Adilabad

News April 22, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు YELLOW ALERT

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం నుంచి నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

News April 22, 2024

ASF: పురుగుమందు తాగి బలవన్మరణం

image

దహెగాం మండలం పెసరుంట గ్రామానికి చెందిన జుమిడె కిరణ్ (27) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కందూరి రాజు తెలిపారు. కిరణ్ కడుపునొప్పితో కొంత కాలంగా బాధపడుతున్నాడు. ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా నయం కాలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం సమీప వాగుకు వెళ్లి పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందారు.

News April 22, 2024

నేడు ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్.. షెడ్యూల్ ఇదే

image

BJP సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్, BRS సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీ సీట్లను గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 9.45కు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో ADB బయలుదేరుతారు. 11 గంటలకు డైట్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. అనంతరం అక్కడ ప్రసంగించి మధ్యాహ్నం 12.30కు నిజామాబాద్‌కు పయనం అవుతారు.

News April 22, 2024

మంచిర్యాల: ఆస్పత్రి మరుగుదొడ్డిలో పడి వ్యక్తి మృతి

image

మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 5 రోజులుగా చికిత్స పొందుతున్న యువకుడు మరుగుదొడ్డిలో పడి మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లికి చెందిన క్రాంతి(30) ఈ నెల 15న అనారోగ్య సమస్యలతో ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం బాధితుడి బంధువు ఒకరు వచ్చి బలవంతంగా నిద్రలేపి మరుగుదొడ్డికి తీసుకెళ్లారు. అనంతరం మరుగుదొడ్డిలో పడి మృతి చెందారు.

News April 22, 2024

ADB: సీఎం రేవంత్ రూట్ మ్యాప్

image

ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆయన ఉదయం 9.15గంటలకు HYDలోని ఆయన స్వగృహం నుంచి బయల్దేరి 9.45గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయం11గం. లకు ఆదిలాబాద్‌కి రానున్నారు. అక్కడ సభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 11.30 గంటలకు నిజామాబాద్‌ వెళ్లనున్నారు.

News April 21, 2024

మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫైనల్‌కు నిర్మల్ మహిళ

image

నిర్మల్‌కు చెందిన డాక్టర్ చంద్రిక మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో 50 మంది పాల్గొనగా తెలంగాణ నుంచి చంద్రిక పాల్గొని ఫైనల్స్‌కు అర్హత సాధించారు. మే 28 నుంచి జూన్ 1 వరకు గుర్గావ్, ఢిల్లీలో జరిగే ఫైనల్ పోటీల్లో ఈమె పాల్గొననున్నారు.

News April 21, 2024

దిలావర్పూర్‌లో ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తికి గాయాలు

image

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తికి గాయాలైన ఘటన దిలావర్పూర్ మండలంలో జరిగింది. గుండంపల్లి ఎక్స్ రోడ్డు నుంచి గుండంపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి వరి పొలాల్లోకి వెళ్లి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ ట్రాక్టర్ కింద ఇరుక్కుపోవడంతో తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

News April 21, 2024

గుడిహత్నూర్ మండలంలో భారీ వర్షం

image

గుడిహత్నూర్ మండలంలోని దన్నొరా, మన్నూర్, గుడిహత్నూర్, ముత్నూర్ తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం ఇచ్చోడ మండలంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. ఈ వర్షానికి పంట నాశనమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 21, 2024

ADB: ఏడేళ్ల క్రితం పెళ్లి.. మరోకరితో లవ్.. ఆత్మహత్యాయత్నం

image

ఆదిలాబాద్ గ్రామీణ మండలం పిప్పల్ ధరికి చెందిన భుజంగ్ రావు, బోలేకర్ కవిత పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో కవిత ప్రాణాలు కోల్పోయింది. ఎస్సై ముజాహిద్ వివరాల ప్రకారం.. భుజంగరావుకు ఏడేళ్ల క్రితమే వివాహమైంది. అయితే మరో యువతి కవిత, భుజంగ్ రావు మధ్యే కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. నిన్న ఇద్దరు కలిసి చేనులోకి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇద్దరు పురుగుల మందు తాగారు.

News April 21, 2024

ఇచ్చోడ: డబ్బు కోసం మహిళపై కత్తితో దాడి

image

డబ్బుకోసం మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన ఇచ్చోడలో జరిగింది. SI నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోరిగామకు చెందిన నర్సమ్మ (55)  శుక్రవారం ఉపాధి హామీ డబ్బులను డ్రా చేసుకోని ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన విజయ్, ఇనాజ్ షేక్ అహ్మద్ డబ్బుకోసం ఆమెపై దాడి చేశారు. ఆమె కేకలు వేయడంతో పారిపోయారు. అల్లుడు సునీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

error: Content is protected !!