Adilabad

News September 14, 2024

తానూర్: వినాయకునికి 108 రకాల నైవేద్యం

image

తానూర్ మండలం బోసి గ్రామంలో వినాయక నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన కర్ర వినాయకునికి శుక్రవారం ఏడవ రోజు భక్తులు భారీ నైవేద్యాన్ని సమర్పించారు. 108 రకాల పిండి వంటలు, స్వీట్లను స్వామి వారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పాడి పంటలు పుష్కలంగా పండాలని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.

News September 13, 2024

ఆదిలాబాద్: రూ.818కే విద్యుత్ మీటర్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పేదవారికి తక్కువ ధరకే ప్రభుత్వం విద్యుత్ మీటర్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేనివారు ఈ నెల 15 వరకు నూతన మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 500 వాట్స్‌కి రూ.938, 250 వాట్స్‌కి రూ.818 చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ కార్యాలయాలు, ఉపకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.

News September 13, 2024

నిర్మల్ : సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై మండలాల వారీగా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ పనితీరును మరింతగా పటిష్టపర్చలన్నారు.

News September 12, 2024

జైనూర్ బాధితురాలిని పరామర్శించిన బీఎస్పీ ఎంపీ

image

జైనూర్‌లో ఇటీవల ఆదివాసీ మహిళపై అత్యాచారం జరగగా బాధితురాలు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. కాగా బాధితురాలిని ఆదిలాబాద్ బీఎస్పీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ జంగు బాబుతో కలిసి బీఎస్పీ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

News September 12, 2024

నిర్మల్‌: అన్నను నరికి చంపిన తమ్ముడు

image

అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన శంభు(35)ను కుటుంబ కలహాల కారణంగా అతడి తమ్ముడు శివ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 12, 2024

ASF: ‘మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి’

image

ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని బీసీ యువజన సంఘం జిల్లాధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మికు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్ర సాధనలో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.

News September 11, 2024

మంచిర్యాలలో వ్యభిచారం

image

మంచిర్యాల పట్టణంలో ఇటీవల వ్యభిచారం కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని ఓ లాడ్జిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు యువతులు, ఇద్దరు బాలికలు, ఆరుగురు విటులతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కాగా నిర్వాహకులు భార్యాభర్తలని పోలీసులు వెల్లడించారు.

News September 11, 2024

నిర్మల్: గృహిణి పై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

image

ఓ గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన ఘటన నిర్మల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఓ ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆమె కేకలు వేయగానే పక్కింటి వారు వచ్చేలోపు డెలివరీ బాయ్ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడు విఘ్నేశ్ (23)ని అరెస్టు చేసినట్లు CI రామకృష్ణ తెలిపారు.

News September 11, 2024

ఆదిలాబాద్: 13న ఇంటర్వ్యూ.. 20 వేల జీతం

image

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్సెస్)లలో ఈనెల 13న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.సంగీత పేర్కొన్నారు. UpGrad వారి సహకారంతో HDFC Bank లలో శాశ్వత ప్రాతిపదికన బ్యాంకులలో నెలకు 20,000 పైన జీతభత్యాలు అందుకొనే సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ /బిటెక్ లో 50% మార్కులు కలిగి ఉండి 30 సం.రాల లోపు వయసు ఉన్నవారు అర్హులని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News September 11, 2024

కాంగ్రెస్ నేతను పరామర్శించిన బీజేపీ ఎంపీ

image

ఏఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు జాదవ్ నరేష్‌ను అదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం గణేష్ పరామర్శించారు. గుడిహత్నూర్ మండలం తోషం తండ కు చెందిన జాదవ్ నరేష్ అన్నయ్య జాదవ్ చందూలాల్ ఇటీవల మృతి చెందారు. విషషయం తెలుసుకున్న ఎంపీ నరేష్ కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించి, మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ఎంపీ వెంట
బీజేపీ నాయకులు వామన్ గిత్తే, చంద్రకాంత్, నారాయణ తదితరులు ఉన్నారు.