India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిర్పూర్ టీ మండలం వెంకట్రావ్ పేట్లో మూడు సంవత్సరాల పాపను ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఎస్ఐ రమేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మూడేళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా బుదే రాజేందర్ అనే వ్యక్తి తన ఇంటికి తీసుకుని పోయి అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు. పాప తండ్రి ఫిర్యాదు మేరకు కాగజ్నగర్ డీఎస్పీ కేసు నమోదు చేసి నింధితుడిని రిమాండ్కు తరలించారు.
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో అధికారులకు సహకరించే బాధ్యత ప్రజాప్రతినిధులదని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సోమవారం జిల్లా పర్యటనలో నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి అంకిత భావంతో జిల్లాను అభివృద్ధి చేద్దామన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని, అధికారులు ప్రజలతో మమేకమవలని సూచించారు.
2024-2025 సంవత్సరానికి స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాల ఎంపిక కొరకు ఈ నెల 3, 4 తేదీల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా క్రీడా శాఖ అధికారి కీర్తి రాజవీర్ తెలిపారు. ఓయూ క్యాంపస్, హన్మకొండ, ఖమ్మం, వనపర్తి, సరూర్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అకాడమీల్లో ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన దస్తురాబాద్ మండలం మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎంబడి లావణ్య, మల్లేశ్ దంపతుల చిన్న కుమారుడు రాజ్ కుమార్ (13) సోమవారం ఇంటి అవసరాల కోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి నీరు తీసుకువచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఎస్ఐ శంకర్ తెలిపారు.
సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ 2025 (ప్రిలిమ్స్, మెయిన్స్) పరీక్ష కొరకు ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా జులై 3 వరకు గడువు ఉండగా జులై 7 వరకు పొడిగించారు.
దేశవ్యాప్తంగా నూతన చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ్చందా మండల పోలీస్ స్టేషన్లో సోమవారం మొదటి కేసు నమోదయిందని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. మండలంలోని నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన పోశెట్టి అనే వ్యక్తి ఈరోజు ఉదయం చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జులై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. 18 ఏళ్ల లోపు తప్పిపోయిన, వదిలివేయబడిన, వివిధ రకాల బాల కార్మికులను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా స్టేట్ హోమ్కు పంపనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముస్కాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
టమాట లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటన బేల మండలంలోని పాటన్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల ప్రకారం.. రహదారిపై ప్రమాదకరంగా గుంతలు ఉండటంతో లారీ డ్రైవర్కు రాత్రిపూట కనపడక ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణహాని జరగలేదు. కాగా.. టమాట లోడ్ పల్టీ కొట్టడంతో తీవ్ర నష్టం జరిగిందని రైతు వాపోయాడు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన బరిగల వెంకటేశ్(34) బతుకు తెరువు కోసం ఘనా దేశానికి వెళ్లాడు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి వెంకటేశ్ మృతదేహాన్నివీలైనంత తొందరగా స్వగ్రామానికి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా 30 పోలీస్ యాక్ట్ను సోమవారం నుంచి అమలుచేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈనెల 31 వరకు జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, సభలు ,ర్యాలీలు నిర్వహించవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.