India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తన ఇంట్లో నాగుపాము ఉందని తెలిసి ఓ వృద్ధురాలు కొన్నేళ్లుగా పాముకు పూజలు చేయగా.. చివరకు ఆ పాముకాటుకు గురై మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లెకి చెందిన గంగవ్వ(65) అంగన్వాడీ ఉద్యోగిగా రిటైరై ఇంటి వద్దే ఉంటోంది. మంగళవారం ఇంట్లో అలుకుతుండగా తాను పూజించిన పాము చేతిపై పలుమార్లు కాటు వేసింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది.

★ ఆదిలాబాద్ జిల్లాలోని KGBVలో 13 నాన్ టీచింగ్ పోస్టులు.. AUG 1లోపు దరఖాస్తులు
★ అంబెడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు.. AUG 18 LAST
★ AUG 1 నుండి DEECET సర్టిఫికెట్ వెరీఫికేషన్
★ పీజీ అసైన్మెంట్ సబ్మిషన్ కు నేడే LAST
★ నేడు పాలిసెట్ సీట్ల కేటాయింపు
★ RIMSలో వైద్య పోస్టుల భర్తీ.. AUG 6న ఇంటర్వ్యూ
★ ఆర్థికసహాయంకై.. ట్రాన్స్ జెండర్ ల నుండి దరఖాస్తులు
★ DOST రిజిస్ట్రేషన్ AUG 2న లాస్ట్

రైతులకు మేలుచేసే విధంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ కార్యక్రమానికి జిల్లాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అయినప్పటికీ ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా నోడల్ అధికారి రమేశ్ 7288894003 సంప్రదించాలని సూచించారు.
>>SHARE IT

LRS దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రక్రియలో కదలిక రానుంది. నిర్మల్ జిల్లాలోని మూడు పట్టణాల్లో 26,182 దరఖాస్తులకు మోక్షం కలగడంతోపాటు దాదాపు రూ.50 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఏర్పడింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో DEECETలో ర్యాంక్ సాధించిన అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. D.EDలో ప్రవేశానికి AUG 1 నుండి AUG 6వరకు సర్టిఫికెట్ వెరీఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్స్ అభ్యర్థులకు కేటాయించిన తేదీలలో ఆదిలాబాద్ డైట్ కళాశాలలో హాజరై సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు

◆ నిర్మల్: రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం
◆ ఆదిలాబాద్: రెండు ఆలయాల్లో దొంగతనం
◆ వాంకిడి: పేకాట ఆడుతున్న నలుగురిపై కేసు
◆ బాసర: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
◆ గుడిహత్నూర్: విద్యుత్ షాక్తో విద్యార్థి మృతి
◆ మంచిర్యాల: గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అరెస్ట్
◆ పెంబి: పురుగుల మందు తాగి యువకుడు మృతి
◆ ముధోల్: కుక్కల దాడిలో దూడ మృతి

ఆదిలాబాద్ జిల్లాలోని కేజీబీవీలు, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DEO ప్రణీత/ఎక్స్ అఫిషియో ప్రాజెక్టు అధికారి పేర్కొన్నారు. మొత్తం 13 పోస్టులకు జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు పోస్టులకు సంబంధిత MEO కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల మహిళలు అర్హులని తెలిపారు.

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై నోటిఫికేషన్ విడుదలైనట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. డిగ్రీ, పీజీలో తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. AUG 18 వరకు ONLINEలో దరఖాస్తులు చేసుకోవచ్చని వివరాలకు https://www.braouonline.in/ సందర్శించండి.

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అసైన్మెంట్ సబ్మిషన్ గడువు ఈనెల 31న ముగుస్తుందని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి తమ అసైన్మెంట్లు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అసైన్మెంట్లు పూర్తి చేసిన అనంతరం బుధవారంలోపు సబ్మిట్ చేయలని సూచించారు.

నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ధరణీ పోర్టల్ పై అసెంబ్లీలో మాట్లాడారు. ధరణి పోర్టల్ లో జరిగిన అక్రమాల్లో బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ కాపాడుతుందా..? అని ప్రశ్నించారు. లేదంటే భూముల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేయాలని కోరారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆభిప్రాయ సేకరణ జరిగిందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
Sorry, no posts matched your criteria.