Adilabad

News June 4, 2024

ఆదిలాబాద్: 8 గంటలకు షురూ..3 గంటలకు పూర్తి..!

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభం కానుంది. దీనికి వేరువేరుగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ స్థానాల వారిగా పోలైన ఓట్లు, మొత్తం పోలింగ్ బూత్ ల ఆధారంగా లెక్కింపుకు టేబుళ్లను సిద్ధం చేశారు. ఉదయం 8 ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా పూర్తిస్థాయి ఫలితాల వెల్లడికి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చే అవకాశముంది.

News June 3, 2024

RTV Survey: ADBలో బీజేపీ, ZHBలో కాంగ్రెస్ గెలుపు!

image

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా RTV Survey‌‌ తాజాగా వివరాలు వెల్లడించింది‌. రాష్ట్రంలో BJP-10, INC-6, BRS-0, MIM- ఒక స్థానంలో‌ గెలిచే అవకాశం ఉన్నట్లు‌ తెలిపింది. ఆదిలాబాద్‌లో‌ BJP, పెద్దపల్లిలో కాంగ్రెస్‌ గెలవబోతున్నట్లు‌ RTV Survey‌‌ పేర్కొంది. నిజామాబాద్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్.. పెద్దపల్లిలో BJP, BRS ఖాతా తెరవదని‌ అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 3, 2024

మందమర్రి: కాలకృత్యాలకు వెళ్లి యువకుడి మృతి

image

కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ఒక యువకుడు మృతి చెందిన ఘటన మందమర్రిలో చోటు చేసుకుంది. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన శ్యాంసుందర్(30) ఉదయం కాలకృత్యాలకు బాత్రూంలోకి వెళ్లి బయటికి రాకపోవడంతో కుటుంబీకులు డోర్లు పగలగొట్టి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. 108కు కాల్ చేయగా సిబ్బంది వచ్చి పరిశీలించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. మృతుని తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News June 3, 2024

మంచిర్యాల: అటవీ సిబ్బందిపై దాడి.. యువకులపై కేసు

image

జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద అటవీ సిబ్బందిపై దాడి చేసిన పలువురిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాజా వర్ధన్ తెలిపారు. ఆదివారం రాత్రి తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సాయికుమార్ వాహనాలు తనిఖీ చేస్తుండగా తాళ్లపేట వైపు నుండి బైక్ పై వచ్చిన యువకులు కార్లో ఉన్నవారితో గొడవ పడ్డారన్నారు. గొడవ వద్దని చెప్పిన బీట్ ఆఫీసర్, వాచర్లపై దాడి చేసిన యువకులపై కేసు నమోదు చేశామన్నారు.

News June 3, 2024

మన ఎంపీ వంశీకృష్ణనా.. కొప్పులనా.. శ్రీనివాసా?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో పెద్దపల్లి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, BJP నుంచి గోమాస శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

నిర్మల్: పెళ్లి పేరిట మోసం.. యువకుడి అరెస్ట్

image

యువతిని మోసం చేసిన కేసులో ఓ యువకుడిని రిమాండ్‌కు తరలించినట్లు పెంబి SI శంకర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలోని  ఓ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటావని నమ్మించి మూడేళ్లుగా ఆమెతో సహజీవనం సాగించాడు. ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు.

News June 3, 2024

రేపే RESULTS.. ఆదిలాబాద్ ఎంపీ ఎవరు..?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో ఆదిలాబాద్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి ఆత్రం సక్కు, కాంగ్రెస్ నుంచి సుగుణ, BJP నుంచి గోడం నగేశ్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

ఆదిలాబాద్: నేడు POLYCET ఫలితాలు

image

పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం మే 24న పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. కాగా ఆ పరీక్షకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,059 విద్యార్థులు ఉండగా బాలురు 531, బాలికలు 408, మొత్తం 939 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, ర్యాంకు ఆధారంగా వివిధ పాలిటెక్నిక్ కళాశాలలు, కోర్సులలో అడ్మిషన్స్ జరుగుతాయి.

News June 3, 2024

ఆదిలాబాద్: ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

image

పెద్దపల్లి లోక్‌సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజుల ఉత్కంఠకు రేపటితో తెర పడనుంది. సెంటీనరీ కాలనీలోని JNTUH ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ప్రతి శాసన సభ నియోజకవర్గానికి 14 టేబుళ్ల చోప్పున ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో మొత్తం 15,96,430 మంది ఓటర్లు ఉండగా, 10,83,453 ఓట్లు పోలయ్యాయి.

News June 3, 2024

ఆదిలాబాద్: రేపు మద్యం దుకాణాలు బంద్

image

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఆదిలాబాద్ ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.