Adilabad

News May 16, 2024

మంచిర్యాల: రోజుకు రూ. 2 కోట్ల మద్యం విక్రయం

image

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మందుబాబులు ఈ వేసవిలో ఎక్కువగా తాగేస్తున్నారు. నిత్యం రూ. 2 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. జిల్లాలో 73 మద్యం దుకాణాలు, 16 బార్లు ఉన్నాయి. ప్రతిరోజు సగటున రూ. 2 కోట్లకుపైగా జిల్లాలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ ఏడాది కేవలం ఫిబ్రవరి మార్చి, ఏప్రిల్, మే 15 వరకు రూ. 208.77 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. అంటే సుమారు నెలకు రూ. 60కోట్ల మద్యం విక్రయాలు జరగుతున్నాయి.

News May 16, 2024

కన్నెపల్లి: ఆత్మహత్యకు కారకులైన వారికి జైలు శిక్ష

image

వ్యక్తి ఆత్మహత్యకు కారకులైన ఇద్దరు నింధితులకు MNCL జిల్లా జడ్జి జైలు శిక్ష విధించినట్లు SI గంగారాం తెలిపారు. కన్నెపల్లికి చెందిన వెంకన్న 2019లో ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారకులైన లక్ష్మికి 5 ఏళ్లు, రాజుకు 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. వెంకన్న భార్య లక్ష్మి.. రాజుతో అక్రమ సంబంధం పెట్టుకొని అతడితో వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చేందిన వెంకన్న సూసైడ్ చేసుకున్నాడు.

News May 16, 2024

ASF: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు 

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులకు రూ.1000 అపరాధ రుసుముతో 16వ తారీకు వరకు గడువు పెంచినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

News May 15, 2024

హాజీపూర్: హత్యకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

image

హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి మల్యాల నరేశ్‌ను హత్య చేసిన చైతన్యను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతుడు నరేశ్, నిందితుడు చైతన్య చెల్లెలిని లైంగికంగా వేధిస్తుండటంతో కక్ష పెంచుకొని బండరాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

News May 15, 2024

నిర్మల్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన పోలింగ్

image

2019 ఎంపీ ఎలక్షన్‌తో పోల్చితే 2024లో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ 15.71 శాతం పెరిగింది. 2019లో 55.97 శాతం నమోదవగా 2024లో 71.68 శాతం ఓటింగ్ పోలైంది. కాగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల వారీగా పెరిగిన పోలింగ్ పరిశీలిస్తే.. నిర్మల్ ముందుండగా సిర్పూర్ అసెంబ్లీ స్థానం 2.01 శాతంతో చివరిలో ఉంది. ఈ మేరకు గెలుపుపై అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు.

News May 15, 2024

మంచిర్యాల: ప్రాణం తీసిన అక్రమ సంబంధం

image

మంగళవారం రాత్రి ఓ యువకుడిని <<13250620>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన మల్యాల నరేశ్ ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై పలు సందర్భాల్లో పంచాయతీలు కూడా అయ్యాయి. అయినా మళ్లీ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో యువతి సోదరుడు మంగళవారం రాత్రి నరేశ్‌ను ఆటోతో గుద్ది, బండతో మోదీ చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 15, 2024

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో పేషంట్ కేర్ ఆత్మహత్యాయత్నం

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో పేషంట్ కేర్‌గా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బుధవారం రిమ్స్‌లోనే ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన సిబ్బంది స్పందించి ఎంఐసీయూ వార్డ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సూపర్‌వైజర్‌ బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 15, 2024

మంచిర్యాల: హాజీపూర్‌లో ఒకరి దారుణ హత్య

image

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గల కారణాలు తెలియ రాలేదు. ఈ మేరకు హాజీపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

News May 15, 2024

ఆదిలాబాద్‌: 12,21,563 మంది ఓటేశారు!

image

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో 16,50,175 మంది ఓటర్లు ఉండగా.. 12,21,563 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఇక్కడ 74.03 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 71.42 శాతంతో పోల్చుకుంటే దాదాపు రెండున్నరశాతం అధికమే. ఓటు వినియోగంలో పట్టణ ఓటర్ల కన్నా గ్రామీణ ఓటర్లలోనే చైతన్యం ఎక్కువ ఉంది. మరి మీరు ఓటేశారా? కామెంట్.

News May 15, 2024

REWIND-2019: ఆదిలాబాద్‌లో BJPకి 58,560 ఓట్ల మెజార్టీ!

image

ఆదిలాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. నగేశ్ (BRS)పై సోయం బాబూ రావు(BJP)58,560 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. రమేశ్ రాథోడ్ (కాంగ్రెస్) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో సుగుణకుమారి చెలిమలి(కాంగ్రెస్), గోదం నగేశ్(BJP), ఆత్రం సక్కు (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?