Adilabad

News July 5, 2024

జైపూర్: వన మహోత్సవంలో MP, MLA, IAS

image

జైపూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ హాజరయ్యారు. అనంతరం మొక్కలను నాటారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కను నాటి ప్రకృతికి అండగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 5, 2024

ఆదిలాబాద్: వారికి రేషన్ బియ్యం రాదు

image

బోగస్ ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం ఏరివేస్తోంది. రేషన్ డీలర్లకు లబ్ధిదారుల జాబితా పంపించి పరిశీలన ప్రక్రియ చేపడుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులతో విచారణ చేయించి బోగస్ కార్డులు రద్దు, అనర్హుల పేర్లు తొలగింపునకు చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో 89 కార్డులు రద్దు చేయగా, 664 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు.

News July 5, 2024

రాష్ట్ర గవర్నర్ OSDగా మంచిర్యాల జిల్లా వాసి

image

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ OSDగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సిరిశెట్టి సంకీర్తన్ నియామకం అయ్యారు. ఆయన 2020లో IPS శిక్షణ పూర్తి చేసుకుని ములుగు, మధిర జిల్లాలకు ప్రొబెషనరీ IPSగా పని చేశారు. అనంతరం ఏటూరునాగారం ASPగా పనిచేసిన సంకీర్తన్ ఇటీవల గవర్నర్ OSDగా నియమితులయ్యారు. గవర్నర్ OSDగా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆయన తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News July 5, 2024

భీంపూర్: ఐదు తరగతులు.. ఒకే ఉపాధ్యాయుడు

image

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఐదు తరగతులకు కలిపి మొత్తం 81 మంది విద్యార్థులు ఉండగా.. ఒకే ఒక్క ఉపాధ్యాయుడు పని చేస్తున్నారు. మూడు పోస్టులు ఉండగా, ఏడాది క్రితం ఒకరు అనారోగ్యంతో చనిపోగా.. ఒకరు ఇటీవల పదోన్నతిపై వెళ్లారు. ఇప్పుడున్న టీచర్ సైతం బదిలీ కాగా, రిలీవర్ రాకపోవడంతో అయన ఉండిపోయారు. అందరినీ ఒకచోట కూర్చోబెట్టి బోధిస్తున్నారు.

News July 5, 2024

ఆదిలాబాద్: బదిలీలకు వేళాయె

image

ఐదేళ్ల తర్వాత సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎవరెవరు బదిలీ అవుతారు? ఎక్కడికి వెళ్తారనే చర్చ సామాన్యుల్లో.. అధికార వర్గాల్లో జోరందుకుంది. ఉమ్మడి జిల్లాలో అన్ని శాఖలు కలిపి 63 ఉండగా.. అందులో జిల్లా స్థాయి, జోనల్, మల్టీజోన్, రాష్ట్రస్థాయి కేటగిరిల్లో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

News July 5, 2024

ఆదిలాబాద్: నిందితుడి కోసం వెళ్లి.. నింగిలోకి

image

ఆదిలాబాద్‌కు చెందిన ASI యునాస్ ఖాన్ నిన్న <<13567244>>గుండెపోటుతో <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఓ కేసులో కోర్టుకు హాజరు కాని నిందితుడికి కోసం SI, కానిస్టేబుల్తో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం వెళ్లాల్సి ఉంది. మెహిదీపట్నం నుంచి రూట్ 5కే సెట్విన్ బస్సులో యూనస్ ఖాన్ సికింద్రాబాద్ బయలుదేరాడు. బస్సు బాటా వద్దకు వచ్చేసరికి గుండెపోటుతో సీటులో నుంచి జారి కిందపడ్డాడు.

News July 5, 2024

ఆదిలాబాద్: కాంగ్రెస్‌లో చేరిన MLC దండె విఠల్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా BRS MLC దండె విఠల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆరుగురు MLCలు కాంగ్రెస్‌లో.. చేరగా అందులో విఠల్ ఉన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

News July 5, 2024

@1959లో ఆవిర్భవించిన ఆదిలాబాద్ ZP

image

ఆదిలాబాద్ జిల్లా పరిషత్ 1959లో ఆవిర్భవించింది. ఇప్పటివరకు 22 మంది ఛైర్మన్లుగా సేవలందించారు. పల్సికర్ రంగారావు తొలి ఛైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న ఆదిలాబాద్ జెడ్పికి ఐదుసార్లు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఐదుగురు కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు నిర్వహించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ చివరి ఛైర్ పర్సన్‌గా నిర్మల్‌కు చెందిన శోభారాణి వ్యవహరించారు.

News July 4, 2024

ఆదిలాబాద్: గుండెపోటుతో ఏఎస్సై మృతి

image

ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఏఎస్సై యూనస్ ఖాన్ హైదరాబాద్‌లో గురువారం గుండెపోటుతో మృతి చెందారు. 1989 బ్యాచ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల విధులు నిర్వర్తించారు. ఏఎస్సైగా పదోన్నతి పొంది హైదరాబాద్‌ సీఐడీ విభాగంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. గురువారం విధుల్లో ఉండగా సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌ సమీపంలో గుండెపోటుతో ఆయన మృతి చెందాడు.

News July 4, 2024

కెరమెరి: వాగులో మునిగి మహిళ మృతి

image

కెరమెరి మండలం సుర్దపూర్ గ్రామానికి చెందిన చౌదరి జ్యోతి(24) వాగులో మునిగి మృతి చెందినట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లిన భర్త సురేందర్‌కు భోజనం తీసుకెళ్తూ పెద్దవాగు దాటుతున్న క్రమంలో నీటిలోతు తెలియక జ్యోతి నీటిమునిగి మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలి భర్త  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.