Adilabad

News July 25, 2024

భట్టి బడ్జెట్ కేవలం ఉట్టి బడ్జెట్: పాల్వాయి హరీశ్ బాబు

image

రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఉట్టి బడ్జెట్‌గా ఉందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు. హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతూనే రూ.30వేల కోట్లు రీజనల్ రింగురోడ్డు ఇచ్చిందని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) మంజూరు చేసిందని ప్రసంగంలో తెలపడం విచిత్రంగా ఉందన్నారు.

News July 25, 2024

ఉట్నూర్: ప్రత్యేకత చాటుకున్న ఇప్ప పువ్వు లడ్డు

image

ఉట్నూర్ మండలంలోని అడవుల్లో సమృద్ధిగా లభించే ఇప్ప పువ్వును ఆదివాసీలు వేసవికాలంలో సేకరించి నిలువ ఉంచుతారు. ఇలా నిలువ ఉంచిన ఇప్ప పువ్వుతో CCD స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ITDA సహకారంతో ఆదివాసీ ఆహారం పేరుతో సహజ సిద్ధంగా ఇప్ప పువ్వు లడ్డును తయారు చేసి కిలో రూ. 400 చొప్పున అమ్మకాలు చేపడుతున్నట్లు ఆదివాసీలు తెలిపారు. సహజ సిద్ధంగా ఉన్న లడ్డు రుచి జిల్లాలోనే ప్రత్యేకతను చాటుకుంది.

News July 25, 2024

సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అన్ని రకాల చర్యలు: కలెక్టర్

image

సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో తప్పనిసరిగా డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News July 25, 2024

ఆదిలాబాద్: DEECET ఫలితాలు విడుదల

image

డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (D.ED) కళాశాలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న ఆన్‌లైన్‌లో నిర్వహించిన డీఈఈసెట్‌-2024 పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల కోసం https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ, వెబ్‌ ఆప్షన్ల నమోదు వంటి తేదీలు త్వరలో విడుదల చేస్తామన్నారు.

News July 25, 2024

ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించేనా.?

image

నేడు రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. కుప్టి ప్రాజెక్ట్, చనాఖా-కోర్ట ప్రాజెక్టు ప్రధాన కాలువల నిర్మాణం, జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, రైల్వే వంతెనల నిర్మాణాలకు నిధులివ్వాలని కోరుతున్నారు.

News July 25, 2024

కాసిపేటలో మహిళ దారుణ హత్య

image

మహిళను ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన కాసిపేట మండలంలో చోటుచేసుకుంది. లంబడి తండా గ్రామానికి చెందిన అజ్మీరా నీలా (45) భర్త 15 ఏళ్ల క్రితం మరణిచడంతో గాండ్ల రవి అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. రవి స్నేహితుడు అంబరావు బుధవారం రవి లేని సమయంలో నీలా పై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో గొంతు నులిమి హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. 

News July 25, 2024

ఆదిలాబాద్‌ జిల్లా రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు

image

ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహశీల్దార్‌లు16 మంది, సినియర్. 25 మంది, జూ.అసిస్టెంట్లు 15 మంది, ఆఫీస్ సబార్డినేట్లు 18 మంది ఉన్నారు. వారితో పాటు ఐదుగురు తహశీల్దార్లకు రిలీవింగ్ ఆర్డర్లు జారీ అయ్యాయి.

News July 25, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు RAIN ALERT

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాబోయే రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అలర్ట్ జారీ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారివర్షాలకు ఉమ్మడి జిల్లాలో ఉన్న జలపాతాలు జలసవ్వడి చేస్తున్నాయి. ప్రాజెక్టులు నీరు వచ్చి చేరడంతో కళకళలాడుతున్నాయి.

News July 24, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి CRIME REPORT

image

★ఆసిఫాబాద్: అడ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత 
★ కాగజ్ నగర్: గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ 
★ ఆదిలాబాద్: కాంగ్రెస్ నాయకునిపై ఎస్పీకి జర్నలిస్టుల ఫిర్యాదు 
★ మంచిర్యాల : కిటికీలు ఎత్తుకెళ్లిన దొంగలు అరెస్ట్ 
★ దహేగాం: భారీ వర్షానికి కూలిన ఇల్లు 
★ కుబీర్ : పేకాట ఆడుతున్న 6గురు అరెస్ట్ 
★ తాంసి: తోడేళ్ల దాడి.. ఐదు మేకలు మృతి 
★ భీంపూర్: పశువుల పాకలోకి దూసుకెళ్లిన RTC 

News July 24, 2024

మందమర్రి: సింగరేణి సేవా సమితి ద్వారా మహిళలకు రాత పరీక్షలు

image

మందమర్రి ఏరియాలో సింగరేణి సేవా సమితి ద్వారా 2023-24ఆర్థిక సంవత్సరంలో వృత్తి శిక్షణ కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు రాత పరీక్షలు నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన 187 మంది మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. జీఎం ఏ.మనోహర్, సేవా అధ్యక్షురాలు సవిత మనోహర్ మాట్లాడుతూ.. మహిళలు అవకాశాలను వినియోగించుకుని స్వయం ఉపాధి సంపాదించుకుని కుటుంబాలకు మార్గదర్శకంగా నిలబడాలన్నారు.