India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. బస్టాండ్లోని ఆసిఫాబాద్కు వెళ్లే ప్లాట్ ఫామ్ వద్ద మరణించిన మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచామని, వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
కాసిపేట మండలం కోమటిచేనుకి చెందిన <<13074826>>మౌనిక విద్యుత్ షాక్తో<<>> మృతి చెందింది. కాగా విద్యుదాఘాతానికి రేకులపై పడిపోయిన తల్లిని ఆమె నాలుగేళ్ల కుమారుడు గౌతమ్ చూశాడు. వెంటనే పెద్దనాన్నకు సమాచారం అందించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి మౌనికకు కిందికి తీసుకురాగా అప్పటికే మృతి చెందిందని 108 సిబ్బంది తెలిపారు. తన తల్లిని కాపాడాలని 108 సిబ్బందిని వేడుకుంటున్న గౌతమ్ని చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు.
కాసిపేట మండలంలోని కోమటిచేనుకు చెందిన బెడ్డల మౌనిక అనే మహిళ బుధవారం విద్యుత్ షాక్ తో మృతి చెందింది. వాటర్ ట్యాంకులో నీటిని పరిశీలించేందుకు ఇంటిపైకి ఎక్కగా తెగిపోయిన విద్యుత్ వైరు ఇనుప రేకులకు తాకింది. మౌనిక వాటిని తాకడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. ఏడు శాసనసభ స్థానాలతో విస్తరించిన ADB పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఫిబ్రవరి 8న విడుదల ఓటరు జాబితా ప్రకారం మొత్తం 16,44,715 మంది ఓటర్లున్నారు. ఇందులో 2,57,248 మంది ఓటర్లతో నిర్మల్ మొదటిస్థానంలో ఉంటే 2,10,915 ఓటర్లతో బోథ్ నియోజకవర్గం చివరిస్థానంలో ఉంది. ADB కలెక్టరేట్ ఆవరణలో నేటి నుంచి ప్రారంభం కానున్న నామపత్రాల స్వీకరణ ఈ నెల 25తో ముగియనుంది.
మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద దగ్గర ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మందిని బుధవారం సాయంత్రం పట్టుకున్నట్లు పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్స్ రూ.10 వేలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. IPL క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలపాలని, బెట్టింగ్ ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, బేల, జైనథ్, సిరికొండ, బోథ్, మావల, పిప్పల్ధరి, చెప్రాల, భోరజ్ ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమురం భీం జిల్లాలో అత్యధికంగా కాగజ్ నగర్లో 44.2 డిగ్రీలు నమోదయింది. మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలం దేవులవాడలో అత్యధికంగా 44, నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్లో 43.2 డిగ్రీలు నమోదైంది.
ఆసిఫాబాద్ మండలం బురుగూడ గ్రామంలో బుధవారం సాయంత్రం 5గంటలకు ఈదురు గాలులకు బురుగూడకి చెందిన వృద్ధురాలు చున్నూబాయి ఎగిరి పడింది.. సాయంత్రం వర్షం వస్తుండడంతో వృద్దురాలు చున్నూబాయి ఇంటి ముందు నిలబడి ఉంది. ఈదురుగాలులు బలంగా వీయడంతో చున్నూబాయి ఎగిరిపడి ముళ్ల కంపలో చిక్కుకుంది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యయి. వెంటనే ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందన్నారు.
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆదిలాబాద్కి చెందిన ఆదా వెంకటేష్-వాణి దంపతుల కుమారుడు సందీప్ సత్తా చాటాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ లో 830వ ర్యాంకు సంపాదించి ఔరా అనిపించాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించినట్లు సందీప్ తెలిపారు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమన్నారు. కాగా సందీప్ తండ్రి వెంకటేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు.
ట్రాక్టర్ అదుపుతప్పి <<13067453>>వ్యక్తి మృతి<<>> చెందిన ఘటన ఇచ్చోడ మండలం చించోలి క్రాస్ రోడ్ వద్ద జరిగిన విషయం తెలిసిందే. SI నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వడ్డర్ గూడకు చెందిన రాజేందర్ (33) ఇచ్చోడలో ట్రాక్టర్తో ఇటుక లోడు ఖాళీ చేసి వస్తుండగా ట్రాక్టర్ అతివేగంగా నడుపుతుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
సివిల్ సర్వీసెస్ మంగళవారం వెలువరించిన ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ర్యాంక్ సాధించాడు. మండలంలోని చందా(టి) గ్రామానికి చెందిన విశాల్ సివిల్స్లో 718 ర్యాంక్ సాధించి సత్తాచాటాడు. దీంతో గ్రామస్థులు, కుటుంబసభ్యులు విశాల్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా తండ్రి వెంకన్న మంచిర్యాల ACPగా విధులు నిర్వహిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.