India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గంజాయి, మత్తు పదార్థాల చెడు వ్యసనాలపై వ్యతిరేకంగా అందరు బాధ్యత తీసుకోవాలని మంచిర్యాల DCP భాస్కర్ అన్నారు. చెన్నూర్ రూరల్ కొటపల్లి పోలీస్ స్టేషన్ కోటపల్లి మండలం మోడల్ స్కూలులో గంజాయి, మాదకద్రవ్యాలపై అవగాహన సూచనలు చేశారు. DCP మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు కొంత మంది వ్యక్తుల స్వార్థం కారణంగా యువతకు మత్తు పదార్థాలు బానిసలు మారుతున్నారని అన్నారు.

తీర్యాణి మండలం గిన్నెదరి రేంజ్ వద్ద మంగి అటవీ ప్రాంతంలో పులి అడుగులను గుర్తించినట్లు అటవీశాఖా అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మంగి అటవీ ప్రాంతంలో ముల్కల మంద బీట్ పరిధిలో పులి అడుగులను గుర్తించినట్లు పేర్కొన్నారు. అది పెద్దపులా.. చిరుత పులా అనే సమాచారం తెలియాల్సి ఉందన్నారు. సమీప గ్రామ ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లొదని, పశువుల కాపర్లు, వంట చేను కొరకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలన్నారు.

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. మహాగాం గ్రామానికి చెందిన కదం బాలాజీ 48 గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది మద్యం మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని కుమారుడు కదం అర్జున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కడెం మండలంలోని సింగపూర్లో విషాదం చోటు చేసుకుంది. ప్రణయ్ అనే చిన్నారిపై నుండి ఎడ్ల బండి చక్రాలు వెళ్లడంతో మృతి మృతి చెందాడు. ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి వివరాలు.. తల్లి పద్మతో కలిసి ప్రణయ్ చేనుకు ఎడ్ల బండిపై యూరియా బస్తాలు తీసుకెళ్తుండగ ఎడ్ల బండిపై నుండి పడిపోయాడు. ప్రణయ్ పై నుండి ఎడ్ల బండి రెండు చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. బాలుని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో పాల్గొని వారిని కోరారు. అలాగే గిరిజన వికాస్ పథకం కింద నిర్మించిన బావులకు త్రీఫేస్ విద్యుత్ లైన్ ఇవ్వాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారిని కోరారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో టిఫిన్ చేద్దామని ఆపిన కారులో నుంచి రూ.18 లక్షల నగదును అపహరించిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. వ్యాపారం పనులపై హైదరాబాద్ నుంచి వచ్చిన వాసవి ట్రేడర్స్ ప్రతినిధులు ఖాతాదారుల నుంచి డబ్బు వసూలు చేసి కారులో ఉంచారు. అయితే కారు డోర్ లాక్ వేయక పోవడంతో నగదు తీసుకొని దుండగులు పరారైనట్లు తెలిపారు.

తెలంగాణా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణా షార్ట్ కోర్స్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్లో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారుడు సత్తా చాటారు. జిల్లా కేంద్రానికి చెందిన కొమ్ము చరణ్ తేజ్ 1500 మీటర్స్ ఫ్రీ స్టైల్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించాడు. అదేవిధంగా 400 మీటర్స్ ఫ్రీ స్టైల్ విభాగంలోనూ రెండవ స్థానంలో నిలిచి ప్రతిభ చాటాడు.

పిడుగుపాటుకు కొమురం భీం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. కెరమెరి మండలానికి చెందిన చౌదరి రమేశ్ (30) చింతకర్ర వెళ్లే మార్గంలో పత్తి పంటకు యూరియ వేస్తుండగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆసిఫాబాద్ మండలం చోర్ పల్లి పంచాయతీ పరిధి నందూపకు అంజన్న (20) సంకెపల్లి శివారులోని తన పొలం నుంచి వస్తున్న క్రమంలో పిడుగు పడటంతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

భైంసా పట్టణంలో మారణాయుధాలతో పట్టుబడిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటనపై శుక్రవారం ఏఎస్పీ అవినాష్ కుమార్ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అయితే సమావేశం ముగిసిన గంటకే నిందితుడు పరారవడంతో సంచలనం రేపుతోంది. నీరు తాగుతానని అనడంతో సిబ్బంది నీరు తీసుక వచ్చేలోపే నిందితుడు పరారీ అయ్యారని స్థానిక పోలీసులు వాపోతున్నారు. వెంటనే విషయం తెలుసుకున్న సీఐ, ఏఎస్పీ విస్తృతంగా గాలిస్తున్నారు.

ఉమ్మడి జిల్లా ప్రజల ఆరోగ్య వర ప్రదాయిని అయిన జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో సరిగ్గా వైద్యం అందడం లేదు. ఇటీవల బదిలీల్లో భాగంగా 148 పోస్టులలో 89 మంది వైద్య సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 11 మంది వైద్యులను బదిలీ చేయడంతో అత్యాధునిక వైద్యం అందని ద్రాక్షగా మారింది. 70 మంది నర్సులను సైతం బదిలీ చేయడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
Sorry, no posts matched your criteria.