India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ప్రచార రథం శుక్రవారం బోల్తాపడి తలకిందులు అయింది. బోథ్ మండలంలోని నాగపూర్ గ్రామానికి ప్రచార నిమిత్తం వెళ్లిన వాహనం గ్రామ సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బోల్తా పడి తలకిందులు అయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పాత్రికేయులకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కల్పించిన ఓటింగ్ సదుపాయం నేటితో ముగియనుందని అధికారులు తెలిపారు. ఈనెల 3నుంచి 8వరకు అవకాశం ఇవ్వగా మరో 2 రోజులు పోస్టల్ బ్యాలెట్ గడువును పొడిగించారు. రెండు రోజులు గడువు పొడిగించడంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మంచిర్యాలలోని హమాలివాడకు చెందిన ఊరుగొండ సాయికుమార్ అనే సింగరేణి కార్మికుడు గురువారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 20న ఉద్యోగంలో చేరిన సాయికుమార్ గనిలో దిగాలంటే భయంగా ఉందని, ఉద్యోగం చేయలేనంటూనే వాడు. ఈ క్రమంలో గురువారం డ్యూటీకి వెళ్లిన సాయికుమార్ రైలు పట్టాలపై శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
సెల్ఫోన్కి బానిసైన 9వ తరగతి విద్యార్థి (17) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్(M) బోరిగాంలో చోటుచేసుకుంది. SI వివరాల ప్రకారం..రాకేశ్కి అతడి తండ్రి కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం ఫోన్ కొనిచ్చాడు. అప్పటి నుంచి బాలుడు గేమ్లు ఆడుతూ ఫోన్కి బానిసయ్యాడు. దీంతో తండ్రి ఫోన్ అతిగా వాడోద్దని మందలించి ఫోన్ తీసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఇంట్లో ఉరేసుకున్నాడు.
మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిలాబాద్ పట్టణం రాంనగర్లో రాపర్తి ప్రకాష్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏఎస్ఐ యూనుస్ తెలిపిన వివరాల మేరకు.. కూలి పని చేసుకుని జీవించే ప్రకాష్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ సమస్య తట్టుకోలేక జీవితంపై విరక్తితో గురువారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఉపాధి హామీ పనులకు వెళ్లి వడ దెబ్బకు గురైన కూలి మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. బోసి గ్రామానికి చెందిన పర్వార్ విఠ్ఠల్ (60) బుధవారం కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి తిరిగి రాగా.. అస్వస్థతకు గురై పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వడ దెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారించారు.
సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడటంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టిసారించాయి. ADB, PDPL లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, BRS, BJP మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయి సమావేశాలు, బహిరంగ సభలు, కూడలి సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం మూడు రోజులు ఉండడంతో అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నలుగురు బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్లు ఖానాపూర్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఖానాపూర్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పర్యటన సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఇచ్చిన సమయాన్ని ఉల్లంఘించారన్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకం మహేందర్ లపై కేసు నమోదు చేశామని ఖానాపూర్ ఎస్సై లింబాద్రి వెల్లడించారు.
ADB MP స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలతో పొలిస్తే BJPలో ప్రస్తుతం ఉత్సహం కనిపించడం లేదు. SKZRకు అమిత్ షా, ఖానాపూర్కు రాజాసింగ్ తప్పితే రాష్ట్ర, జాతీయ నేతలెవరూ రాలేదు. గ్రూపు విభేదాలకు నిలయమైన కాంగ్రెస్లో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. రేవంత్రెడ్డి, రాహుల్గాంధీ వచ్చినా మార్పు కనిపించటంలేదు. ప్రస్తుతం BRS డీలాపడింది. నేతలు పార్టీ మారటం ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూడు చోట్ల నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై పోలీసులు బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని మూడు కాలనీల్లో ఆకస్మికంగా దాడులు చేశారు. అక్కడ వ్యభిచారం చేస్తున్న ఆరుగురు యువతులను, ఎనిమిది మంది విటులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. వారిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.