India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రావణమాసం ప్రారంభం కావడంతో పల్లె, పట్టణాల్లో పూజలు మొదలయ్యాయి. పెళ్లి సందళ్లు సన్నాయి సవ్వడులు వినిపించనున్నాయి. రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశమున్న తరుణంలో ఇళ్లవద్ద ఇబ్బందులుంటాయని కళ్యాణ మండపాలపైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పెళ్లి బాజా మోగనున్న నేపథ్యంలో అనేక మందికి చేతినిండా పనులు లభించనున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 20వేల జంటలు ఏకం కానున్నట్లు అర్చకుల టాక్.

కడుపునొప్పి భరించలేక వాంకిడి మండలానికి చెందిన యువతి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై సాగర్ తెలిపారు. బెండార గ్రామానికి చెందిన సోనీ(20) హైదరాబాద్లో GNM సెకండియర్ చదువుతోంది. గతేడాదిగా ఆమె కడుపునొప్పితో భాదపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ప్రయోజనం లేకపోయింది. దీంతో సోమవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5నుంచి 9వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమ అమలు పర్యవేక్షించేందుకు గాను ఉమ్మడి జిల్లాకు ఇద్దరు ఐఏఎస్లను ప్రత్యేకాధికారులుగా నియమించింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ జి.రవి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె.ఇలంబరిదిలను నియమించారు.

బజార్హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామానికి బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నారు. ఉదయం 11:15నుంచి 1:30 గంటల వరకు పిప్రిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు వెల్లడించారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలన్నారు.

★ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
★కాగజ్నగర్: మట్కా ఆడుతూ పట్టుబడిన యువకుడు
★ముధోల్: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
★రామకృష్ణాపూర్: ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్
★నస్పూర్: పేకాట ఆడుతున్న ముగ్గురు పట్టివేత
★నేరడిగొండ: లారీ ఢీకొని వృద్ధురాలి మృతి
★నిర్మల్: వైన్ షాపులో చోరీ
★మంచిర్యాల:షార్ట్ సర్క్యూట్తో కారులో మంటలు
★మంచిర్యాల: పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్

తలమడుగు పరమహంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరి మాతజీ దివేనలతో అర్లిలో 24 సంవత్సరాల తర్వాత ఈరోజు అఖండ జ్యోతి కార్యక్రమాన్ని గ్రామస్థులు నెల రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న , బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లకి యాత్రలో పాల్గొన్నారు.

కడెం ప్రాజెక్టు నుంచి 957 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టులో 696.22 అడుగుల నీటిమట్టం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 4,323 క్యూసెక్కుల నీరు వస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూతన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి తేదీ అని అధికారులు తెలిపారు. క్లస్టర్ పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న నూతన రైతులు తమ రైతు వేదికలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. రైతు బీమా ఫామ్, రైతు ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డ్, పట్టా పాస్ బుక్, బ్యాంక్ జిరాక్స్ కాపీలను వారి వెంట తెచ్చుకోవాలని కోరారు.

దహెగాంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని <<13777263>>ఒకరు <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొంచవెల్లి గ్రామానికి చెందిన చిప్ప సూరజ్, చౌదరి నవీన్ కాగజ్నగర్ పట్టణానికి వెళ్లి సామాగ్రి కొనుగోలు చేసి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో మూలమలుపు వద్ద ఆగి ఉన్న మరో బైక్ను ఢీకొన్నారు. చౌదరి నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడని స్థానిక ఎస్సై తెలిపారు. మృతుడు ఇంటర్ చదువుతున్నాడు.

బురదరోడ్డు యువతి ప్రాణాలు తీసింది. వివరాలిలా.. గుడిహత్నూర్(M) న్యూపోమార్పేటకి చెందిన లక్ష్మి(26) శనివారం రాత్రి పాముకాటుకు గురైంది. ఈ విషయాన్ని తెల్లవారుజామున తల్లికి చెప్పింది. ఆ ఊరికి అంబులెన్స్ సదుపాయం లేదు. వెంటనే ఆమెను సమీపంలో ఉన్న వాగు వరకు ఎత్తుకొని వెళ్లి, ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించడంలో జాప్యం కావడంతో యువతి మృతి చెందింది. ఆస్పత్రికి చేరేందుకు 13కి.మీకు 2గ. పట్టింది.
Sorry, no posts matched your criteria.