India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏటా వర్షాకాలంలో పూసే రాఖీ పుష్పం రక్షాబంధన్ పండగకు ముందే వికసించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ శివాలయం ప్రాంగణంలో తీగకు పూసిన ఆ రాఖీ పూలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వీటిని భక్తులు శివుడి పూజలో వినియోగిస్తుంటారు. పూలల్లో ఈ రాఖీ పువ్వు చూడముచ్చటగా ఉంటోంది.

ఓ వైపు రుణమాఫీ సంబరాలు జరుగుతుండగా మరోవైపు మాఫీ జాబితాలో తమ పేర్లు లేవంటూ వేలాది మంది ఆవేదనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లాలో సుమారుగా 1.80 లక్షల మం ది రైతులున్నారు. లక్షలోపు రుణాలున్న 30,109 మంది రైతులకు మొదటి విడతలో, రూ.1.50 లక్ష లలోపు రుణాలున్న 19,058 మంది రైతులకు రెండో విడత జాబితాలో పేర్లు వచ్చాయి. జిల్లాలో 4.40 లక్షల ఎకరాల పంటభూములున్నాయి. వీరు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు.

ఆదిలాబాద్లోని ఓ హోటల్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న నలుగురు వ్యక్తులు హోటల్లో భోజనానికి వెళ్లి సిబ్బందితో గొడవపడి బయటకు వచ్చేశారు. అనంతరం హోటల్ ఫొటో తీసుకొని అందులో భోజనం సరిగా ఉండదని, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా కామెంట్స్ రాసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఈ విషయమై హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో గురువారం నుంచి ఉచిత బియ్యం పంపిణి ప్రారంభమవుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా రేషన్ కార్డుదారులు ఈ విషయాన్నీ గమనించి తమ సమీప డిపో వద్దకు వెళ్లి బియ్యాన్ని తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కోర్టులో చరిత్రాత్మక కేసు విచారణ జరిగింది. వివరాలు..తాంసి మండలం జామిడికి చెందిన మునీశ్వర్ రాంబాయి, భగత్ సులోచన తలమడుగు PSలో ఓ ఘటనపై 2017 సం.లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పై ఇద్దరి బాధితుల సాక్ష్యం నమోదు చేయాలి. అయితే ఇద్దరు నడవలేని స్థితిలో అనారోగ్యంతో బాధపడుతుండగా ఆటో సహాయంతో కోర్టు వరకు వచ్చారు. కాగా న్యాయమూర్తి దుర్గారాణి స్వయంగా వారివద్దకు వెళ్లి విచారణ చేపట్టారు.

సైబర్ మోసగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారని DSP జీవన్రెడ్డి తెలిపారు. కేటుగాళ్లు ప్రజలకు ఫోన్ చేసి మీ కుటుంబీకులు డ్రగ్స్తో పట్టుబడ్డారని వారిని విడిపించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈరకమైన కాల్స్ పోలీస్, ఇతర అధికారులు చేస్తు మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్కాల్స్ వస్తే ప్రజలు నమ్మవద్దని కోరారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే నిర్ధారించుకోవాలన్నారు.

◆ ఆదిలాబాద్: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
◆ ఆసిఫాబాద్: షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
◆ బోథ్: రెండు ఆటోలు ఢీ కూలీలకు గాయాలు
◆ ఉట్నూరు: రోడ్డుప్రమాదం ఇద్దరికి తీవ్రగాయాలు
◆ మామడ :విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి
◆ బాసర: గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య
◆ అదుపు తప్పిన నిర్మల్ వస్తున్న RTC బస్సు
◆ ఆందోళనకు గురిచేస్తున్న పాముకాటు ఘటనలు
◆ లక్షెట్టిపేట: గంగమ్మ తల్లి ఆలయంలో చోరీ
◆ నిర్మల్: 30యాక్ట్ అమలు

తమకు దొరికిన సెల్ ఫోన్ పోలీస్ స్టేషన్లో అప్పగించి చిన్నారులు తమ నిజాయితీని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ముగ్గురు చిన్నారులకు బుధవారం ఓ సెల్ఫోన్ దొరికింది. వెంటనే 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. రాంనగర్ కాలనీకి చెందిన దేవిదాస్ ఫోన్ గా పోలీసులు గుర్తించారు. ఆయనను పిలిపించి ఎస్ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఫోన్ అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు, దేవిదాస్ చిన్నారులను అభినందించారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రం ధర్మపురి కాలనీకి చెందిన తుమ్మల లక్ష్మి (32) అనే వివాహిత బుధవారం బాసరలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గణేష్ ఘాట్ వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

మహాలక్ష్మి పథకం వినియోగానికి సంబంధించి ఆదిలాబాద్ RTC రీజియన్ వ్యాప్తంగా పరిశీలిస్తే నిర్మల్ డిపోలో అధికంగా లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. గత డిసెంబర్ నుండి జులై వరకు నిర్మల్ జిల్లాలో జీరో టిక్కెట్ తీసుకున్న మహిళలు 96.54 లక్షల మంది ఉన్నారు. మంచిర్యాలలో 78 లక్షలు, ఆదిలాబాద్లో 50 లక్షలు, బైంసాలో 56 లక్షలు, ఆసిఫాబాద్లో 49, ఉట్నూర్ పరిధిలో 16 లక్షల మంది అతివలు, బాలికలు ప్రయాణం చేశారు.
Sorry, no posts matched your criteria.