Adilabad

News August 3, 2024

MNCL: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో తగ్గిన నీటిమట్టం

image

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో గడిచిన నాలుగు రోజుల్లో మూడు టీఎంసీల నీటి మట్టం తగ్గింది. వర్షాలు లేక ఎగువ ప్రాంతాల నుంచి వరద నిలిచిపోగా ప్రాజెక్ట్ నీటిని నంది పంప్ హౌస్‌కు తరలిస్తుండటంతో నీటి మట్టం తగ్గింది. ప్రాజెక్ట్ నీటిమట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 146.40 మీటర్లకు చేరింది. 20.175 టీఎంసీలకు గాను 15.900 టీఎంసీలుగా ఉంది. 3,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.

News August 3, 2024

ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా బేల(M) సాంగిడికి చెందిన ప్రీతమ్(27) భిక్కనూరు(M) TU పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలో వీడ్కోలు సమావేశం ఉండడంతో పనుల నిమిత్తం శుక్రవారం బయటికి వెళ్లాడు. బస్టాండ్‌ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో ప్రీతమ్ అక్కడికక్కడే చనిపోయాడు.

News August 3, 2024

MNCL: అత్తను చంపిన అల్లుడు అరెస్ట్

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడలో గత నెల 13వ తేదీన అత్తను హత్య చేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అల్లుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక సీఐ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తరచుగా అత్త అల్లుడి మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో వెంకటేశ్ మద్యం మత్తులో విజయతో గొడవపడి కత్తితో హత్య చేశాడు. ఆయనను స్థానిక బస్టాండ్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News August 3, 2024

స్థానిక సంస్థల ఎన్నికల నిర్ణయంతో వేడెక్కిన రాజకీయాలు

image

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సర్పంచ్ పదవికి పోటీ చేయాలని పలు గ్రామాల్లో ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఓడిన, పోటీ చేయలేక వెనక్కి తగ్గిన వారు ఈసారి తగ్గేదేలే అంటున్నారు. కాగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది.

News August 3, 2024

ASF: ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధిపై దృష్టి సారించాలి: కలెక్టర్

image

జిల్లాలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ జిల్లా నుంచి వివిధ రకాల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశానికి DRDO సురేందర్‌తో కలిసి హాజరయ్యారు. జొన్నలతో తయారుచేసిన ఆహార పదార్థాలను కూడా ఎగుమతి చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.

News August 2, 2024

ASF: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు విజయవంతం చేయాలి: కలెక్టర్

image

తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం పోస్టర్‌ను అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళా శిశు వైద్యశాఖ అధికారులతో తల్లిపాల వారోత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

News August 2, 2024

దహెగాం: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

image

దహెగాం మండల కేంద్రానికి చెందిన బండ మల్లేశ్ (33), ఎల్లూర్ గ్రామానికి చెందిన మంజుల అలియాస్ సుజాత(30)కు 13ఏళ్లక్రితం పెళ్లయింది. ఆరేళ్ల క్రితం సుజాత అదే గ్రామానికి చెందిన గుర్ల రాజు(23)తో అక్రమసంబంధం పెట్టుకుంది. సుజాత, ప్రియుడు రాజుతో కలిసి మల్లేశ్ గొంతునులిమి హత్య చేసినట్లు సీఐ అల్లం రాంబాబు, ఎస్సై కందూరి రాజు శుక్రవారం పేర్కొన్నారు. సుజాత, రాజును రిమాండ్‌కు తరలించామన్నారు.

News August 2, 2024

ఆదిలాబాద్: సొంత జిల్లాకు వచ్చిన ఏకైక MEO

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకైక MEOగా పేరొందిన D.సోమయ్య బదిలీల పుణ్యమా అని సొంత జిల్లాకువచ్చారు. జిల్లాకు చెందిన సోమయ్య ఏకంగా 19 ఏళ్ల పాటు ప్రస్తుత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల ఎంఈవోగా పనిచేసి సొంత జిల్లాకు బదిలీపై రావడం పట్ల అధికారులు, మిత్రులు, బంధువులు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం DEO ప్రణీతను మర్యాదపూర్వకంగా కలిశారు.

News August 2, 2024

నర్సాపూర్: తల్లికి అంత్యక్రియలు చేసిన కూతురు

image

తల్లికి కుతురు అంత్యక్రియలు చేసిన ఘటన నర్సపూర్ మండలం రాంపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తోకల దత్తు-వనజ దంపతులకు స్రవంతి, స్వప్న కూతుర్లు ఉన్నారు. కుటుంబాన్ని పోషించలేక 15 ఏళ్ల క్రితమే భర్త ఇల్లు వదిలి వెళ్లిపోగా తల్లి కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఈక్రమంలో గురువారం అనారోగ్యంతో మృతి చెందగా గ్రామస్థులు నగదు జమచేసి కూతురితో అంత్యక్రియలు జరిపించారు.

News August 2, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.