India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మంచిర్యాల జిల్లాలో జులై నుంచి ఆగస్టు వరకు గడిచిన 40 రోజుల్లో 25 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అలెర్ట్ చేస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటూ ఇటీవల పలు వార్డుల్లో, గ్రామాల్లో అవగాహన ర్యాలీలు అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. దోమల నివారణకు చర్యలు కూడా తీసుకుంటున్నారు.

మహారాష్ట్ర పర్యటనకు వెళ్తున్న మంత్రి సీతక్క ఆదివారం రాత్రి ఉట్నూర్ మండల కేంద్రంలో కాసేపు ఆగారు. ఈసందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ నాయకురాలు అత్రం సుగుణ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఉట్నూర్, జైనూర్ మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని నియమించాలని సుగుణ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఉట్నూరు మండల కేంద్రానికి చెందిన జాదవ్ ముకుందరావు కౌసల్య దంపతుల కుమారుడు దిలీప్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. 2016లో పోటీ పరీక్షలు రాసిన దిలీప్ ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్, ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించాడు. ప్రస్తుతం ఫైర్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూనే తాజాగా టీఎస్ఏన్పీడీసీఎల్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్గా ఎంపికయ్యారు.

మండలంలోని చాక్పల్లికి చెందిన షేక్ హైమద్(35) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. షేక్ హైమద్ కూలీ పనులు చేసుకుంటూ భార్యను పోషించుకునేవాడు. అయితే ఇంట్లో నుంచి కుళ్లిన వాసన రావడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించాడు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 12 నుంచి సెమిస్టర్ I ప్రాక్టికల్ తరగతులు ప్రారంభం కానున్నట్లు సైన్స్ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జగ్రామ్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులందరూ హాజరుకావాలని, వచ్చేటప్పుడు తమ ఐడెంటిటీ కార్డును తీసుకొనిరావాలని సూచించారు. విద్యార్థులకు తప్పనిసరిగా 70% హాజరు ఉండాలన్నారు.

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని డైస్ సెంటర్లో చిన్నారులకు ఈ నెల 13న ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ తెలిపారు. ఆర్బీఎస్కేలో 18 లోపు వయస్సు గల పిల్లలకు గుండె సంబంధిత సమస్యలకు పరీక్షలు చేయనున్నారు. సికింద్రాబాద్ కిమ్స్లోని పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు బాధిత చిన్నారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందజేస్తారని పేర్కొన్నారు.

గోదావరిఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే. వన్ టౌన్ CI ఇంద్రసేనా రెడ్డి వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్కు చెందిన రామ్ గాట్, సత్యేంద్ర మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్లో పని చేస్తున్నారు. పని ముగించుకుని గోదావరిఖని మీదుగా యైటింక్లైన్ కాలనీకి బైకుపై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేటలో ప్రబలిన విషజ్వరాలు. గుండాయిపేటలో విషజ్వరాలతో ఒక రోజు వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషజ్వరాలు ప్రబలిన అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్థుల ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

రెండు రోజులుగా కెరమెరి మండలంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పులి జాడ కనిపించలేదని ఎఫ్ఆర్ఓ మాజారోద్దీన్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో కరంజివాడ అడవుల్లో వాగులు, వంకలు, గుట్టల్లో జల్లడ పట్టినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని, అరుపులు, పశు కాళేబరాలు కనిపించలేదని పేర్కొన్నారు. పులి మహారాష్ట్రకు చెందిందని, ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకోవడానికి అనువైన స్థలం లేక తిరిగి అడవుల్లోకి వెళ్లి ఉంటుందని తెలిపారు.

తాను మరణిస్తూ ఏడుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఉద్యోగి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీకాంత్(35) 6న బైకుపై వెళ్తుండగా మంచిర్యాల వద్ద ట్రాక్టర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడటంతో ఎల్బీనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించగా 3 రోజుల తర్వాత చికిత్సకు స్పందించకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. విషయం తెలుసుకున్న జీవన్ ధాన్ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు అవయవ దానంపై అవగాహన కల్పించగా దానం చేశారు.
Sorry, no posts matched your criteria.