India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కుమారుడు మృతి చెందడంతో గుండెపోటుతో తల్లి మృతి చెందిన ఘటన లక్ష్మణ్చందా మండలంలో చోటుచేసుకుంది. రాచాపూర్ గ్రామానికి చెందిన బక్కన్న, ఎర్రవ్వలకు ఓ కుమారుడు, ముగ్గరు కుమార్తెలు. కుమారుడు సాయన్న(40) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈనెల 13న మృతి చెందాడు. దీంతో మనోవేదనకు గురైన అతడి తల్లికి గుండెపోటు వచ్చింది. కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
DSC పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా ఆన్లైన్ విధానంలో పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి 11.30, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులను ఉదయం 7.30 నుంచే లోనికి అనుమతిస్తారు. కాగా ఉదయం, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 100మంది విద్యార్థులు హాజరుకానున్నారు. >>ALL THE BEST
విధులు నిర్వరిస్తున్న పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు 2టౌన్ CI కరుణాకర్రావ్ తెలిపారు. RIMSలో కొలిపూర్కు చెందిన సాయికుమార్, నవీన్ ఇద్దరు మంగళవారం మద్యం మత్తులో సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నారు. గొడవ ఆపేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్, హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు CI వెల్లడించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2025 జనవరి 18న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో తొలిఏకాదశి వేడుకలు
★ ముధోల్ : కుళ్ళిన అంగన్వాడీ కోడిగుడ్లు
★ ఆదిలాబాద్ : పోలీసులపై డాడి.. ఇద్దరు జైలుకు
★ భైంసా : నీటిలో మునిగి ఎద్దు మృతి
★ ఆదిలాబాద్ : మహారాష్ట్ర మద్యం బాటిళ్ల పట్టివేత
★ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసానికి ఏర్పాట్లు పూర్తి
★ ఆదిలాబాద్ : యువకుడి అదృశ్యం
★ మందమర్రి : గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్
★ త్వరలో జిల్లాకు డిప్యూటీ సీఎం రాక
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం, శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 11.5 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా మంగళవారం ఆసిఫాబాద్ దహెగాం మండలం కుంచవెల్లిలో 13.2 సెంటిమీటర్ల వర్షం కురిసింది.
విద్యుత్ దీపాలు లేక ముధోల్ బస్స్టాండ్లో వారం రోజులుగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. దీనిపై Way2 Newsలో ”అంధకారంలో ముథోల్ ఆర్టీసీ బస్టాండ్” అనే శీర్షికతో కథనం ప్రచురితం అయింది. కథనానికి స్పందించిన అధికారులు బుధవారం బస్టాండ్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
DOST ద్వారా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు తమ గ్రూపు, మీడియంను మార్చుకోవడానికి అవకాశం కల్పించినట్లు ADB జిల్లా దోస్త్ కో- ఆర్డినేటర్ నర్సింగ్రావు తెలిపారు. దోస్త్ లాగిన్ లోకి వెళ్లి ఐడీ పిన్ నంబరును ఎంటర్ చేసి తమ గ్రూపు లేదా మీడియంను ఈ నెల 18లోగా మార్చుకోవచ్చన్నారు. గ్రూపు లేదా మీడియం మార్చుకున్న విద్యార్థులకు కొత్త గ్రూపు లేదా మీడియంను 19న కేటాయించనున్నట్లు వెల్లడించారు.
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం నేపథ్యంలో మూడు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బల్దియా కార్యాలయంలో జరగనున్న అవిశ్వాస సమావేశానికి తప్పకుండా హాజరై మద్దతు తెలపాలని రాజకీయ పార్టీలు తమ కౌన్సిల్ సభ్యులకు విప్లు జారీ చేశాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేష్ నోటీసులు గోడలపై అతికించారు.
ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 29,543 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. నిర్మల్ జిల్లాలో 342 పోస్టులకు 6,035, ADBలో 324 పోస్టులకు 9,569, MNCLలో 288 పోస్టులకు 8,262, ASFలో 341 పోస్టులకు 5,677 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
Sorry, no posts matched your criteria.