India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆసిఫాబాద్ జిల్లాలోని గర్భిణుల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత రెండేళ్లలో 10 మంది గర్భిణులు మృతిచెందారు. కాగా జిల్లాలో 3,939 మంది గర్భిణులు ఉండగా వారిలో 1,894 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అంగన్వాడీల ద్వారా అందాల్సిన పోషకపదార్థాల్లో నాణ్యత లేకపోవడం, సక్రమంగా పంపిణీ కావడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారికి ప్రసవ సమయంలో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అసిఫాబాద్ జిల్లాలో మాదక ద్రవ్యాలను ఏ రూపంలో ఉన్నా నియంత్రించాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో కలిసి నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగంతో పాటు ఇతర సంబంధిత శాఖలు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
సింగరేణి సంస్థలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కార్పొరేట్ జీఎం ఎం.సుభాని, భూపాలపల్లి జీఎం డి.రవిప్రసాద్, మందమర్రి జిఎం ఎ.మనోహర్, ఆర్జీ వన్ జీఎం చింతల శ్రీనివాస్, మార్కెటింగ్ జిఎం జి. దేవేందర్, కార్పొరేట్ జిఎం సుశాంత సాహ, మణుగూరు జిఎం డి. లలిత్ కుమార్, అర్జీ వన్ ఏజెంట్ బానోతు సైదులు, శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే గ్రూప్ ఏజెంట్ ఎం.శ్రీనివాస్ బదిలీ అయ్యారు.
◆ నేరడిగొండ: తప్పిన పెను ప్రమాదం
◆ రెబ్బెన: ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం
◆ మంచిర్యాల: చికిత్స పొందుతూ హాస్టల్ వార్డెన్ మృతి
◆ బైంసా: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
◆ సిరికొండ : అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత
◆ బైంసా: పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య
◆ నిర్మల్: అదృశ్యమైన వ్యక్తి.. శవమై తెలి
◆ తిర్యాని: లభించని గల్లంతైన యువకుడి సమాచారం
◆ దండేపల్లి: అక్రమంగా తరలిస్తున్న టేకు పట్టివేత
మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం బైంసా మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ మారుతి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేగాం గ్రామానికి చెందిన గడ్డమత్తుల సుభాష్ (35) మద్యానికి బానిసై మద్యం మత్తులో గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడడానికి కృషి చేసిన ACP, CIలకు DGP జితేందర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు. హైదరాబాద్లోని రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మంచిర్యాల రూరల్ CI అశోక్ కుమార్, మందమర్రి CI శశిధర్ రెడ్డి, శ్రీరాంపూర్ CI మోహన్లు వీరు పనిచేసిన పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన హత్య కేసులో కేసు నమోదు చేసి నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటానికి కృషి చేశారు.
DEECETలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు AUG 1 నుంచి 6 వరకు షెడ్యూల్ ప్రకారం ఆదిలాబాద్ డైట్ కళాశాలలో వెరీఫికేషన్ ప్రక్రియ జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డా.రవీందర్ రెడ్డి తెలిపారు. ఐదు రోజుల్లో 511 మంది వెరీఫికేషన్కు హాజరు కాలేదన్నారు. ఆ సీట్ల కోసం AUG 7న వెరీఫికేషన్ చేసుకోవడానికి వారికి మరో అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆసిఫాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కేతావత్ సర్దార్ సింగ్, సంధ్య దంపతుల కుమార్తె కేతావత్ నిఖిత ఏడాది కాలంగా పోటీపడ్డ ప్రతి ఉద్యోగాన్ని సాధించింది. మైనార్టీ గురుకులంలో టీజీటీ, అదే గురుకులంలో జూనియర్ లెక్చరర్, సాంఘిక సంక్షేమ గురుకులంలో పీజీటీ, గురుకుల సొసైటీలో డిగ్రీ లెక్చరర్ పోస్టు, టీఎస్పీఎస్సీ గ్రూప్-4, టీఎస్పీఎస్సీలో జూనియర్ లెక్చరర్ పోస్టులను వరుసగా సాధించింది.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. నిన్న అదృశ్యమైన ఓ వ్యక్తి ఇవాళ చెరువులో శవమై కనిపించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉమార్ అనే వ్యక్తి నిన్నటి నుంచి కనిపించకుండా పోయాడు. అయితే ఇవాళ అతని శవం స్థానికులకు చెరువులో కనిపించింది. దీంతో వారు మృతుడి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు.
శ్రావణమాసం ప్రారంభం కావడంతో పల్లె, పట్టణాల్లో పూజలు మొదలయ్యాయి. పెళ్లి సందళ్లు సన్నాయి సవ్వడులు వినిపించనున్నాయి. రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశమున్న తరుణంలో ఇళ్లవద్ద ఇబ్బందులుంటాయని కళ్యాణ మండపాలపైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పెళ్లి బాజా మోగనున్న నేపథ్యంలో అనేక మందికి చేతినిండా పనులు లభించనున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 20వేల జంటలు ఏకం కానున్నట్లు అర్చకుల టాక్.
Sorry, no posts matched your criteria.