India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ పట్టణంలో స్టార్ 50 పేరిట ఐటీడీఏ, గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతులతో విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. ఎస్టీ కేటగిరి విభాగంలో పవార్ చంటి 422 ర్యాంకు, సాయి కృష్ణ 734 ర్యాంక్ సాధించి ప్రతిభ కనబర్చారు. మరో 16 మందికి మంచి ర్యాంకులు వచ్చాయని, వారందరికి ఎస్టీ కోటాలో ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశాలు లభిస్తాయని కేంద్రం ఇన్ఛార్జ్ మారుతి శర్మ తెలిపారు.
ఎంపీ ఎన్నికలు ముగిసిపోవడంతో నామినేట్ పదవులు భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలోని బోథ్ మార్కెట్ కు ఇప్పటికే పాలకవర్గం ఏర్పాటు చేశారు. తాజాగా ఆదిలాబాద్, జైనథ్, ఇచ్చోడ మార్కెట్లకు కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేస్తూ ప్రతిపాదనను పంపించారు. రెండు రోజుల్లో ఆదేశాలు జారీ కానున్నాయి. ఆదిలాబాద్, జైనథ్ మార్కెట్లో ఈ దఫా జనరల్, ఇంద్రవెల్లి మార్కెట్ ఎస్టీకి, ఇచ్చోడ మార్కెట్ ఎస్టీ మహిళకు కేటాయించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన 20 రోజుల్లో పిడుగుపాటుకు గురై 14 మంది మృతి చెందారు. గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంద్రవెల్లి మండలం డోంగర్గాంలో ఆనక సంతోష్ (28), స్వప్న (26) యువ దంపతులు, చెన్నూర్, కౌటాల, దస్తురాబాద్, తలమడుగు, పెంబి మండలాల్లో పిడుగుపాటుకు పశువులు, వందలాది మేకలు మృత్యువాత పడ్డాయి.
JEE అడ్వాన్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని సత్తా చాటింది. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్కు చెందిన నర్ర నవీన్ యాదవ్-
రమాదేవి దంపతుల కూతురు నర్ర సిరి జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 2236 ర్యాంకు సాధించింది. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం పట్ల కుటుంబీకులు, బంధువులు విద్యార్థినిని అభినందించారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలం స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం దగ్గర కాలువ సమీపంలో కూన చిన్న పోషయ్య అనే వ్యక్తి ఉరేసుకుని మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సంఘటన విషయాన్ని పోలీసులకు చేరవేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ను ఆదివారం ఢిల్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం పూల మొక్క అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పాల్వాయి హరీశ్ బాబు, దన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ నాయకులు తదితరులున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కోర్డు ఆవరణలో ఇద్దరు చోరీకి యత్నించారు. టూ టౌన్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఇద్దరు వ్యక్తులు కోర్టు ఆవరణలోని నీటి విద్యుత్ మోటార్, 2 పైపులను చోరీ చేసి, రిక్షాలో తీసుకెళ్తుండగా గమనించిన కోర్టు అటెండర్ శ్రీనివాస్ వారిని మందలించడంతో వారిద్దరూ రిక్షాను వదిలి పారిపోయారు. అటెండర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
KU పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి బీఎస్ఎల్ సౌజన్య తెలిపారు. ఈనెల 11 నుంచి ఈపరీక్షలు జరగాల్సి ఉండగా.. వివిధ పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సెమిస్టర్ పరీక్షల్ని వాయిదా వేసినట్లు తెలిపారు.
కూతురే పెద్దకొడుకై తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి తలకొరివి పెట్టిన ఘటన తాండూర్లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. IBకి చెందిన రవికుమార్ కొన్ని నెలలుగా HYDలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, సోదరులు ఉన్నారు. తలకొరివి పెట్టడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో మృతుడి పెద్ద కుమార్తె కావ్య కుమారుడి బాధ్యతను తీసుకొని తలకొరివి పెట్టింది.
సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు ఈ నెల 29 వరకు పొడిగించినట్లు కార్పొరేట్ జీఎం పర్సనల్ దీక్షితులు తెలిపారు. సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవడంలో గత నెల 15న సాంకేతిక సమస్యలు తలెత్తాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్ లైన్ ప్రక్రియ మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.