Adilabad

News June 8, 2024

ADB: ‘గ్రూప్ 1 పరీక్షలో సందేహాలకు సంప్రదించండి’

image

ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మద్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరుగుతుందని 6,729 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలు, హాల్ టికెట్ డౌన్ లోడ్ గురించి, ఇతర సందేహాల నివృతి కోసం 9491053677 నంబర్‌ను సంప్రదింవచ్చిన అభ్యర్థులకు సూచించారు.

News June 7, 2024

సీఎంతో ముఖాముఖి కార్యక్రమానికి జన్నారం విద్యార్థి

image

సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖి కార్యక్రమానికి జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థి రాథోడ్ ఈశ్వర్ ఎంపికయ్యారు. జూన్ 9న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో విద్యాశాఖ సహకారంతో పదో తరగతి టాపర్లతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ నెల 10న హైదరాబాద్‌లోని హరిహర కళాక్షేత్రంలో విద్యార్థులను, హెచ్ఎంలను, తల్లిదండ్రులను ఆయన సన్మానించనున్నారు.

News June 7, 2024

కరీంనగర్ ఎంపీని కలిసిన ఆదిలాబాద్ ఎంపీ

image

బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని ఢిల్లీలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్ సైతం ఆదిలాబాద్ ఎంపీ నగేశ్‌ను శాలువతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు ముస్తాపురే అశోక్, తదితరులు పాల్గొన్నారు.

News June 7, 2024

ఆదిలాబాద్‌లో పోస్టుల వివరాలు ఇలా..!

image

ADB జిల్లాలో మొత్తం ఉపాధ్యాయ పోస్టులు 3,028 ఉండగా ప్రస్తుతం 2,467 మంది పని చేస్తున్నారు. మార్చి నుంచి ఇప్పటి వరకు 20 మంది పదవీవిరమణ పొందగా ఇందులో నలుగురు అనారోగ్య, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో 561 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 275 ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్లో చూపించారు. ఆయా కేటగిరిల్లో 286 ఖాళీలు ఉన్నాయన్నమాట. తాజా డీఎస్సీలో చేర్చితే పోస్టులు పెరిగి నిరుద్యోగులకు మేలు జరిగే అవకాశముంది.

News June 7, 2024

ఆదిలాబాద్: ఓపెన్ యూనివర్సిటీ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెండవ సంవత్సరం మూడవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ టి. ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. మార్చి నెలలో విద్యార్థులు పరీక్షలు రాయగా నేడు ఫలితాలు విడుదల అయినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

News June 7, 2024

ఆదిలాబాద్: హమ్మయ్య..! చల్లబడిన వాతావరణం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఎండవేడిమి తగ్గినా.. ఉక్కపోత అలాగే ఉండటంతో ఒకటి, రెండు భారీ వర్షాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు ఉగ్రరూపం చూపిన భానుడు వర్షం ప్రభావం వల్ల కొంత చల్లబడ్డాడు. ఈ నెలలో 47 డిగ్రీల వరకు చేరుకున్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 37, 35 డిగ్రీలకు పడిపోయాయి.

News June 7, 2024

ADB: పిడుగు పాటుతో నలుగురు మృతి 

image

ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో నిన్న ఒక్కరోజే పిడుగు పాటుకు 4 గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతి చెందిన వారి కుటుంబాలు పెద్దదిక్కు కోల్పోయాయి. దిలావర్పూర్ మండలానికి చెందిన ప్రవీణ్(26), ఇంద్రవెల్లి మండలానికి చెందిన దంపతులు సంతోష్(26), స్వప్న(23), తానూర్ మండలానికి చెందిన మాగిర్వడ్ (13) పిడుగు పాటుతో మృతి చెందారు. పిడుగులు పడే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

News June 7, 2024

నిర్మల్: పిడుగు పడి బాలుడు మృతి

image

పిడుగు పడి బాలుడు మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎల్వత్ గ్రామానికి చెందిన మగీర్వాడ్ శ్రీ (10) గురువారం పిడుగు పాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. శ్రీ ఉదయం మేకలు మేపడానికి వెళ్లాడు. మద్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు పడటంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. తండ్రి సాయినాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News June 7, 2024

ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు రేపే లాస్ట్ డేట్

image

ఉమ్మడి ADB జిల్లా నిరుద్యోగ యువకులకు (NAC) ద్వారా అందించే శిక్షణకు దరఖాస్తు గడువు రెపటితో (జూన్ 8) ముగియనుందని న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్రం తెలిపారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, తదితర కోర్సుల్లో 3 నెలల ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. ఈ శిక్షణకాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 6, 2024

ఇంద్రవెల్లి: పిడుగుపాటుతో భార్యాభర్తలు మృతి

image

పిడుగుపాటుకు గురై భార్యాభర్తలు మృతి చెందిన ఘటన ఇంద్రవెల్లి మండలంలోని దొంగర్గావ్ శివారులో జరిగింది. గ్రామానికి చెందిన స్వప్న, సంతోష్ భార్యాభర్తలు. గురువారం సాయంత్రం పొలానికి వెళ్లారు. ఈదురు గాలులతో భారీ వర్షం రావడంతో అక్కడే ఉన్న చిన్న గుడిసెలో తలదాచుకున్నారు. ఆ సమయంలో పిడుగు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.