India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బుధవారం మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతిచెందారు. మంచిర్యాల జిల్లాలో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నెన్నెల మండలానికి చెందిన తోట తిరుపతి(36), హాజీపూర్ మండలంలోని ముల్కల్ల గ్రామానికి చెందిన ఐలయ్య(36), తాండూర్ మండలంలోని అబ్బపూర్ గ్రామానికి చెందిన టేకం భీంరావ్(26) వడదెబ్బతో మృతి చెందారు. ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అవసరమైతే తప్ప బయటికి రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తున్న కొద్ది అందరి చూపు ఓట్ల లెక్కింపుపైనే ఉంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ADB జిల్లాలోని DRDA సాంకేతిక శిక్షణ, అభివృద్ధి కేంద్రం(TTDC), నిర్మల్ జిల్లాలోని సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, ASF జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో కౌంటింగ్ జరగనుంది.
ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు అరికట్టుటకు ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో భారీ ఎత్తున దాదాపు 500 కిలోల రూ. 19 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు వెల్లడించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే సమాచారం అందించాలన్నారు. విత్తన షాపుల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ కంప్యూటర్ సెంటర్ను షీ టీం బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా అక్కడ కంప్యూటర్ టైప్ నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు షీటీం విధులు, సైబర్ క్రైమ్ పైన అవగాహన కల్పించారు. ఎవరైనా పోకిరీలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, మాట్లాడిన, ఫొటోలు తీయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడినా సమాచారం అందించాలన్నారు. తమ వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
పెంపుడు శునకానికి పురుడు చేసిన ఘటన నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. మండలానికి చెందిన చంటి గత కొన్ని నెలలుగా ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. అయితే 3 రోజుల క్రితం అది 3 పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో మంగళవారం రకరకాల వంటకాలు చేసి శునకానికి పురుడు వేడుక నిర్వహించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ సందర్శించారు. పలు వార్డుల్లో తిరుగుతూ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. మెటర్నిటీ వార్డ్ను సందర్శించి గర్భిణులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆదివాసీ, గిరిజనుల ఆరోగ్య సేవల కోసం ఏర్పాటు చేసిన వార్డును సందర్శించి గిరిజనులకు అందిస్తున్న సేవలపై వైద్యులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఆదిలాబాద్లోని మహాలక్ష్మివాడకు చెందిన మహమూద్-అఫ్సాన దంపతుల మధ్య గతేడాది నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే గతేడాది అఫ్సాన పోలీసు స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసి పుట్టింట్లోనే ఉంటోంది. సోమవారం మహమూద్ అత్తారింటికి వెళ్లి కాపురానికి రావాలని భార్యను కోరాడు. ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై బండరాయితో కడుపులో కొట్టాడు. దీంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు.
బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆయనకు జిల్లా బీసీ సంఘం నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు హన్మండ్లు యాదవ్,
నారాయణ, దేవేందర్, రవికాంత్ యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామానికి చెందిన అంజన్న(29)అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. మృతుడు కూలి పని చేసుకునేవాడన్నారు. సంవత్సర కాలంగా కడుపునొప్పి, సైనస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ ఉండేవాడు. ఆసుపత్రులలో చూపించి మందులు వాడినా వ్యాధి నయం కాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని తెలిపారు.
మరో వారంరోజుల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థుల భవిష్యత్తు ఏంటో తేలిపోనుంది. బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందుతారని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు సైతం తమ అభ్యర్థి గెలుస్తాడనే ధీమాతో ఉన్నారు. కాగా ప్రధాన పార్టీల నుంచి గోడం నగేష్, ఆత్రం సుగుణ, ఆత్రం సక్కు ఎన్నికల బరిలో నిలిచారు.
Sorry, no posts matched your criteria.