India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడెం ప్రాజెక్టు ద్వారా దిగువకు 10 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గడంతో కడెం ప్రాజెక్టులోకి ఆదివారం రాత్రి 10 గంటలకు 6,941 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టులోని రెండు గేట్ల ద్వారా కుడి, ఎడమ కాలువలతో పాటు దిగువ గోదావరిలోకి మొత్తం 10,545 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు తగ్గడంతో కడెం ప్రాజెక్టులోకి వచ్చే వరద నీరు తగ్గింది.

జిల్లాలో గత రెండు రోజులుగా భారీ నుండి అతిభారీ వర్షాల కురుస్తున్న కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదల కారణంగా నష్టాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లాలోని చెరువు కట్టలు కుంటలు తెగిపోకుండ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకుండ చర్యలు తీసుకోవాలన్నారు.

ఉట్నూర్ మండలంలోని పిట్లగూడ గ్రామ సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. కాగా గ్రామానికి చెందిన పిట్ల వెంకటేష్ కూతురు లక్కీ(2)కి జ్వరంతో బాధపడుతుండగా ఆదివారం ప్రమాదకర స్థితిలో వాగుదాటుతూ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగుదాటమని వారు వాపోయారు. వర్షాలు పడ్డ ప్రతిసారి ఇబ్బంది తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నూతన వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు రేపటితో ముగియనున్నట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జులై 22 లోపు ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఫీజు చెల్లించాలని సూచించారు. మీసేవ, TG ఆన్లైన్ సెంటర్లలో ఫీజు చెల్లించవచ్చన్నారు. PG రెండో సంవత్సర పరీక్షలు ఆగస్టు 20 నుంచి, PG మొదటి సంవత్సరం పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఇన్స్పైర్ అవార్డుల నామినేషన్ ప్రక్రియ కొరకు విద్యార్థులు నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు నామినేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ DEO ప్రణీత పేర్కొన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు ఐడియా కాంపిటీషన్ నిర్వహించాలని, ఐడియా బాక్సులు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎంపికైన ఆలోచనలకు రూ.10వేలు విద్యార్ధుల వ్యక్తిగత ఖాతాలో జమ చేయబడుతుందని తెలిపారు.

సొంత ఇంటిలోనే దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మహదేవపురం కాలనీలో నివాసముండే ఓ మహిళ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోంది. ఈనెల 19న పాఠశాలకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో 8 తులాల బంగారం, 6 తులాల వెండి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా ఆమె భర్త దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. జిల్లాలోని కలెక్టర్లతో సెక్రటేరియెట్ నుంచి ఫోన్లో మాట్లాడి వరదలపై సమీక్షించారు. గోదావరి సమీప గ్రామాల ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఈనెల 12న ADB రిమ్స్ వైద్యురాలికి తాము ముంబై పోలీసులమని చెబుతూ ఫోన్ వచ్చింది. ‘మీ ఐడీపై నేరాలు నమోదయ్యాయి’ అని చెప్పడంతో భయంతో వారి మాటలు నమ్మిన ఆమె రూ.3.40 లక్షలు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆ నంబర్కు ఆమె ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రూ.లక్ష హోల్డ్ చేయగా శనివారం మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

◆ ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వాన
◆ లోకేశ్వరం: పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
◆ MNCL: రైలుకింద పడి యువకుడు మృతి
◆ భీమిని : మద్యం మత్తులో తల్లిపై దాడి
◆ బెల్లంపల్లి : గుండెపోటుతో ప్రభుత్వ పిఈటి మృతి
◆ కన్నెపల్లి : ఉరేసుకుని వ్యక్తి మృతి
◆ NRML : కడెం ప్రాజెక్టు మూడుగేట్లు ఎత్తివేత
◆ పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు
◆ ఆదిలాబాద్ : పోలీసులమంటూ బురిడీ
◆ మంచిర్యాల: MLAపై అసత్య ప్రచారం.. ముగ్గురు అరెస్ట్

భీమిని మండల కేంద్రంలో రాంటెంకి శ్రీకాంత్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో తల్లి పోషక్కను బ్లేడ్తో చేతిపై గాయపర్చగా, అన్న శంకర్ను ఇనుపరాడ్తో కొట్టి తాను బ్లేడ్తో కోసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రీకాంత్ను ఆసుపత్రికి తరలించే క్రమంలో హోంగార్డు అశోక్ పై దాడి చేసి బ్లేడ్తో గొంతు కోశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.