Adilabad

News April 25, 2024

MNCL: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మృతి

image

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కాజీపేట శ్రీనివాస్ (52) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంచిర్యాల రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై బైక్ పై వస్తున్న శ్రీనివాసును కారు ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని ఎస్సై మహేందర్ తెలిపారు.

News April 25, 2024

నేడు ఇంటర్ ఫలితాలు..ఉమ్మడి ADB నుంచి ఎంత మంది అంటే..

image

నేడు ఇంటర్ ఫలితాలు ఉ.11 గంటలకు వెలువడనున్నాయి. MNCL జిల్లాలో 8394 మంది ఫస్ట్ ఇయర్, 7135 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. ADB జిల్లాలో ఫస్ట్ ఇయర్ 10424, సెకండ్ ఇయర్ 9347, NRML ఫస్ట్ ఇయర్ 6535, సెకండ్ ఇయర్ 6810 మంది పరీక్షలు రాశారు. ASF జిల్లాలో ఫస్ట్ ఇయర్ 5423, సెకండ్ ఇయర్ 5003 మంది పరీక్షలు రాశారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు. #ResultsFirstOnWay2News

News April 25, 2024

తాండూర్: పోలీస్ విధులకు ఆటంకం.. ఏడుగురి రిమాండ్

image

రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్న క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై జగదీష్ గౌడ్ తెలిపారు. ఈ నెల 20న పోలీసులు రేషన్ బియ్యం పట్టుకున్న సమయంలో ఏడుగురు వ్యక్తులు తాండూర్ పోలీసు స్టేషన్ కు వచ్చి దుర్భాషలాడడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారిపై కేసు నమోదు కాగా మంగళవారం రిమాండ్ కు తరలించారు.

News April 25, 2024

ADB: ‘బి’ ఫారం అందుకున్న ఆత్రం సాయుధ

image

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆత్రం సుగుణక్క ‘బి’ ఫామ్‌ను తనయుడు ఆత్రం సాయుధ మంగళవారం గాంధీభవన్ లో అందుకున్నారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పార్టీ టికెట్టును ఆత్రం సాయుధకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సత్తు మల్లేష్, నరేందర్ తదితరులున్నారు.

News April 25, 2024

ఆదిలాబాద్: ‘అక్కడ సాయంత్రం 4 వరకే పోలింగ్’

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సిర్పూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట(ఖమ్మం)సెగ్మెంట్లలో ఉ.7 గంటల నుంచి సా.4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది.

News April 25, 2024

ఆదిలాబాద్: ఈ నెల 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీ

image

ఈ నెల 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. మంగళవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పంపిణీకి ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. అందరికి ఓటర్ స్లిప్ ఇవ్వడంతో పాటు ఓటర్ గైడ్‌ను కూడా అందించాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో బూత్ స్థాయి అధికారులు ఓటర్ స్లిప్పులు పంపిణీలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు.

News April 25, 2024

ఆదిలాబాద్‌లో 6వ రోజు 6 నామినేషన్‌లు దాఖలు

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 6వ రోజు 6 నామినేషన్ల దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. BRS అభ్యర్థి ఆత్రం సక్కు 2 సెట్లు, ఇండియా ప్రజా బంధు పార్టీ అభ్యర్థి గేడం సాగర్ 2 సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా మేస్త్రం గంగాదేవి, చవాన్ రాము ఆర్‌వో కార్యాలయంలో నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు.

News April 24, 2024

ఆదిలాబాద్: నామినేషన్ దాఖలు చేసిన ఆత్రం సక్కు

image

ఆదిలాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు నామినేషన్ పత్రాలను అందించారు. ఆయనతో పాటు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కోవ లక్ష్మీ ఉన్నారు.

News April 24, 2024

ఆదిలాబాద్‌కు CM వరాల జల్లులు.. ఇవే

image

ఆదిలాబాద్ జిల్లావాసులకు సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. నాగోబా జాతరకు రూ.4 కోట్ల కేటాయించాలని నిర్ణయించామన్నారు. బోథ్ ప్రాంతంలో కుప్టీ ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. ముక్తి ప్రాజెక్టును కట్టి.. ఆదిలాబాద్‌కు నీళ్లిస్తామని హామీఇచ్చారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి అంబేడ్కర్ పేరు పెడుతామన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని, యూనివర్సిటీ ఏర్పాటు, CCI తెరిపిస్తామన్నారు.

News April 24, 2024

మంచిర్యాల: డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి

image

మంచిర్యాలలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన పగరపు బిక్షపతి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మృతిచెందాడు. కూలీ పనిచేసుకుంటూ అతడు జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంటి సమీపంలోని డ్రైనేజీ మోరీపై కూర్చుని ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.