India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేరడిగొండ మండలం రాజురా పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు యూనిఫామ్లు అందజేసి చాక్లెట్లను పంచారు. విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని సూచించారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకొని ఈరోజు ఎమ్మెల్యేగా ఎదిగినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవన పనులను పరిశీలించారు.
మంచిర్యాల పట్టణం NTRనగర్కు చెందిన రవికుమార్(28) ఆత్మహత్య చేసుకున్నట్లు SI ప్రశాంత్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రవికుమార్ కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కూలి డబ్బులు సరిపోక అప్పులు చేశాడు. అప్పు చెల్లించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
ఓపెన్ స్కూల్ దూర విద్య పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షకు 746 మంది హాజరుకాగా 313 మంది ఉత్తీర్ణులై 41.96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్లో 443 మందికి 243 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్లో 56.12 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఓపెన్ స్కూల్ సమన్వయ కర్త అశోక్ వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా బంజారా సేవ సంఘ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గురువారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం పార్లమెంట్ ఎంపీ కింజరాపు రామ్ మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. కేంద్రంలో మంత్రి పదవి దక్కడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు * బెల్లంపల్లిలో కర్రల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా * శ్రీరాంపూర్ గనిలో కార్మికునికి గాయాలు *తానూర్లో పిడుగు పడి వ్యక్తి మృతి *మంచిర్యాలలో ప్రహరీ గోడ కూలి ముగ్గురు మృతి *భైంసాలోని ఏకముఖి ఆలయంలో చోరీ *సిర్పూర్లో అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత *భైంసాలో 2BHK ఇళ్ల కోసం మహిళల రాస్తారోకో *ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం
గాదిగూడలోని ధర్మగూడ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూలిపోయింది. ఎమ్మెల్యే, అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడంలో లేదని గ్రామస్థులు వాపోయారు. పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు లేక CRT ఉపాధ్యాయులచే చెట్టు కిందనే విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల నిర్మించాలని కోరారు.
గాదిగూడలోని ధర్మగూడ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూలిపోయింది. ఎమ్మెల్యే, అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడంలో లేదని గ్రామస్థులు వాపోయారు. పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు లేక CRT ఉపాధ్యాయులచే చెట్టు కిందనే విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల నిర్మించాలని కోరారు.
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతిచెందినవారిలో ఇద్దరిని శంకర్, హనుమంతుగా గుర్తించారు. కాగా మరో కూలీ పోషన్న శిథిలాల కింద చిక్కుకున్నాడు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. వివరాలకు వెళ్తే గురువారం ఉదయం పట్టణంలోని ఖుర్షీద్ నగర్ ప్రధాన రహదారి పక్కన ఒక మహిళ మృతదేహం అనుమానాస్పదంగా కనిపించింది. సమాచారం తెలుసుకున్న DSP జీవన్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక రిమ్స్ మార్చురీకి తరలించారు. మహిళ ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధి గొల్లపల్లి శివారులోని అతి పురాతన కాలంనాటి మాడుగు మల్లన్న స్థల ప్రాంతంలో గుప్త నిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. నాలుగు రోజుల క్రితం అర్థరాత్రి దాటిన తర్వాత కొంతమంది ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కాగా ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.