India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీ రాజేంద్రనగర్లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా మంచిర్యాల జిల్లాకు చెందిన తానియాసోని (25) మృతిచెందింది. ఆమె తండ్రి శ్రీరాంపూర్-1 భూగర్భ గని డీజీఎంగా పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియాసోని తండ్రి విజయ్ కుమార్ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. భౌతికకాయం వీలైనంత త్వరగా అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మంచిర్యాల జిల్లా భీమారంలో చోటుచేసుకుంది. మండలంలోని దాంపూర్ గ్రామ పంచాయతీ గోత్రాల వాడకు చెందినమధుకర్ (55) మండలంలోని కాజీపల్లి చెరువు వద్దకు చేపల వేటకోసం వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి చూడగా చెరువులో శవమై కనిపించాడు. కాగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కేటీఆర్ ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ సందర్శించడంపై చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు క్షమించమని కాళేశ్వరంలో పూజలు చేసేందుకు వచ్చినట్లు ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు.

మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో అనుమానాస్పదస్థితిలో ఒక మహిళ దుర్మరణం పాలైనట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. మృతురాలు గోదావరి నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో ముఖం గుర్తుపట్టకుండా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక పాత మంచిర్యాలకు చెందిన ధరణి పద్మ అనే మహిళ ఈనెల 25 నుంచి కనిపించకుండా పోయింది. మృతురాలు పద్మ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

శుక్రవారం మంచిర్యాల ఏసీసీ వద్ద రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గద్దెరాగడికి చెందిన రాజు(30) శుక్రవారం రాత్రి ఏసీసీ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో నస్పూర్కు చెందిన వినయ్కుమార్(27) బైక్తో ఢీకొట్టాడు. ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. వినయ్కుమార్ శనివారం HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదైంది.

ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, అభ్యర్థులకు సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల కొరకు ఉచిత శిక్షణ కోచింగ్ ను టీజీఎస్సీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ద్వారా ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి సునీత కుమారి తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్ సైట్ http://tsstudycircle.co.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

◾బోథ్: ఉదృతంగా ప్రవహిస్తున్న పొచ్చర జలపాతం◾ ఇంద్రవెల్లి: అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య◾ ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టుకు ప్రభుత్వం సహకరించాలి: పాయల్◾ఆదిలాబాద్: పాలిటెక్నిక్ లో చేరేందుకు మరొక అవకాశం◾ తలసరి ఆదాయంలో వెనుకబడిన ఆసిఫాబాద్◾ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికల నిర్వహించాలి: జాజుల◾ ADB వైద్య శాఖలో సీనియర్ అసిస్టెంట్ బదిలీలు◾ కడెం ప్రాజెక్ట్ ఒక గేట్ ఎత్తివేత

సాధారణ బదిలీల్లో భాగంగా వైద్య శాఖలో సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ బి.రవీందర్ నాయక్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఆదిలాబాద్ రిమ్స్, DMHO కార్యాలయం నుంచి PHCలకు, PHCల నుంచి DMHO కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన వారిలో జిల్లా వ్యాప్తంగా 15 మంది సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు.

పాలిటెక్నిక్ డిప్లమాలో ప్రవేశానికి ప్రత్యేక విడత ప్రవేశాలు జరుపుతున్నామని ఆదిలాబాద్ సంజయ్ గాంధి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్/ పాలిసెట్ కోఆర్డినేటర్ వీరస్వామి తెలిపారు. ఈ నెల 26న స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. 27న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని, 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈనెల 31న సీట్లు కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు గమనించాలన్నారు.

తలసరి ఆదాయంలో ఆసిఫాబాద్ జిల్లా వెనుకబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక ముఖచిత్రం 2024లో తలసరి ఆదాయం విషయంలో 32వ స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు మెరుగైన స్థానంలో ఉండగా, కొమురం భీం వెనుకబడి కనిపిస్తోంది. రాష్ట్రంలో తలసరి ఆదాయం విషయంలో మంచిర్యాల 18, నిర్మల్ 21, ఆదిలాబాద్ 22 స్థానాల్లో నిలిచాయి.
Sorry, no posts matched your criteria.