India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో ఆదిలాబాద్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి ఆత్రం సక్కు, కాంగ్రెస్ నుంచి సుగుణ, BJP నుంచి గోడం నగేశ్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం మే 24న పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. కాగా ఆ పరీక్షకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,059 విద్యార్థులు ఉండగా బాలురు 531, బాలికలు 408, మొత్తం 939 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, ర్యాంకు ఆధారంగా వివిధ పాలిటెక్నిక్ కళాశాలలు, కోర్సులలో అడ్మిషన్స్ జరుగుతాయి.
పెద్దపల్లి లోక్సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజుల ఉత్కంఠకు రేపటితో తెర పడనుంది. సెంటీనరీ కాలనీలోని JNTUH ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ప్రతి శాసన సభ నియోజకవర్గానికి 14 టేబుళ్ల చోప్పున ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లి లోక్సభ పరిధిలో మొత్తం 15,96,430 మంది ఓటర్లు ఉండగా, 10,83,453 ఓట్లు పోలయ్యాయి.
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఆదిలాబాద్ ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
భీమిని మండలం లోని పెద్దపేట గ్రామంలో ఓ రైతు పెంచుకుంటున్న మేక ఏకంగా 5 పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పటి వరకు 1 లేదా 2 జన్మనిచ్చిన మేకలను చూసుంటాం. కానీ ఇది ఏకంగా 5 పిల్లలను జన్మనివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. 5 మేక పిల్లలకు జన్మ ఇవ్వడంతో చుట్టూ పక్కల ప్రాంతాలవారు మేకలను చూడటానికి క్యూ కట్టారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 3 నుంచి నిర్వహించాల్సిన బడి బాట వాయిదా పడింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గమనించగలరని కోరారు.
ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామం వాగుపై రాకపోకలు కొనసాగించేందుకు గుండి గ్రామస్థులు తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు .గుండి తాత్కాలిక వంతెన ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీనితో గుండి గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా ఆసిఫాబాద్ జిల్లా అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరారు.
వాంకిడి మండలం ఇందాని గ్రామంలో పిడుగుపాటు శబ్దానికి గ్రామానికి విక్రుబాయి ఆదివారం సాయంత్రం తన ఇంటి బయట నిలబడింది. ఆ సమయంలో పెద్ద శబ్దాలతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు ఇంటి పక్కనే పడింది. పిడుగు శబ్దానికి ఆమె భయపడి అక్కడే కింద పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఇంకా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల వల్ల కాజీపేట మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను ఆదివారం నుంచి రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-సిర్పూర్, కాగజ్నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్, సికింద్రాబాద్-విజయవాడ- సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్ప్రెస్ రైళ్లను ఈనెల 2, 5, 6, 8, 9 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరో మూడురోజుల్లో వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయినప్పటి నుంచి పోలీస్ అధికారుల నడుమ 24 గంటలపాటు భద్రత కొనసాగుతోంది. కాగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. అటు ఎంపీ అభ్యర్థుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
Sorry, no posts matched your criteria.