Adilabad

News May 27, 2024

ADB: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారు పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. https://padmawards.gov.inలో జూన్ 3 లోపు సంబంధిత వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు.

News May 27, 2024

ASF: విధి చిన్నచూపు.. అనాథలైన చిన్నారులు

image

విధి చిన్నచూపు చూసి ముగ్గురు చిన్నారులను అనాథులుగా మిగిల్చిన విషాద ఘటనిది. ASF(జి) కౌటాల(మం) పార్డికి చెందిన దివాకర్‌(36)కు, దహేగాంకు చెందిన భారతితో 2010లో పెళ్లైంది. వీరికి అజిత్‌, విజయ్‌ సంతానం. అనారోగ్యంతో 2013లో భారతి చనిపోగా.. దివాకర్ మరో పెళ్లి చేసుకున్నాడు. 2 నెలల కింద మగ శిశువుకు జన్మనిచ్చిన రెండో భార్య 5రోజులకే కన్నుమూసింది. ఈనెల 25న దివాకర్ సైతం అనారోగ్యంతో చనిపోగా పిల్లలు అనాథలయ్యారు.

News May 27, 2024

ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో 45.8 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లాలో 44.9, ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి టీ గ్రామంలో 45.2, నిర్మల్ జిల్లాలోని ముజ్గి గ్రామంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News May 26, 2024

ఆదిలాబాద్: ఈనెల 28 నుంచి డిగ్రీ పరీక్షలు 

image

అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 28 నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జిల్లా కేంద్రంలోని సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉంటాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన హల్‌టికెట్లు ఈ https://www.braouonline.in/ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయని సకాలంలో పరీక్షకు హాజరు కావాలని సూచించారు.

News May 26, 2024

ఆదిలాబాద్: ప్రశాంతంగా JEE అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్ష వాతావరణంలో ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి 5.30 వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. కాగా ఉదయం జరిగిన పరీక్షకు 96 మంది విద్యార్థులు ఉండగా 95 మంది విద్యార్థులు హాజరై ఒకరు గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 96మంది విద్యార్థులు ఉండగా ఒకరు గైర్హాజరయ్యారు.

News May 26, 2024

జన్నారం: కారు ఢీకొని ఉపాధి హామీ కూలీ మృతి

image

జన్నారం మండలంలోని రోటిగూడకు చెందిన కందుల లచ్చన్న అనే ఉపాధి హామీ కూలీ కారు ఢీకొని మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కందుల లచ్చన్న శనివారం ఉపాధి హామీ పనిని ముగించుకొని వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కారు ఢీకొందన్నారు. ఈ ప్రమాదంలో లచ్చన్నకు గాయాలు కాగా కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట, కరీంనగర్ అటు నుంచి హైదరాబాద్ నిమ్స్ తరలించగా అక్కడ మృతి చెందారన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News May 26, 2024

నిప్పుల కొలిమిలా నిర్మల్..రాష్ట్రంలోనే అత్యధికం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొట్టడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని అత్యధికంగా నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో రికార్డు స్థాయిలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిర్మల్‌లోని ముజిగిలో 45.2, నిర్మల్ జిల్లా కడెంలో 44.6, నిర్మల్ జిల్లా తానుర్‌లో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని చాప్రలలో  44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 26, 2024

ఆదిలాబాద్: ఈ ఏడాది తగ్గిన రిజిస్ట్రేషన్‌లు..!

image

ఆదిలాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భారీగా తగ్గాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంతగా లేకపోవడంతో భూములు, ప్లాట్లు, ఇళ్ల క్రయ విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తోంది. జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌ రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 1,342 రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దీంతో ఆ శాఖకు సుమారు రూ.7.3కోట్ల ఆదాయం తగ్గింది.

News May 26, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొన్నటి వరకు చిరుజల్లులతో వాతావరణం చల్లబడగా మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధికంగా శనివారం నిర్మల్ జిల్లాలో 45.6 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌లో 44.7, మంచిర్యాలలో 44.6, ఆసిఫాబాద్‌లో 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

News May 26, 2024

నిర్మల్: త్వరలో IIIT నోటిఫికేషన్: VC

image

నిర్మల్ జిల్లాలోని బాసర RGUKTలో ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉపకులపతి వెంకటరమణ తెలిపారు. ప్రభుత్వంతో ఈ నోటిఫికేషన్ గురించి చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. అనుమతి రాగానే త్వరలో PUC మొదటి సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు.