India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ పార్లమెంట్లో అంతగా జోష్ కనిపించలేదు. అధిక ఉష్ణోగ్రతల కారణంతో చాలా గ్రామాల్లో ప్రచారం పూర్తిగా నిర్వహించలేకపోయారు. పలువురు నాయకులు సైతం వడదెబ్బకు గురికావడంతో కార్యకర్తలు పగటి పూట ప్రచారం చేయాడానికి అంతగా ఆసక్తి చూపలేదు. పార్టీలకు చెందిన కీలక నేతలు మాత్రమే ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతున్నట్లు ఉమ్మడి ADB జిల్లా రిటర్నింగ్ అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్లో ఉదయం 7 – సాయంత్రం 6 గంటల వరకు ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లిలో ఉదయం 7 – సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు.
SHARE IT
మంచిర్యాల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఆయన్ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు ప్రశ్నించినా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల బందోబస్తులు దాదాపు 1100 జిల్లా పోలీసులు, 400 ఇతర శాఖలకు సంబంధించిన పోలీసులు, 27 సెక్షన్ల కేంద్రబలగాలు, 15 సెక్షన్ల స్పెషల్ పోలీసులు పాల్గొన్నట్లు తెలియజేశారు. మొత్తం 1500 సిబ్బంది ఉన్నరన్నారు.
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామ శివారులో గల పెట్రోల్ బంకు వెనకాల ఒక గుర్తు తెలియని మృతదేహనం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్సై రజనీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి సుమారు 50 నుంచి 55 సం.ల వయసు ఉంటుందని, నల్లని ప్యాంటు, పసుపు రంగు షర్టు ధరించాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు 8712659535,8712659534 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.
మంచిర్యాల జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రచారం ముగిసింది. చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముగించారు. గత కొన్నిరోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసేందుకు కష్టపడుతూ.. ఓటును అభ్యర్థించారు. కొన్ని రోజులుగా మైకులతో మార్మోగిన ఈ ప్రాంతాలు ఈ సాయంత్రం 4 తర్వాత మైకులు మూగబోయాయి. కాగా ఈ నెల 13 ఓటింగ్ జరగనుండగా..వచ్చే నెల 4న వారి భవితవ్యం తేలనుంది.
పోలింగ్ సమయం సమయం సమీపిస్తుండటం, మరికొన్ని గంటల్లో ప్రచారానికి బ్రేక్ పడనుండటంతో పార్టీల నేతలు దూకుడు పెంచారు. అగ్రనేతలు మొదలుకుని ముఖ్య నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సీటు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా.. ఈరోజు సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగియనుంది.
అదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడ ఆదర్శ కళాశాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్ (2024-25) లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు
ఉమ్మడి జిల్లా కన్వీనర్ సుధారాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రతిని తగిన ధ్రువపత్రాలతో కళాశాలలో సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల విధులకు సంబందించి ఈ నెల 1 నుంచి 3 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రెండో విడుత శిక్షణకు గైర్హాజరైన 16 మంది ఉపాధ్యాయులకు కలెక్టర్ రాజర్షి షా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారంతా నోటిసులు అందిన 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఉపాద్యాయులు ఇచ్చే సంజాయిషి ఆధారంగా తగిన చర్యలు తీసుకొనే అవకాశం ఉందన్నారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన ఘటనలో పెద్దపల్లి BRS MP అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామంలో ఈ నెల 6న పార్టీ కండువాలు ధరించి ప్రచారం చేసినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.