India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఏంల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పోస్టల్, ఈవీఎం ఓట్ల లెక్కింపుకు వేరువేరుగా టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా మొత్తం పూర్తి స్థాయి ఫలితాల వెల్లడికి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం పడుతుందని పేర్కొన్నారు..
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కర్బలా గ్రామానికి చెందిన సాయినాథ్ (35) వ్యవసాయ భూమిలో భూమిని చదను చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి డ్రైవర్ పై పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికుల తెలిపారు. భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకంలో జనరల్ వర్క్, సూపర్ వైజర్, వెల్డింగ్, ఎలక్ట్రిషియన్, పైపు ఫిట్టర్, ప్లంబింగ్, పెయింటింగ్ అండ్ డెకరేషన్ కోర్సుల్లో 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అన్నయ్య మందలించాడని చెల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పల్ నవేగాం గ్రామానికి చెందిన గుమ్మూల సుష్మా పదో తరగతి పూర్తి చేసి ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది. అన్నయ్య అరుణ్.. తన చెల్లెలిని ‘ఇంట్లోనే ఖాళీగా ఉంటావు ఏదైనా పని చేసుకోవచ్చు’ అని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన సుష్మా పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మూగజీవుల సేవా సంఘం జిల్లా నాయకులను డిమాండ్ చేశారు. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో బంజరు దొడ్డిలో ఆవులను బందీగా ఉన్నాయని తెలుసుకొని ఆవులను విముక్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు కటకం నాగరాజు మాట్లాడుతూ.. గోవులలో ముక్కోటి దేవతలు ఉంటాయని భారతీయులు పూజిస్తున్న గోమాతకు ఇంతటి దుస్థితి రావడం చాలా బాధాకరమన్నారు.
రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాలో సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని రోజుల పాటు వర్షాలు పడినప్పటికీ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గడంలేదు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బెల్లంపల్లిలో 45.7 హజీపూర్లో 44.9 డిగ్రీలు, అసిఫాబాద్లో 44.9, తిర్యాణిలో 44.9, మంచిర్యాల కొండాపూర్ 44.8, కౌటాల 44.7, వాంకిడిలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నిర్మల్ జిల్లాలోని బాసరలో IIIT కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రెటేడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఇమెయిల్ ద్వారా admissions @rgukt.ac.inని సందర్శించండి.
మామడ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం ఒకరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్హెచ్ 61పై దిమ్మదుర్తి గ్రామం నుంచి వస్తున్న బొలెరో, నిర్మల్ వైపు నుంచి వస్తున్న బైక్ ఢీకొనగా బైక్పై ఉన్న ప్రవీన్ అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ వెనుక కూర్చున్న శేఖర్కు గాయాలు కాగా నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్న వాటిని విద్యుత్ సిబ్బందికి తెలియజేసేందుకు విద్యుత్ శాఖ ఒక సెల్ నంబర్ను అందుబాటు లోకి తెచ్చిందని ఆ శాఖ SE జె.ఆర్ చౌహాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్న జిల్లా వ్యాప్తంగా ఒక స్పెషల్ కంట్రోల్ రూమ్ ను సర్కిల్ ఆఫీస్ లో ఏర్పాటు చేశారు. అందులో 9440811700 అనే నంబర్ కు కాల్ చేస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల వ్యవసాయ అధికారి సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రూ.38,000 డబ్బులు తీసుకుంటుండగా వ్యవసాయ అధికారి వంశీ క్రిష్ణను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు వ్యవసాయ అధికారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ దాడులకు సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.