Adilabad

News August 1, 2024

ఆదిలాబాద్ కోర్టులో చరిత్రాత్మక కేసు విచారణ

image

ఆదిలాబాద్ జిల్లా కోర్టులో చరిత్రాత్మక కేసు విచారణ జరిగింది. వివరాలు..తాంసి మండలం జామిడికి చెందిన మునీశ్వర్ రాంబాయి, భగత్ సులోచన తలమడుగు PSలో ఓ ఘటనపై 2017 సం.లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పై ఇద్దరి బాధితుల సాక్ష్యం నమోదు చేయాలి. అయితే ఇద్దరు నడవలేని స్థితిలో అనారోగ్యంతో బాధపడుతుండగా ఆటో సహాయంతో కోర్టు వరకు వచ్చారు. కాగా న్యాయమూర్తి దుర్గారాణి స్వయంగా వారివద్దకు వెళ్లి విచారణ చేపట్టారు.

News August 1, 2024

ఆదిలాబాద్: ‘ఆ ఫోన్ కాల్స్ వస్తే నమ్మవద్దు’

image

సైబర్ మోసగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారని DSP జీవన్‌రెడ్డి తెలిపారు. కేటుగాళ్లు ప్రజలకు ఫోన్ చేసి మీ కుటుంబీకులు డ్రగ్స్‌తో పట్టుబడ్డారని వారిని విడిపించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈరకమైన కాల్స్ పోలీస్, ఇతర అధికారులు చేస్తు మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్‌కాల్స్ వస్తే ప్రజలు నమ్మవద్దని కోరారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే నిర్ధారించుకోవాలన్నారు.

News July 31, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి HIGHLIGHTS

image

◆ ఆదిలాబాద్: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య 
◆ ఆసిఫాబాద్: షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం 
◆ బోథ్: రెండు ఆటోలు ఢీ కూలీలకు గాయాలు 
◆ ఉట్నూరు: రోడ్డుప్రమాదం ఇద్దరికి తీవ్రగాయాలు 
◆ మామడ :విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి 
◆ బాసర: గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య 
◆ అదుపు తప్పిన నిర్మల్ వస్తున్న RTC బస్సు 
◆ ఆందోళనకు గురిచేస్తున్న పాముకాటు ఘటనలు 
◆ లక్షెట్టిపేట: గంగమ్మ తల్లి ఆలయంలో చోరీ 
◆ నిర్మల్: 30యాక్ట్ అమలు

News July 31, 2024

ఆదిలాబాద్: నిజాయితీ చాటుకున్న ముగ్గురు చిన్నారులు

image

తమకు దొరికిన సెల్ ఫోన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించి చిన్నారులు తమ నిజాయితీని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ముగ్గురు చిన్నారులకు బుధవారం ఓ సెల్ఫోన్ దొరికింది. వెంటనే 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. రాంనగర్ కాలనీకి చెందిన దేవిదాస్ ఫోన్ గా పోలీసులు గుర్తించారు. ఆయనను పిలిపించి ఎస్ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఫోన్ అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు, దేవిదాస్ చిన్నారులను అభినందించారు.

News July 31, 2024

బాసర: గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య

image

నిజామాబాద్ జిల్లా కేంద్రం ధర్మపురి కాలనీకి చెందిన తుమ్మల లక్ష్మి (32) అనే వివాహిత బుధవారం బాసరలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గణేష్ ఘాట్ వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News July 31, 2024

అందులో నిర్మల్ జిల్లా TOP

image

మహాలక్ష్మి పథకం వినియోగానికి సంబంధించి ఆదిలాబాద్ RTC రీజియన్ వ్యాప్తంగా పరిశీలిస్తే నిర్మల్ డిపోలో అధికంగా లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. గత డిసెంబర్ నుండి జులై వరకు నిర్మల్ జిల్లాలో జీరో టిక్కెట్ తీసుకున్న మహిళలు 96.54 లక్షల మంది ఉన్నారు. మంచిర్యాలలో 78 లక్షలు, ఆదిలాబాద్‌లో 50 లక్షలు, బైంసాలో 56 లక్షలు, ఆసిఫాబాద్‌లో 49, ఉట్నూర్ పరిధిలో 16 లక్షల మంది అతివలు, బాలికలు ప్రయాణం చేశారు.

News July 31, 2024

నిర్మల్: పూజించిన పామే కాటేసింది.!

image

తన ఇంట్లో నాగుపాము ఉందని తెలిసి ఓ వృద్ధురాలు కొన్నేళ్లుగా పాముకు పూజలు చేయగా.. చివరకు ఆ పాముకాటుకు గురై మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌ మండలం గోసంపల్లె‌కి చెందిన గంగవ్వ(65) అంగన్‌వాడీ‌ ఉద్యోగిగా రిటైరై ఇంటి వద్దే ఉంటోంది. మంగళవారం ఇంట్లో అలుకుతుండగా తాను పూజించిన పాము చేతిపై పలుమార్లు కాటు వేసింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది.

News July 31, 2024

ఆదిలాబాద్: ఎడ్యుకేషన్ స్పెషల్ NEWS మీకోసమే..!

image

★ ఆదిలాబాద్ జిల్లాలోని KGBVలో 13 నాన్ టీచింగ్ పోస్టులు.. AUG 1లోపు దరఖాస్తులు
★ అంబెడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు.. AUG 18 LAST
★ AUG 1 నుండి DEECET సర్టిఫికెట్ వెరీఫికేషన్
★ పీజీ అసైన్మెంట్ సబ్మిషన్ కు నేడే LAST
★ నేడు పాలిసెట్ సీట్ల కేటాయింపు
★ RIMSలో వైద్య పోస్టుల భర్తీ.. AUG 6న ఇంటర్వ్యూ
★ ఆర్థికసహాయంకై.. ట్రాన్స్ జెండర్ ల నుండి దరఖాస్తులు
★ DOST రిజిస్ట్రేషన్ AUG 2న లాస్ట్

News July 31, 2024

ఆదిలాబాద్: రుణమాఫీ కాలేదా..? అయితే కాల్ చేయండి

image

రైతులకు మేలుచేసే విధంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ కార్యక్రమానికి జిల్లాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అయినప్పటికీ ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా నోడల్ అధికారి రమేశ్ 7288894003 సంప్రదించాలని సూచించారు.
>>SHARE IT

News July 31, 2024

నిర్మల్: LRS దరఖాస్తులకు మోక్షం..!

image

LRS దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రక్రియలో కదలిక రానుంది. నిర్మల్ జిల్లాలోని మూడు పట్టణాల్లో 26,182 దరఖాస్తులకు మోక్షం కలగడంతోపాటు దాదాపు రూ.50 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఏర్పడింది.