Adilabad

News June 29, 2024

నిర్మల్: చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

image

సోన్ మండలం గాంధీనగర్ సమీపంలోని శ్రీరాంసాగర్ జరాష్ట్యంలో చేపల వేటకు వెళ్లి జాలరు మృతి చెందినట్లు ఎస్సై సంతోషం రవీందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాస్ కుంటే సూర్య (23) అనే జాలరు శనివారం ఉదయం 7 గంటలకు శ్రీరామ సాగర్ జలాశయంలోకి చేపల వేటకు వెళ్ళాడు. ప్రమాదవ శాత్తు వల చిక్కుకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News June 29, 2024

ఆదిలాబాద్ మాజీ MP రాథోడ్ రమేష్ ప్రస్థానం…

image

★నార్నూర్ మండలానికి చెందిన వ్యక్తి
★తొలిసారిగా TDP నుండి నార్నూర్ ZPTCగా ఎన్నికయ్యారు.
★ ఖానాపూర్ నుండి రెండుసార్లు MLAగా సేవాలందించారు.
★1999 – 2004 మద్యకాలంలో ఏపీ శాసనసభ సభ్యునిగా
★2006 నుండి 2009 వరకు ఆదిలాబాద్ ZP ఛైర్మన్‌గా ఉన్నారు.
★2009లో MPగా పనిచేసారు.
★కొన్ని నెలలో BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
★2021 లో BJP లో చేరారు.
★2023లో ఖానాపూర్ MLA గా పోటీచేసి ఓడిపోయారు.

News June 29, 2024

మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్‌కు తీవ్ర అస్వస్థత

image

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత అర్ధరాత్రి ఉట్నూర్‌లోని ఆయన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఎంఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎంపీ కోమాలో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

News June 29, 2024

ఆదిలాబాద్: ఇక పరిషత్‌లలో ప్రత్యేక పాలన..?

image

గ్రామ పంచాయతీల మాదిరిగానే జిల్లా, మండల ప్రజా పరిషత్‌లూ త్వరలోనే ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. జులై 4, 5 తేదీల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం పూర్తికానుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. దీంతో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్‌లోనూ ప్రత్యేకాధికారుల పాలనే అమలులోకి వచ్చే అవకాశం కన్పిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రానప్పటికీ కసరత్తు చేస్తున్నారు.

News June 29, 2024

ఆదిలాబాద్: SGT సీనియారిటీ జాబితా విడుదల

image

ఆదిలాబాద్ SGT సీనియారిటీ జాబితా విడుదలైంది. ఈ మేరకు DEO అన్ని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు SGTలు & తత్సమాన కేడర్ల బదిలీల కోసం సీనియారిటీ జాబితా వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సందేశాలు పంపారు. ఇందులో ఖాళీల జాబితా కూడా ప్రదర్శించామని పేర్కొన్నారు. MEOలు ఉపాధ్యాయులు ఖాళీలను ధ్రువీకరించాలని, బదిలీలో, జాబితాలో ఏమైనా సవరణలు ఉంటే శనివారం మధ్యాహ్నం 1లోగా దరఖాస్తులు చేసుకోవాలని అభ్యర్థించారు.

News June 29, 2024

ఆదిలాబాద్: జులై 8 వరకు రీవెరిఫికేషన్

image

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు 91.18 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మే నెలలో జరిగిన పరీక్షలకు 737 మంది విద్యార్థులు హాజరుకాగా 672 మంది పాసయ్యారు. ఇందులో 398 మంది బాలురు, 274 మంది బాలికలు ఉన్నట్లు డీఈవో ప్రణీత తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం జులై 8 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

News June 29, 2024

MNCL: మటన్‌తో పోటీపడుతున్న బోడకాకరకాయ ధర

image

వర్షాకాలం ప్రారంభంలో మాత్రమే లభించే బోడకాకరకాయ ధర ఆకాశాన్నంటుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బోడకాకరకాయ కిలో రూ.600 అమ్ముతున్నారు. మార్కెట్‌లో ఆ ధర చూసిన కొనుగోలుదారులు అవాక్కయ్యారు. కిలో చికెన్ రూ.240, మటన్ కిలో రూ.800ఉండగా.. బోడకాకరకాయ ధర రూ.600 పలకడం విశేషం.

News June 29, 2024

ఉట్నూర్: అధికారులతో ఐటీడీఏ పీఓ సమావేశం

image

ప్రధానమంత్రి జన జాతీయ న్యాయ మహా అభియాన్ పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పథకం అర్హులైన లబ్ధిదారులకు ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్, మొబైల్ నంబర్లను 15 రోజుల్లో కచ్చితంగా పూర్తిచేయాలని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల మండల తహసిల్దార్లను ఆదేశించారు. ఐటీడీఏ కోర్ట్ కేసులపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు.

News June 28, 2024

ఆదిలాబాద్: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తానూర్ మండలం కోలూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవక్వాడ్ అశోక్ (31) మద్యానికి బానిసై జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తన పంట చేనులో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 28, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ, రేపు బలమైన గాలులతో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురిసినట్లు పేర్కొంది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.