India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. 1952లో ఆసిఫాబాద్ నుంచి ఎన్నికై హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. 1971 వరకు శాసనసభ్యుడిగా కొనసాగాడు. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలు.

కడెం ప్రాజెక్టు నీటి వివరాలను అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగుల కాగా, శుక్రవారం ఉదయం ప్రాజెక్టులో 700 పూర్తిస్థాయి నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 902 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో కుడి, ఎడమ కాలువలకు 806, మిషన్ భగీరథకు 9 మొత్తం 902 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఒంటరిగా ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన జాదవ్ సాహెబ్ రావు ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేసి పారిపోయినట్లు తెలిపారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెల్లడించారు.

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణ పరిస్థితులు కొనసాగించడానికి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని SP గౌష్ ఆలం తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో DSP ఆపై స్థాయి అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించకూడదన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెండో సంవత్సరం ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. 2024 జులైలో నిర్వహించిన రెండో సంవత్సరం 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం ఉమ్మడి జిల్లా విద్యార్థులు https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# సైట్ను సందర్శించాలని సూచించారు.

నిర్మల్ జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు దాసరి రమేశ్, వెంకటేశ్ గౌడ్ను బిట్ కాయిన్/క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై స్పందించి డీఈవో రవీందర్ రెడ్డి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తాంసీ మండలంలోని గోట్కూరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 5 వ తరగతి వరకు 53 మంది విద్యార్థులకు ఒకరే టీచర్ ఉన్నారు. ప్రస్తుతం ఉపాద్యాయురాలు రోజా రాణి ఒకరే అన్ని తానై విధులు నిర్వహిస్తున్నారు. సరి పడా టీచర్లు లేక పోవడంతో 3 నెలలు గా తమ పిల్లల చదువును నష్ట పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

పెంచికల్పేట మండలంలోని కొండపల్లిలో నాలుగు కాళ్ల కోడి పిల్ల జన్మించింది. గ్రామానికి చెందిన చౌదరి గంగయ్య కొంతకాలంగా కోడిని పెంచుకుంటున్నారు. అది 9 పిల్లలకు జన్మనివ్వగా, ఇందులో ఒక దానికి నాలుగు కాళ్లు ఉన్నాయి. జన్యు లోపాలతో నాలుగు కాళ్లు ఉన్న కోడి పిల్లలు అరుదుగా జన్మిస్తుంటాయని పశు వైద్య నిపుణులు తెలిపారు.

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25 – OCT 1 వరకు వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సబితా అన్నారు. ఈ నెల 26న వృద్ధాశ్రమాల్లో వయోవృద్ధుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, 27న వాకతాన్ ర్యాలీ, 28న ఆరోగ్య సంరక్షణపై అవగాహన సదస్సు, 29న తల్లిదండ్రుల పోషణ, 30న గ్రాండ్ పేరెంట్స్ డే, OCT 1న వారోత్సవాలు ముగుస్తాయన్నారు.

బుధవారం నిర్మల్ జిల్లాకు కేటాయించిన 7 మంది ట్రైనీ ఎస్సైలు జిల్లా ఎస్పీ జానకీ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. క్రమశిక్షణతో ఉంటూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ శిక్షణలో అన్ని రకాల డ్యూటీలు నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.