India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాదయాత్ర ప్రారంభానికి తొలి అడుగు నేలైన బజారత్నుర్ పిప్పిరి గ్రామాన్ని దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పర్యటనలో వరాల జల్లులు కురిపించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 45 కోట్లు, పిప్పిరిలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించారు. బుగ్గారం, తేజ్పూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
★ దహేగం: 14క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత
★మంచిర్యాల: ఆటో దొంగల అరెస్ట్
★ ఆదిలాబాద్: అనారోగ్యంతో జూనియర్ అసిస్టెంట్ మృతి
★ కాగజ్ నగర్: ప్రమాదవశాత్తు కూలిన ఇంటిషెడ్డు
★ కెరమెరి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత
★ తిర్యాని: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
★ బెల్లంపల్లి: విద్యార్థుల మధ్య గొడవ.. ఒకరికి గాయాలు
★ కుబీర్: బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
★ నెన్నెల: మామిడి చెట్ల నరికివేతపై ఫిర్యాదు
ఉమ్మడి ADB మండలంలోని మూడు భవిత కేంద్రాల్లో ఆయా పోస్టులను తాత్కాలిక పద్ధతిన భర్తీ చేసేందుకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ MEO సోమయ్య పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన మహిళలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. నెలకు గౌరవ వేతనం రూ.3,250 ఉంటుందని, ఆదిలాబాద్ డైట్ కళాశాల, మావల, అంకోలిలోని కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. ఆసక్తిగలవారు కార్యాలయంలో 9లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అందమైన జిల్లా అని, జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. గతంలో పిప్పిరి గ్రామం నుండి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను ఎన్నో చూశానన్నారు.
తీర్యాని మండలంలోని గుండాల జలపాతంలో గల్లంతైన యువకుడు రిషి మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. సోమవారం గుండాల జలపాతంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన రిషి ఆదిత్య గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం గాలింపు చర్యలు చేపట్టిన మృతదేహం లభ్యం కాకపోవడంతో, బుధవారం గాలింపు చర్యలు కొనసాగించారు. ఎట్టకేలకు బుధవారం మృతదేహాన్ని కనుగొన్నారు.
బజార్హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో పర్యటనకు వచ్చిన రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భొజ్జు పటేల్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందు ఉంచుతామన్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఎ పీఓ ఖుష్బూ గుప్తా అధికారులు నేతలు పాల్గొన్నారు.
ప్రజలతో మమేకమై పోలీసులు పనిచేయాలని నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి సూచించారు. బుధవారం మధ్యాహ్నం ఖానాపూర్లోని సీఐ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని వివిధ మండలాల ఎస్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై పనిచేసిన అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సైదారావు, ఎస్ఐలు ఉన్నారు.
ADB:KU డిగ్రీ (థియరీ) 6వ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 17న పరీక్ష నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.తిరుమల దేవి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్ను నిన్న విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ లోపు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
TOSS ఓపెన్ స్కూల్ విధానంలో 2024-25 సంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖధికారిణి ప్రణీత తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా AUG 8 నుంచి SEP 10 వరకు, అపరాధ రుసుంతో SEP 11 నుంచి OCT 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
>> SHARE IT
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామానికి చెందిన రైతు గోక సంజీవ రెడ్డి (48) వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దుల బండిపై పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఎడ్ల బండిపై ఉండగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు అతడి కుటుంబీకులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.