India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యుత్ షాక్ తగిలి ఓ బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్లో చోటుచేసుకుంది. పట్టణంలోని కేఆర్కే కాలనీలో ఓ ఇంటి యజమాని ఇంటి బయట మురికి కాలువపై కూలర్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే గోపాల్ (14) పిల్లలతో కలిసి బుధవారం ఆడుకుంటూ కూలర్ను ముట్టుకోవడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిర్మల్ జిల్లాలోని బాసర IIIT క్యాంపస్ ప్రవేశాలకు అర్హుల జాబితా విడుదలైంది. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి మొత్తం 1,500 సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాలను జులై 8, 9, 10 తేదీల్లో పరిశీలిస్తారు. స్పెషల్ కేటగిరీ ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితా ఇప్పటికే విడుదలైంది. వారికి జులై 4, 5 తేదీల్లో బాసర క్యాంపస్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన <<13547638>>తల్లికూతుళ్ల <<>>ఘటనలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో తల్లి, ముగ్గురు కూతుళ్లు<<>> మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో బుధవారం ఇద్దరు మృతిచెందారు. తల్లి వనిత (45), కూతురు రమ్య (14)లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
బాసర IIITలో 2024-25 విద్యా సంవత్సరంలో 1500 సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యింది. జూన్ 1 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విద్యార్థుల జాబితాను రూపొందించారు. మెరిట్ విద్యార్థుల జాబితాను క్యాంపస్లో విడుదల చేయనున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న వివరాలు బుధవారం వెల్లడిస్తామని ఇన్ఛార్జి వీసీ తెలిపారు. జాబితా విడుదలైన అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మంగళవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో నిర్మల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కొరిపల్లి విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.
సారంగాపూర్ మండలం అడేల్లిపోచమ్మ ఆలయ సమీపంలో గల రిజర్వ్ ఫారెస్ట్లో ప్రమాదవశాత్తు బండరాయిపై పడి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కౌట్ల(బి) గ్రామానికి చెందిన భీమన్న అనే వ్యక్తి మంగళవారం పోచమ్మ ఆలయం వద్ద గ్రామస్థులు పండుగ చేయగా అక్కడికి వెళ్ళాడు. మోదుగ ఆకులు తెంపడానికి రిజర్వ్ ఫారెస్ట్కు వెళ్లగా ప్రమాదవశాత్తు బండరాయిపై జారిపడ్డాడు.
ఆదిలాబాద్ తిర్పల్లిలోని ఓ గోడౌన్లో నిల్వ ఉంచిన దాదాపు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ అశోక్ గోదామును పరిశీలించి నిల్వలను గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించామన్నారు. సిబ్బంది నరేష్, రమేష్, క్రాంతి ఉన్నారు.
దిలాబాద్ శివాజీ చౌక్ ప్రాంతంలో ఆర్ఎంపీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు క్లినిక్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో స్థాయికి మించి ఫస్ట్ ఎయిడ్ కేంద్రంలో అందించే సేవల కంటే రోగులను ప్రభావితం చేసే అంశాలను అధికారులు గుర్తించారు. దీ రెండు క్లినిక్లకు షోకాజ్ నోటీసులు అందజేసి రూ.5 వేల జరిమానా విధించారు.
సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ 2025 (ప్రిలిమ్స్, మెయిన్స్) పరీక్ష కోసం ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా జులై 3తో గడువు ముగియనున్నట్లు వెల్లడించారు.
ASF జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై <<13547833>>అత్యాచారం<<>> జరిగిన విషయం తెలిసిందే. DSP కరుణాకర్ ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంకట్రావ్పేటకు చెందిన ఓ యువతిని ఆత్యాచారినికి గురైన చిన్నారి తండ్రి ప్రేమ పేరుతో వేధించాడు. ఆ యువతి నిరాకరించడంతో 17-9-2023న ఆమెకు పురుగుమందు తాగిపించడంతో మృతి చెందింది. కాగా చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆ యువతి సోదరుడు కావడంతో ప్రతికార చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.