Adilabad

News August 6, 2024

వాంకిడి: కడుపు నొప్పితో విద్యార్థిని ఆత్మహత్య

image

కడుపునొప్పి భరించలేక వాంకిడి మండలానికి చెందిన యువతి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై సాగర్ తెలిపారు. బెండార గ్రామానికి చెందిన సోనీ(20) హైదరాబాద్‌లో GNM సెకండియర్ చదువుతోంది. గతేడాదిగా ఆమె కడుపునొప్పితో భాదపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ప్రయోజనం లేకపోయింది. దీంతో సోమవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

News August 6, 2024

స్వచ్ఛదనం-పచ్చదనం’ అమలుకు ప్రత్యేకాధికాధికారులు

image

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5నుంచి 9వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమ అమలు పర్యవేక్షించేందుకు గాను ఉమ్మడి జిల్లాకు ఇద్దరు ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులుగా నియమించింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ జి.రవి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కె.ఇలంబరిదిలను నియమించారు.

News August 6, 2024

ADB: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క షెడ్యూల్

image

బజార్హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామానికి బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నారు. ఉదయం 11:15నుంచి 1:30 గంటల వరకు పిప్రిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు వెల్లడించారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలన్నారు.

News August 5, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి TOP NEWS

image

★ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
★కాగజ్‌నగర్: మట్కా ఆడుతూ పట్టుబడిన యువకుడు
★ముధోల్: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
★రామకృష్ణాపూర్: ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్
★నస్పూర్: పేకాట ఆడుతున్న ముగ్గురు పట్టివేత
★నేరడిగొండ: లారీ ఢీకొని వృద్ధురాలి మృతి
★నిర్మల్: వైన్ షాపులో చోరీ
★మంచిర్యాల:షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు
★మంచిర్యాల: పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్

News August 5, 2024

అఖండ జ్యోతి కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే

image

తలమడుగు పరమహంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరి మాతజీ దివేనలతో అర్లిలో 24 సంవత్సరాల తర్వాత ఈరోజు అఖండ జ్యోతి కార్యక్రమాన్ని గ్రామస్థులు నెల రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న , బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లకి యాత్రలో పాల్గొన్నారు.

News August 5, 2024

కడెం ప్రాజెక్టు నుంచి 957 క్యూసెక్కుల నీటి విడుదల

image

కడెం ప్రాజెక్టు నుంచి 957 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టులో 696.22 అడుగుల నీటిమట్టం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 4,323 క్యూసెక్కుల నీరు వస్తోంది.

News August 5, 2024

ఆదిలాబాద్: రైతు బీమా దరఖాస్తుకు నేడే LAST

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూతన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి తేదీ అని అధికారులు తెలిపారు. క్లస్టర్ పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న నూతన రైతులు తమ రైతు వేదికలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. రైతు బీమా ఫామ్, రైతు ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డ్, పట్టా పాస్ బుక్, బ్యాంక్ జిరాక్స్ కాపీలను వారి వెంట తెచ్చుకోవాలని కోరారు.

News August 5, 2024

SKZR: రోడ్డు ప్రమాద ఘటనలో ఇంటర్ విద్యార్థి మృతి (Update)

image

దహెగాంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని <<13777263>>ఒకరు <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొంచవెల్లి గ్రామానికి చెందిన చిప్ప సూరజ్, చౌదరి నవీన్ కాగజ్‌నగర్ పట్టణానికి వెళ్లి సామాగ్రి కొనుగోలు చేసి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో మూలమలుపు వద్ద ఆగి ఉన్న మరో బైక్‌ను ఢీకొన్నారు. చౌదరి నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడని స్థానిక ఎస్సై తెలిపారు. మృతుడు ఇంటర్ చదువుతున్నాడు.

News August 5, 2024

ఆదిలాబాద్: యువతి ప్రాణం తీసిన బురద రోడ్డు

image

బురదరోడ్డు యువతి ప్రాణాలు తీసింది. వివరాలిలా.. గుడిహత్నూర్(M) న్యూపోమార్‌పేటకి చెందిన లక్ష్మి(26) శనివారం రాత్రి పాముకాటుకు గురైంది. ఈ విషయాన్ని తెల్లవారుజామున తల్లికి చెప్పింది. ఆ ఊరికి అంబులెన్స్ సదుపాయం లేదు. వెంటనే ఆమెను సమీపంలో ఉన్న వాగు వరకు ఎత్తుకొని వెళ్లి, ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించడంలో జాప్యం కావడంతో యువతి మృతి చెందింది. ఆస్పత్రికి చేరేందుకు 13కి.మీకు 2గ. పట్టింది.

News August 5, 2024

రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గోలేటి వాసి

image

ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని గౌతమ్ నగర్‌కి చెందిన రాజ్ కుమార్ ఇటీవల వెలువడిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్) ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాజ్ కుమార్ ఇరిగేషన్ AEEగా ఎంపికయ్యారు. ఇప్పటికే రాజ్ కుమార్ పోలీసు కానిస్టేబుల్ (సివిల్)గా 2020లో ఎంపికై ఆసిఫాబాద్ హెడ్ క్వార్టర్‌‌లో స్పెషల్ పార్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు.