Adilabad

News September 19, 2024

ఆదిలాబాద్: క్రీడాకారుల వివరాలు ఇవ్వండి: DYSO

image

అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పతకాలు సాధించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ పూర్తి వివరాలు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయంలో ఈ నెల 23లోపు అందించాలని DYSO వేంకటేశ్వర్లు తెలిపారు. 2019 నుంచి ఇప్పటి వరకు పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారి వివరాలను పట్టిక రూపంలో పొందుపర్చనున్నారు. వివరాలకు ఆదిలాబాద్ క్రీడా పాఠశాల జూడో కోచ్ రాజును సంప్రదించాలన్నారు.

News September 18, 2024

ADB: ఆ గ్రామంలో 10 మంది కవల పిల్లలు.. గుర్తించలేక తికమక..!

image

తాంసి మండలం వడ్డాడి గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకే రూపంలో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు (కవలలు) కనిపిస్తారు. ఈ కవలల్లో ఎవరు ఎవరో అని గ్రామస్థులే కాదు తల్లిదండ్రులు కూడా గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలో 10 మందికి పైగా కవలలు ఉండటంతో వీరిని గుర్తించే విషయంలో గ్రామస్థులు తికమక పడుతుంటారు. గ్రామంలో గౌతమి-గాయత్రి, వర్షిత్-హర్షిత్, కావ్య- దివ్య, రామ్-లక్ష్మణ్ అని వారిని పలకరిస్తారు.

News September 18, 2024

భీంపూర్: మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులుల సంచారం

image

భీంపూర్ మండలం పెనుగంగ నదికి అవతల ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులులు సంచరిస్తున్నాయి. రామ్‌నగర్- సావర్గాం మార్గంలో మూడు పులులు ఓ ద్విచక్ర వాహనదారుడికి కనిపించగా వాటిని ఫొటో తీశాడు. తిప్పేశ్వర్ అభయారణ్యం ఆయా గ్రామాలకు సమీపంలో ఉండటంతో తరుచూ పులులు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వేసవిలో నది దాటి భీంపూర్ వస్తున్నాయన్నారు.

News September 17, 2024

ఆదిలాబాద్: ఆర్టీసీ గమ్యం యాప్‌పై ప్రయాణికులకు అవగాహన

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ ప్రాంతంలోని ఆర్టీసీ బస్ స్టేజ్ వద్ద ప్రయాణికులకు రోడ్డు భద్రతపై ఆర్టీసీ సిబ్బంది మంగళవారం అవగాహన కల్పించారు. ఆర్టీసి గమ్యం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా ప్రయాణించే బస్సు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ద్వారా కల్పిస్తున్న సేవలను వివరించారు. సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2024

SKZR: నవోదయ దరఖాస్తు గడువు పెంపు

image

కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు గడువు పెంచినట్ల ప్రిన్సిపల్ కొడాలి పార్వతి తెలిపారు. ఈ నెల 16తో గడువు ముగియగా విద్యాలయ సమితి తిరిగి గడువు పెంచినట్లు పేర్కొన్నారు. కాగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 17, 2024

కాగజ్‌నగర్: లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్టుపల్లిలో మతసామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డూను వేలం పాటలో ముస్లిం దంపతులు దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన అప్జల్- ముస్కాన్ దంపతులు రూ.13,216లకు వినాయకుని లడ్డూను వేలం పాటలో పాల్గొని కైవసం చేసుకున్నారు.

News September 16, 2024

రేపు ADBలో మద్యం దుకాణాలు మూసివేత

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 17న మంగళవారం మద్యం దుకాణాలను మూసి వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. పట్టణంలో మంగళవారం వినాయక నిమజ్జనం శోభాయాత్రను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం వ్యాపారులు ఎవరైనా ఈ సమయాల్లో విక్రయాలు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తిరిగి బుధవారం యథావిధిగా దుకాణాలు తెరుస్తారని పేర్కొన్నారు.

News September 16, 2024

భైంసా: భార్య ఆత్మహత్యాయత్నం.. ఉరేసుకొని భర్త మృతి

image

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భైంసాలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. దెగాంకు చెందిన ఎర్రన్న(40) మద్యానికి బానిసై భార్య హంసతో గొడవకు దిగాడు. ఆమె మనస్తాపంతో పురుగు మందు తాగింది. కుటుంబీకులు భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. కాగా చికిత్సపొందుతున్న భార్యతో మరోసారి గొడవపడి ఇంటికి వెళ్లి
ఎర్రన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

News September 16, 2024

మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం

image

మంచిర్యాల కలెక్టరేట్‌లో మంగళవారం ప్రజా పాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు.

News September 15, 2024

ఆసిఫాబాద్: భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య

image

భర్త మందలించినందుకు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది.. CI సతీష్ కుమార్ వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం అడ గ్రామానికి చెందిన గంగుబాయితో అదే గ్రామానికి చెందిన హుడే లక్ష్మణ్ తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య బట్టలు ఉతకడానికి బయటకు వెళ్లి ఇంటికి లేటుగా వచ్చినందుకు భర్త మందలించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.