India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒకే సంవత్సరంలో ఆరు ఉద్యోగాలు సాధించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కూతురు నిఖితను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డివి శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. కృషి, పట్టుదల, అంకితభావం ఉంటేనే ఇలాంటి విజయాలు సాధ్యమని, ఒక సంవత్సరంలో ఆరు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసి హక్కుల కోసం పోరాడిన మహిళ ఆత్రం సుగుణ అని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో ఆత్రం సుగుణను మంత్రి సీతక్క మెమొంటో ఇచ్చి సన్మానించారు. ఆదివాసుల హక్కుల కోసం అనేక సందర్భాలలో సుగుణ పోరాటాలు నిర్వహించాలన్నారు. అంతకుముందు సుగుణ ఆదివాసి దినోత్సవంలో పాల్గొని మన్యం వీరుడు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో చోటుచేసుకుంది. బాధితులు మాట్లాడుతూ.. ఇంట్లో దాచుకున్న రూ.లక్ష నగదుతో సహా బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న MPDO శ్రీనివాస్, ఆర్ఐ అంజన్ కుమార్ ఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల కల్పన పనులు 645 పాఠశాలల్లో పూర్తయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.23.24 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు రూ.8 కోట్లు విడుదల చేసింది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా తాగునీరు, విద్యుదీకరణ, నూతన తరగతి గదుల నిర్మాణం, డైనింగ్ హాల్ నిర్మాణం వంటి పనులు చేశారు.
శ్రావణమాసంలో పెళ్లి ముహూర్తాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్న వారికి 10 శాతం డిస్కౌంట్ ఉంటుందని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన తెలిపారు. డిపాజిట్ లేకుండా ప్రయాణించే కాలానికి, దూరానికి మాత్రమే ఛార్జ్ వసూలు చేస్తామని పేర్కొన్నారు. నేటి నుంచి సెప్టెంబర్ మూడో తేదీ వరకు ఆర్టీసీ బస్సు బుక్ చేసుకునే బస్సులకు 10 శాతం డిస్కౌంట్ కూడా ఉంటుందన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అన్న, వదినపై దాడి చేసిన కేసు మావల పోలీసు స్టేషన్లో గురువారం నమోదైంది. ఏఎస్ఐ మహ్మద్ యూనుస్ వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ న్యూహౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన రాథోడ్ చరణ్, అతడి అన్న రాథోడ్ కిషన్ ఇంటికి బుధవారం రాత్రి వెళ్లి ఇంట్లో ఉన్న రాథోడ్ కిషన్, అతడి భార్య చంద్రకళపై గొడ్డలితో దాడి చేసే యత్నం చేశాడు. వారు ఇంట్లో నుంచి పారిపోయారు. బాధితురాలు చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా అయిదు పంచాయతీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. తలమడుగు మండలంలో పూనాగూడ, బజారత్నూర్ మండలంలో యేసాపూర్, తాంసి మండలంలో అత్నంగూడ, ఇచ్చోడ మండలంలో ఎల్లమ్మ గూడ, ఉట్నూరు మండలంలో వడగల్పూర్–కే గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 468 పంచాయతీలుండగా తాజాగా వాటి సంఖ్య 473కు చేరుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డెంగీ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందాయి. దగ్గు, జలుబు, ఫ్లూ, విష జ్వరాలతో పాటు డెంగీతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బాధితులు బారులు తీరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మొత్తం 45 డెంగీ కేసులు నమోదయ్యాయి. అలాగే మలేరియా కేసులు మాత్రం కుమురం భీం జిల్లాలో మాత్రమే నమోదయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో విద్యార్థులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంపై ఉపన్యాస, వ్యాసరచన, రంగోలి పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదివాసీ దినోత్సవ ప్రాముఖ్యతను తెలియచేయాలన్నారు.
మహిళలను ఆర్థికంగా మరింత ప్రగతిబాటలో పయనింపజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం మహిళ వికాస జిల్లా సమాఖ్య కార్యవర్గ సమావేశాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా ఆదాయం పెంపొందించే దిశగా శిల్పారామం లో, గాంధీ పార్కులో స్టాల్స్ ఏర్పాటు చేసి ఉపాధి పొందాలన్నారు.
Sorry, no posts matched your criteria.