India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో DEECETలో ర్యాంక్ సాధించిన అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. D.EDలో ప్రవేశానికి AUG 1 నుండి AUG 6వరకు సర్టిఫికెట్ వెరీఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్స్ అభ్యర్థులకు కేటాయించిన తేదీలలో ఆదిలాబాద్ డైట్ కళాశాలలో హాజరై సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు
◆ నిర్మల్: రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం
◆ ఆదిలాబాద్: రెండు ఆలయాల్లో దొంగతనం
◆ వాంకిడి: పేకాట ఆడుతున్న నలుగురిపై కేసు
◆ బాసర: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
◆ గుడిహత్నూర్: విద్యుత్ షాక్తో విద్యార్థి మృతి
◆ మంచిర్యాల: గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అరెస్ట్
◆ పెంబి: పురుగుల మందు తాగి యువకుడు మృతి
◆ ముధోల్: కుక్కల దాడిలో దూడ మృతి
ఆదిలాబాద్ జిల్లాలోని కేజీబీవీలు, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DEO ప్రణీత/ఎక్స్ అఫిషియో ప్రాజెక్టు అధికారి పేర్కొన్నారు. మొత్తం 13 పోస్టులకు జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు పోస్టులకు సంబంధిత MEO కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల మహిళలు అర్హులని తెలిపారు.
డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై నోటిఫికేషన్ విడుదలైనట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. డిగ్రీ, పీజీలో తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. AUG 18 వరకు ONLINEలో దరఖాస్తులు చేసుకోవచ్చని వివరాలకు https://www.braouonline.in/ సందర్శించండి.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అసైన్మెంట్ సబ్మిషన్ గడువు ఈనెల 31న ముగుస్తుందని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి తమ అసైన్మెంట్లు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అసైన్మెంట్లు పూర్తి చేసిన అనంతరం బుధవారంలోపు సబ్మిట్ చేయలని సూచించారు.
నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ధరణీ పోర్టల్ పై అసెంబ్లీలో మాట్లాడారు. ధరణి పోర్టల్ లో జరిగిన అక్రమాల్లో బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ కాపాడుతుందా..? అని ప్రశ్నించారు. లేదంటే భూముల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేయాలని కోరారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆభిప్రాయ సేకరణ జరిగిందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు. గురిజ గ్రామానికి చెందిన 18 ఏళ్ల కార్తిక్ మంగళవారం తన బావ వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అయితే అక్కడ ఇనుప కంచెను పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోని మృతి చెందాడు. మృతుడు ఇటీవలే పదవ తరగతి పూర్తి చేశాడు. ఘటనతో విషాదం నెలకొంది.
బాధితులు పోగొట్టుకున్న, చోరీ అయిన సెల్ఫోన్లు గుర్తించడంలో ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్ ముందంజలో ఉంది. 63.98% ఫోన్ల ఆచూకీని తెలుసుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఆదిలాబాద్ (63.42%), రామగుండం (61.54%), నిర్మల్(61.32%) ఉన్నాయి. చరవాణులను బాధితులకు అప్పగించడంలో రామగుండం 29.15% తో 1 వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో నిర్మల్(28.48 %), 3వ స్థానంలో ఆదిలాబాద్(24.63%), 4వ స్థానంలో ఆసిఫాబాద్ 22.66% ఉన్నాయి.
కూతురిపై తండ్రి లైంగిక దాడి చేసిన దారుణ ఘటన దిలావర్పూర్లో జరిగింది. SP జానకీ షర్మిల తెలిపిన వివరాలు.. గుండంపల్లికి చెందిన సంజీవ్(38) ఈనెల 19న రాత్రి తన కూతురి(14)పై లైంగిక దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న భార్య వారించగా.. తనను అడ్డుకుంటే రెండో భార్యను చంపినట్లు మిమ్మల్ని కూడా చంపేస్తానని బెదిరించి కూతరిపై లైంగిక దాడిచేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో 2వ విడత రుణమాఫీకి సంబంధించి డబ్బులు ఈనెల 30న రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు. జిల్లాలోని 17,647 రైతులకు గాను రూ.201.83 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంతో పాటు 17 మండలాల పరిధిలోని రైతు వేదికల్లో ప్రారంభించనునట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.