Adilabad

News May 19, 2024

ఆదిలాబాద్: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2024 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 10వ/8వ తరగతులు ఉత్తీర్ణులై 14 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు జూన్ 10లోగా మొదటి దఫా ప్రవేశాల కోసం https:///iti. telangana. gov. in దరఖాస్తు  చేసుకోవాలని సూచించారు.

News May 19, 2024

మంచిర్యాల: ‘CBSE సిలబస్ ప్రవేశపెట్టాలి’

image

సింగరేణి పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ ప్రవేశపెట్టాలని BMSనాయకులు C&MDబలరాం నాయక్ కు విజ్ఞప్తి చేశారు. యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల వేతనాల నుండి కార్పోరేట్ పాఠశాలలు దోపిడీ చేస్తున్నాయన్నారు. క్రమశిక్షణ కలిగిన సెంటర్ సిలబస్ ద్వారా మంచి నైపుణ్యత సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు.

News May 18, 2024

ADB: టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో..!

image

ADB:టెట్ అభ్యర్థులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. దరఖాస్తుల సమయంలో రుసుము రూ.400 నుంచి 1000 పెంచగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాల కేటాయింపులో సైతం సొంత జిల్లాలో కాకుండా దూరపు ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దరఖాస్తుకు రూ.1000 తీసుకొని దూరపు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News May 18, 2024

ADB ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 9 మంది మృతి

image

ఉమ్మడి ADB జిల్లాలో వివిధ కారణాలతో శుక్రవారం 9 మంది మృతిచెందారు.
ADBలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి. మావల, కుంటాలలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి. ఇంద్రవెల్లిలో కడుపు నొప్పి భరించలేక యువతి సూసైడ్. వాంకిడిలో ఇష్టంలేని పెళ్లి చేశారని నవవరుడు సూసైడ్. ఆసిఫాబాద్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ఖానాపూర్‌లో బైక్‌తో చెట్టును ఢీకొని వ్యక్తి మృతి. కాసిపేటలో ఐచర్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి.

News May 18, 2024

ఆదిలాబాద్ పార్లమెంట్‌లో ఎవరు గెలిచిన చరిత్రే..!

image

ADB పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈసారి చరిత్రలో నిలిచిపోనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిస్తే ADB స్థానంలో MP అయినా మొదటి మహిళగా, పోటీచేసిన మొదటిసారే గెలిచిన నేతగా చరిత్ర సృష్టిస్తారు. 20 ఏళ్ల నుంచి అక్కడ ఏ పార్టీకి వరుసగా రెండోసారి గెలవలేదు. BJP అభ్యర్థి నగేశ్ గెలిస్తే ఆ రికార్డు బ్రేక్ అవుతుంది. BRS అభ్యర్థి గెలిస్తే 2 సార్లు MLAగా గెలిచి MP అయిన వ్యక్తిగా ఆత్రం సక్కు నిలుస్తారు.

News May 18, 2024

ఆసిఫాబాద్: ‘ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య’

image

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఈ ఘటన ASFలోని రహాపెల్లిలో జరిగింది. చునార్కర్ రవీందర్(38), కళావతి భార్యభర్తలు. కళావతి అదే గ్రామానికి చెందిన అక్కపెల్లి రవీందర్‌తో తరచూ ఫోన్ మాట్లాతుందన్న అనుమానంతో భార్యభర్తల మధ్య గొడవ జరుగుతుండేది. గురువారం ప్రియుడితో కలిసి భర్తను ఇంట్లో ఉరేసి చంపేసిందన్న అనుమానంతో రవీందర్ అన్న ఆనందరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై SI రాజేశ్వర్ కేసు నమోదు చేశారు.

News May 18, 2024

ASF: పీఎం రాష్ట్రీయ బాలపురస్కార్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం తరఫున అందిస్తున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరానికి ఇచ్చే పురస్కారాలకు 6-18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులన్నారు. పలు రంగాల్లో ప్రతిభ చూపిన బాలలు జులై 31లోపు http //awards.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 17, 2024

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎంపీ అభ్యర్థి నగేశ్

image

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి నగేశ్ శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్లమెంటు పోలింగ్ సరళి, తదితర అంశాలను ఆయనతో చర్చించారు. అదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మనం గెలవబోతున్నామని, అందుకు గాను ముందస్తు అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు పార్లమెంట్ కో ఇన్‌ఛార్జ్ అశోక్ ముస్తాపురే, జిల్లా బీజేపీ నాయకులు, తదితరులున్నారు.

News May 17, 2024

నిర్మల్: రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు

image

హైదరాబాద్‌లోని శ్రీ నీలకంఠ విద్యాపీఠంలో ఈ నెల 16, 17తేదీల్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్రస్థాయి అభ్యాస వర్గలో జిల్లాకు చెందిన పలువురు సంఘ బాధ్యులు పాల్గొన్నారు. సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర, విద్య ఆధారంగా జాతి నిర్మాణం, దేశభక్తి, నూతన జాతీయ విద్యావిధానం, ఆదర్శ ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వంటి పలు అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తపస్ నాయకులు తెలిపారు.

News May 17, 2024

ఆదిలాబాద్: సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుకు సాంకేతిక సమస్య

image

సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించగా రెండు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఆన్లైన్ సేవలు ముందుకు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.