India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి BJP అభ్యర్థిగా పోటి చేసిన గోమాసె శ్రీనివాస్ 2 సార్లు ఒకే కుటుంబానికి చెందిన వారి చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై ఓడిపోయిన ఆయన తాజాగా ఆయన కుమారుడు వంశీకృష్ణపై ఓటమి పాలయ్యారు. 2009లో TRS తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై 49,017 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ఇప్పడు 1,31,364 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అసెంబ్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ
సిర్పూర్ 19840 62956 71325
అసిఫాబాద్ 38597 73996 47056
ఖానాపూర్ 18520 61587 75106
ఆదిలాబాద్ 16265 77056 82394
బోథ్ 22472 65204 70118
నిర్మల్ 8264 64033 107603
ముధోల్ 12505 67501 105334
మొత్తం BRSకు 1,37,300 ఓట్లు, CONGకు 4,77,516, BJPకి 5,68,168 ఓట్లు రాగ 90,652 మెజార్టీ వచ్చింది.
20 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ ఓటర్లు ఏ పార్టీకి రెండు సార్లు వరుసగా విజయాలు ఇవ్వలేదు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బీజేపీదే కావడం.. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి 20ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఇదే కాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత BJPలో చేరిన సోయం ఎంపీగా గెలిచారు. ఇప్పుడు గొడం నగేశ్ సైతం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి MPగా పోటీలో నిలిచారు. అలాగే పార్టీలో చేరిన వెంటనే గెలిచిన అభ్యర్థిగా నగేశ్ నిలిచారు.
లోక్సభ ఓట్ల లెక్కింపుల్లో BRS అభ్యర్థి ఆత్రం సక్కు అన్ని రౌండ్లలో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019లోక్సభ ఎన్నికల్లో 3,18,665 సాధించి రెండోస్థానంలో నిలిచిన BRS మొన్నటి శాసనసభల్లో ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలకే పరిమితమైనప్పటికీ ఏడు నియోజకవర్గాల్లో వచ్చిన 4,48,961 ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా కేవలం 1,37,217 ఓట్లతో 3వ స్థానానికి రావడం గమనార్హం
ఆదిలాబాద్ లోక్సభ స్థానం (ఎస్టీ)లో మరోసారి భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది. గోడం నగేశ్ 86, 603 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరో 4049 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిగణనలోకి తీసుకొంటే నగేష్ 90,652 ఓట్లను దక్కించుకున్నారు. ఒక్క ఆసిఫాబాద్ నియోజకవర్గం మినహా మిగతా ఆరు నినియోజకవర్గాల్లో బీజేపీ హవా కొనసాగింది. 2019లో బీజేపీకి 58,227 ఆధిక్యత రాగా ఈ సారి ఏకంగా 90,652 ఓట్ల BJPకి మెజార్టీ దక్కింది.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఫలితాల్లో నోటాకు భారీగా ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో కలిపి మొత్తం 11,743 ఓట్లు రావడంతో నాలుగో స్థానంలో నిలిచింది. శ్యామ్ నాయక్ అభ్యర్థికి 7,496 ఓట్లు రాగ ఐదవ స్థానంలో నిలిచారు. మెస్రం జంగుబాపు అభ్యర్థికి 6,735 ఓట్లు, రాథోడ్ రమేష్ అభ్యర్థికి 6521, జైవంత్ రావ్ అభ్యర్థికి 6,439 ఓట్లు వచ్చాయి.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో BJP అభ్యర్థి గోడం నగేశ్ 86,883 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 23 రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి 86,883 ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. BJP 5,58,103, కాంగ్రెస్ 4,71,220, బీఆర్ఎస్ 1,36,380 ఓట్లు సాధించాయి. కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 9,232 కలిపి మొత్తం 90,932 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 17వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ 62,366 ఓట్ల మెజార్టీతో కొనసాగుతొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి 1,02,092, కాంగ్రెస్ అభ్యర్థి 3,65,688 బీజేపీ అభ్యర్థి 4,28,054 ఓట్లు సాధించారు.
ఆదిలాబాద్లో పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి 5,660 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి 19,623, బీజేపీ అభ్యర్థి 28,429 ఓట్లు సాధించారు. కాగా బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ 8,806 ఓట్లతో అధిక్యంలో ఉన్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్లో మొత్తం 156 రౌoడ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఒక్కో టేబుల్పై 14 ఈవీఎంలను అధికారులు లెక్కించనున్నారు. మొత్తం ఓట్లు 16,50,175 ఉండగా 12,21,583 ఓట్లు పోలయ్యాయి. 74.03 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం ఏడు కౌంటింగ్ హాల్స్ ఉండగా ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్లో 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. గంటకు నాలుగు రౌండ్లు చొప్పున లెక్కించనున్నారు.
Sorry, no posts matched your criteria.