India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్తో కలిసి జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు.
మొత్తం 23 మంది అభ్యర్థులు 42 నామినేషన్లు దాఖలు చేయగా వివిధ కారణాలతో 10 నామినేషన్లు తిరస్కరించినట్టు వెల్లడించారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వల్ప అనారోగ్యానికి గురైనందున పార్టీ ప్రచార కార్యక్రమంలో వచ్చే 2 రోజులు పాల్గొనరని PRO అక్షయ్ ప్రకటనలో తెలియజేశారు. ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురైన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.
గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి ఆయన గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు జిల్లాలో పకడ్బందిగా చర్యలు చేపట్టాలన్నారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వల్ప అనారోగ్యానికి గురైనందున పార్టీ ప్రచార కార్యక్రమంలో వచ్చే 2 రోజులు పాల్గొనరని PRO అక్షయ్ ప్రకటనలో తెలియజేశారు. ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురైన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రజలకు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న స్వామి దేవాలయంలోని దొనలో రెండు రోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొనలోని శివలింగాన్ని వదిలిపెట్టి పక్కన తవ్వకాలు చేపట్టారని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఎస్సై శ్రీధర్ ను వివరణ కోరగా ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ఫిర్యాదు అందిందని, విచారణ జరిపి తవ్వకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం9 నుంచి 12 వరకు జరగనున్నాయి.
SHARE
జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ శివారులోని మూలమలుపు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మద్దులపల్లి గ్రామానికి చెందిన సోల్లూరి అజయ్ ద్విచక్ర వాహనంపై ఇందారంకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి పోచం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఆదిలాబాద్ లోక్సభకు 23 మంది అభ్యర్థులు 42 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. BJP, కాంగ్రెస్, BRS అభ్యర్థులు గోడం నగేశ్, ఆత్రం సుగుణ, ఆత్రంసక్కుతో పాటు స్వతంత్రులు నామినేషన్ వేశారు. పెద్దపల్లి స్థానానికి 63 మంది 109 నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు చివరి తేదీ.
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. రైతు జైవంత్రావు, హలిమాబాయిల కుమార్తె దేశస్థాయిలో 67వ ర్యాంకు సాధించడంతో స్థానికులు ఆమెను అభినందించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ గ్రీన్సిటీకి చెందిన విద్యార్థి రామగిరి కార్తిక్ ఓబీసీ విభాగంలో తొలి ప్రయత్నంలోనే1,997 ర్యాంకుతో సత్తాచాటాడు.
Sorry, no posts matched your criteria.