Adilabad

News August 4, 2024

కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తవేత

image

కడెం ప్రాజెక్టులోని ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ఈరోజు ఉదయం ప్రాజెక్టులో 696.6 అడుగుల నీటిమట్టం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 6409 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఆయకట్టుకు సాగునీటి విడుదల కొనసాగుతోంది.

News August 4, 2024

ఆదిలాబాద్ : REPORT చేయడానికి రేపే LAST

image

ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో రెండో విడత ప్రవేశాలకు సంబంధించి రిపోర్టింగ్ గడువును పొడిగించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ రెండో విడతలో ప్రవేశాలు పొంది, ఇప్పటివరకు రిపోర్ట్ చేయని విద్యార్థులకు అడ్మిషన్ రిపోర్టింగ్ తేదీని ఆగస్టు 5వరకు పొడిగించినట్లు తెలిపారు. రెండో విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 4, 2024

MNCL: నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు

image

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నిండుకుండలా మారింది. శనివారం సాయంత్రం వరకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లకు గాను, 146.12 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.1760 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 13,031 క్యూ సెక్కుల వరద వచ్చి చేరుతోంది.

News August 4, 2024

బెల్లంపల్లి: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

బెల్లంపల్లి- రేచిని రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం తెల్లవారు జామున రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయసు 30-35 సంవత్సరాలు ఉండగా, ఒంటిపై పూల చొక్కా, తెలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మంచిర్యాల జీఆర్పీ ఎస్సై సుధాకర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ మృతదేహాన్ని బెల్లంపల్లిలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి కేసు చేశారు.

News August 4, 2024

ఆదిలాబాద్‌లో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే ఆదిలాబాదీలు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ ADB జిల్లాలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్ వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో ఉంటారు. అలాంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..?
Happy Friendship Day

News August 4, 2024

ADB: 5 నుంచి శ్రావణం.. నెలరోజులు మస్తు లగ్గాలు

image

మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈనెల 5 నుంచి శ్రావణమాసం మెుదలవుతోంది. ఈనెల 8, 9,10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని, శంకుస్థాపనలు, గృహప్రవేశాలకు ఇప్పటికే చాలా మంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.

News August 4, 2024

NRML: ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ సదస్సులో పాల్గొన్న ఆర్జీయూకేటీ వీసీ

image

హైద్రాబాద్‌లో FCCI ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ కార్యక్రమానికి యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.జగదీష్ కుమార్ ఆహ్వానం మేరకు బాసర ఆర్జీయూకేటీ వీసీ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్తంగా తెలంగాణలో ఉన్నత విద్యకు సంబంధించిన పత్రాన్ని విడుదల చేశారు. వెంకటరమణ మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ సాధికారత జరగాలంటే విద్యార్థి-కేంద్రీకృత అభ్యాసం పై దృష్టి పెట్టాలన్నారు.

News August 3, 2024

MNCL: సింగరేణి సంస్థలో భారీగా అధికారుల బదిలీ

image

సింగరేణి సంస్థలో భారీ సంఖ్యలో అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 9 విభాగాల్లో 200 మందికి పైగా అధికారులకు స్థాన చలనం కలిగింది. ఒకేసారి ఇంతమంది బదిలీ కావడం పదేళ్లలో ఇదే ప్రథమం. ఎన్నికల ప్రక్రియ ముగిశాక బదిలీలపై సుదీర్ఘ కసరత్తు చేసిన యాజమాన్యం ఎక్కువ కాలం ఒకే చోట ఉన్న వారిని వేరే
ప్రాంతాలకు బదిలీ చేసింది.

News August 3, 2024

ఆదిలాబాద్: AEE ఫలితాల్లో సత్తా చాటిన నిరుపేద యువతి

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన క్యాతం అపర్ణ అనే యువతి తొలి ప్రయత్నంలోనే ఇరిగేషన్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. ఇటీవల విడుదలైన టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈఈ(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) ఉద్యోగానికి ఎంపికైంది. సాధారణ నిరుపేద రైతు కుటుంబం నుంచి మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

News August 3, 2024

పెంబి: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెంబి మండలంలో జరిగింది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంకెన గ్రామానికి చెందిన నైతం దత్తు రాం(19) పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి ఎగ్జామ్ రాశాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఈనెల 1న పురుగు మందు తాగగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు.