Adilabad

News August 8, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి ముఖ్యాంశాలు

image

◆బజారత్నూర్: ఘోర రోడ్డుప్రమాదం.. వ్యక్తి మృతి
◆ఆసిఫాబాద్: గంజాయి సాగుచేసిన వ్యక్తికి జైలు శిక్ష
◆కోటపల్లి: పేకాట స్థావరంపై పోలీసులు దాడి
◆ఆదిలాబాద్: కలెక్టర్ క్యాంపు సమీపంలో దొంగతనం
◆భీమిని: వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
◆ఆదిలాబాద్: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి
◆నిర్మల్: ట్రాన్స్ఫార్మర్ల దొంగ అరెస్ట్
◆భైంసా: దొంగను పట్టుకున్న కాలనీవాసులు
◆మాజీ మంత్రి రామన్న సోదరుడు మృతి

News August 8, 2024

ADB: స్కిల్ డెవలప్మెంట్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను LG హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ ద్వారా 100 మంది అభ్యర్థులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ పేర్కొన్నారు. ఆగస్టు 9 నుంచి 24వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, శిక్షణ 90 రోజుల పాటు ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ప్లేస్ మెంట్స్ కల్పించనున్నారు.

News August 8, 2024

ఆసిఫాబాద్: గంజాయి సాగుచేసిన వ్యక్తికి జైలు శిక్ష

image

జైనూరు మండలం కిషన్ నాయక్ తండా, చింతకర్ర గ్రామానికి చెందిన తిరుపతికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా జడ్జి రమేశ్ తీర్పునిచ్చారు. CI అంజయ్య వివరాల ప్రకారం.. తిరుపతి వ్యవసాయ క్షేత్రంలో తనిఖీ చేయగా సుమారుగా 200 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో అతడిపై కేసు నమోదుచేసి కోర్టులో హజరుపర్చగా కోర్టు అతడికి శిక్ష విధించిందన్నారు.

News August 8, 2024

నిర్మల్: ఈనెల 12న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్స్

image

నిర్మల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 12న స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రమేశ్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 11వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 8, 2024

ADB కలెక్టర్ క్యాంపు ఆఫీస్ సమీపంలో దొంగతనం

image

ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. కలెక్టర్ క్యాంపు ఆఫీస్ వద్ద బుధవారం రాత్రి పుండలిక్ అనే వ్యక్తి కిరణ కొట్టులో దొంగతనం జరిగింది. గత రెండు సంవత్సరాలు నుంచి తోపుడు బండిలో కిరణకొట్టు నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా నెల రోజుల్లో రెండు సార్లు దొంగతనం జరిగిందని బాధితుడు వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 8, 2024

ADB: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి

image

గుండెపోటుతో దివ్యాంగ ఉపాధ్యాయురాలు మృతి చెందారు. ఆదిలాబాద్‌ సుభాష్ నగర్ కాలానికి చెందిన మమత గాదిగుడా మండలంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు నిన్న గుండెపోటు రాగా హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మమత మృతిచెందారు. ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధికార ప్రతినిధి పడాల రవీందర్ డిమాండ్ చేశారు.

News August 8, 2024

ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులు పూర్తిచేస్తాం: భట్టి

image

ఉమ్మడి జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి
చేసి సాగునీరు అందిస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో
మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ చేపడతామని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామన్న ఆయన..కుప్టీ, త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కొమురంభీం ప్రాజెక్ట్, సుద్దన్నవాగు, గడ్డెన్నవాగు ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు.

News August 8, 2024

జన్నారం: అడవిపంది దాడిలో మహిళకు గాయాలు

image

జన్నారం మండలం బాదంపల్లి గ్రామానికి చెందిన ముంజం లక్ష్మికి అడవి పంది దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం గ్రామ సమీపాన తన పంట చేనులో పనిచేస్తుండగా అడవి పంది దాడి చేసింది. దీంతో ఆమె కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించి కాలికి చికిత్సను చేయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అటవీ అధికారులకు తమకు సహాయం అందించాలని కోరారు.

News August 8, 2024

MNCL: ఏడు నెలల్లో ఆరుగురు కార్మికులు మృతి

image

వరుస ప్రమాదాలు సింగరేణి కార్మికులను కలవరపెడుతున్నాయి. గనుల్లో పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకుంటున్నామని యాజమాన్యం చెబుతున్నప్పటికీ ఉద్యోగులు చనిపోవటం, తీవ్రగాయాలపాలవడం ఆందోళన కలిగిస్తోంది. సింగరేణి వ్యాప్తంగా ఈ ఏడాది జులై 31 వరకు 39 ప్రమాదాలు నమోదుకాగా 41 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆరుగురు మృతి చెందారు.

News August 8, 2024

ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉండకూడదు: డిప్యూటీ సీఎం భట్టి

image

ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో 400 కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పర్యటనలో మాట్లాడుతూ.. గుండెల నిండా ప్రేమను పంచేటువంటి ప్రజలున్న ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉండటానికి వీలులేదని అన్ని జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాను మా గుండెల్లో పెట్టి చూసుకుంటామని తెలిపారు.