స్థానంలో అప్పారావు నియమితులయ్యారు. భైంసా టౌన్ ఎస్సై మహమ్మద్ షరీఫ్ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు.

News August 10, 2024

జైపూర్: అవయవదానంతో ఏడుగురికి ప్రాణదానం

image

జైపూర్ మండలంలోని షెట్పల్లి గ్రామానికి చెందిన రేవెల్లి శ్రీకాంత్ అనే యువకుడు తాను మరణిస్తూ ఏడుగురి వ్యక్తుల జీవితాల్లో వెలుగు నింపాడు. ఈ నెల 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు శ్రీకాంత్ రెండు కిడ్నీలు, లివర్, గుండె, రెండు కళ్లు, ఊపిరితిత్తులు దానం చేశారు. శ్రీకాంత్‌కు భార్య స్వప్న, కుమారుడు ఉన్నారు.

News August 10, 2024

ఆదిలాబాద్: ‘సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలి’

image

గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి గ్రామాలను పరిశుభ్రతతో పాటు, సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్వచ్ఛదనం పచ్చదనం జిల్లా ప్రత్యేక అధికారి, మెంబర్ సెక్రటరీ టీజీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జి.రవి సూచించారు. శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనం ప్రత్యేక అధికారి రవి కలెక్టరేట్ సమావేశం నిర్వహించారు. గ్రామంలో, మున్సిపాలిటీలలో చేపట్టిన కార్యక్రమల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News August 9, 2024

మామడ: కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త

image

మామడ మండలం మొండిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని దంజి నాయక్ తండాలో కట్టుకున్న భార్యను భర్త హతమార్చాడు. గ్రామస్తులు,పోలీసులు తెలిపిన వివరాలు.. రాథోడ్ సుజాతకు 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. గురువారం రాత్రి భార్యాభర్తలకు గొడవ జరిగింది. భర్త దేశ్పాల్ భార్య సుజాతను గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ గంగారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

News August 9, 2024

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✧ADB: నేతకాని కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
✧ఖానాపూర్: ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమిద్దాం.
✧జన్నారం: భక్తి శ్రద్దల మధ్య నాగపంచమి.
✧ADB: అన్నా. వదినపై దాడి.. కేసు నమోదు.
✧ADB: ఆర్టీసీ బస్సు అద్దెకి తీసుకున్న వారు10 శాతం రాయితీ.

News August 9, 2024

చెన్నూర్: ఏసీబీ వలకు చిక్కిన ఇరిగేషన్ అధికారి

image

మంచిర్యాల జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో పడింది. చెన్నూర్‌లో ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జాడి చేతన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మిషన్ కాకతీయ పనులకు సంబంధించి బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ వద్ద రూ.5 వేలు రివార్డుగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏవోను అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకొని కరీంనగర్ లోని ఏసీబీ కోర్టుకు తరలించారు.