Adilabad

News April 21, 2024

దేశంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రత్యేక స్థానం

image

దేశంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం 18వ లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా ఈ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక జరిగింది. అలాగే ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరగగా 12 మంది మాత్రమే గెలిచారు. మాధవరెడ్డి, గంగారెడ్డి, నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి రెండేసి సార్లు, వేణుగోపాలాచారి మూడుసార్లు విజయం సాధించారు.

News April 20, 2024

బీ ఫామ్ అందుకున్న ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి

image

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేశ్ బీ ఫామ్ అందుకున్నారు. కార్యక్రమంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, జిల్లా పార్లమెంటరీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, తదితరులు ఉన్నారు.

News April 20, 2024

ఆదిలాబాద్‌లో మూడో రోజు నామినేషన్లు నిల్

image

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మూడో రోజైన శనివారం ఎలాంటి నామినేషన్‌లు దాఖలు కాలేదని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇప్పటివరకు మొత్తం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 22 నుంచి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

News April 20, 2024

ADBలో విషాదం.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

image

ఆదిలాబాద్ మండలంలోని పిప్పల్ దరి గ్రామానికి చెందిన ప్రేమికులు భుజంగరావు, కవిత శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని చికిత్స నిమిత్తం జిల్లా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో కవిత అక్కడికక్కడే మృతి చెందగా, భుజంగరావు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధిత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2024

ఆదిలాబాద్: ఎల్లుండే లాస్ట్… APPLY NOW

image

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటుగా వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ డిప్లమోలలో ప్రవేశంకోసం నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలీసెట్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ భరద్వాజ పేర్కొన్నారు. ఏప్రిల్ 22 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, మే 24 న ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. రూ.100 రుసుముతో APR 24 వరకు ఛాన్స్ ఉందన్నారు

News April 20, 2024

మంచిర్యాల: గడ్డం వంశీకృష్ణ ఆస్తి రూ.24.09 కోట్లు

image

పెద్దపల్లి లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పూర్తి వివరాలతో అఫిడవిట్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. రూ.24.09 కోట్ల ఆస్తులున్నాయని వివరించారు. నగదు, డిపాజిట్ల రూపంలో రూ.93.27 లక్షలు, వివిధ కంపెనీల్లో షేర్ల రూపంలో రూ.11.39 కోట్లు ఉన్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 4.18 ఎకరాలు, సంబల్‌పుర్‌(ఒడిశా)లో 10.09 ఎకరాల భూమి, అప్పులు రూ.17.76 లక్షలు ఉన్నాయని వెల్లడించారు.

News April 20, 2024

MNCL: తెల్లారితే కూతురి పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

image

తెల్లారితే కూతురి పెళ్లి ఉండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందిన విషాద ఘటన మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక ఎంసిసి కాలనీలో నివాసం ఉండే కమలాకర్ రావు శుక్రవారం రాత్రి బైక్ పై వెళుతుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. ఆదివారం కూతురు వివాహం ఉండగా అదే పనుల్లో ఉన్న కమలాకర్ రావు రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 20, 2024

మంచిర్యాల MLA పై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఈ నెల 17న స్థానిక పాత మంచిర్యాలలో నిర్వహించిన శ్రీరామనవమి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దేవాలయం అభివృద్ధికి రూ.లక్ష విరాళంగా అందజేసి, ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చినట్లు ఎన్నికల సంఘం నియమించిన బృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News April 20, 2024

ADB: గల్ఫ్ కార్మికులకు ఏది భరోసా..!

image

ఎడారి దేశాలకు వలస వెళ్లి కార్మికులకు భరోసా కరువైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి పొందాలన్న వారికి అడ్డంకులు తప్పడం లేదు. ఇప్పటివరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండి 70 వేలమంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు. పొట్టకూటి కోసం వెళ్లి అక్కడి వాతావరణం పడక మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారు. దీంతో వారి కుటుంబానికి తీరని శోకం మిగులుతోంది. గల్ఫ్ బాధితులను ఆదుకొని భరోసా కల్పించాలని కోరుతున్నారు.

News April 20, 2024

బైంసాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. SI శ్రీకాంత్ వివరాల ప్రకారం భైంసా మండలం చింతల్బోరి గ్రామశివారులోని పంటపొలాల్లో ఓ గుర్తుతెలియని మృతదేహం స్థానికులకు కనిపించింది. దీంతో వారు సమాచారంతో పోలీసులకు అందించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 55 ఉంటుందని మృతుడికి సంబంధించిన బంధువులు ఉంటే పోలీసులను సంప్రదించాలని ఎస్సై తెలిపారు.

error: Content is protected !!