India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎకో టూరిజంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు స్పాట్లను ఎంపిక చేయగా అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ ఫారెస్ట్తో పాటు కుంటాల జలపాతానికి చోటుదక్కింది. కుంటాల జలపాతం వద్ద ట్రైబల్ ఎకో టూరిజం కింద రిసార్ట్ నిర్మాణం, టూరిస్టుల విడిది కోసం వసతి, ఎకో ఫ్రెండ్లీ కార్టెజ్లు నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ITDA PO ద్వారా రూ.3.81లక్షలతో వివిధ పనులు చేపట్టనున్నారు.
బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడికి నిర్మల్ కోర్టు 5ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు CI ప్రవీణ్ కుమార్ తెలిపారు. 7మార్చి2020న ఓ తల్లి 11ఏళ్ల కూతురిని తీసుకొని హోటల్కి వెళ్లింది. తన కూతురిని ఇంట్లో దింపమని బెస్తవార్ పేటకు చెందిన మహమ్మద్ రఫి అనే ఆటో డ్రైవర్తో పంపించింది. డ్రైవర్ తనను ఇంట్లో దింపి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనపై అప్పటి SI కేసు నమోదు చేయగా కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ముగ్గురు మహిళలతో వ్యభిచారం చేస్తున్న విటులను పట్టుకున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. వారిలో లాడ్జి నిర్వాహకుడు శ్రీనివాస్తో పాటు అఖిల్, అరుణ్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన మహిళలను పోలీసులు స్థానిక సఖీ కేంద్రానికి తరలించినట్లు సీఐ వివరించారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెనుగంగా వరద ఉద్ధృతిలో చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు రక్షించారు. వివరాలు.. సిర్పూర్ (టి) మండలం హుడ్కిలి గ్రామం వద్ద పెనుగంగా నది బ్యాక్ వాటర్ రావడంతో లిఫ్ట్ ఇరిగేషన్ ట్యాంక్ పైన గోపాల్ అనే వ్యక్తి చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ దీకొండ రమేశ్ తన సిబ్బందితో వెళ్లి అతడిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు.
రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లు అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 రైల్వే స్టేషన్లు ఇందుకు ఎంపికయ్యాయి. మంచిర్యాల, ఆదిలాబాద్, బాసర రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద పునరాభివృద్ధి చేయనున్నారు.
రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఉట్టి బడ్జెట్గా ఉందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు. హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతూనే రూ.30వేల కోట్లు రీజనల్ రింగురోడ్డు ఇచ్చిందని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) మంజూరు చేసిందని ప్రసంగంలో తెలపడం విచిత్రంగా ఉందన్నారు.
ఉట్నూర్ మండలంలోని అడవుల్లో సమృద్ధిగా లభించే ఇప్ప పువ్వును ఆదివాసీలు వేసవికాలంలో సేకరించి నిలువ ఉంచుతారు. ఇలా నిలువ ఉంచిన ఇప్ప పువ్వుతో CCD స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ITDA సహకారంతో ఆదివాసీ ఆహారం పేరుతో సహజ సిద్ధంగా ఇప్ప పువ్వు లడ్డును తయారు చేసి కిలో రూ. 400 చొప్పున అమ్మకాలు చేపడుతున్నట్లు ఆదివాసీలు తెలిపారు. సహజ సిద్ధంగా ఉన్న లడ్డు రుచి జిల్లాలోనే ప్రత్యేకతను చాటుకుంది.
సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో తప్పనిసరిగా డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.ED) కళాశాలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న ఆన్లైన్లో నిర్వహించిన డీఈఈసెట్-2024 పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల కోసం https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్ల నమోదు వంటి తేదీలు త్వరలో విడుదల చేస్తామన్నారు.
నేడు రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. కుప్టి ప్రాజెక్ట్, చనాఖా-కోర్ట ప్రాజెక్టు ప్రధాన కాలువల నిర్మాణం, జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం, రైల్వే వంతెనల నిర్మాణాలకు నిధులివ్వాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.