India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గల పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం గుర్తించారు. వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గమనించిన వారు అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి వద్ద బంగారిగూడ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి ఫొటో మాత్రమే లభించిందని ఇతర వివరాలేవీ ఆయన వద్ద లేవని అవుట్ పోస్ట్ ఇన్ఛార్జ్ భూమన్న తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు.
ICMR ప్రాజెక్ట్లో భాగంగా జిల్లాలో అమలు చేయనున్న సంకల్ప్ కార్యక్రమంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు DMHO నరేందర్ తెలిపారు. మూడేళ్ల పాటు పని చేసే ఈ ప్రాజెక్ట్లో నర్సు-1 (5పోస్టులు), నర్సు-3(5), రీసెర్చ్ సైంటిస్ట్-3 మెడికల్ (1), పిల్లల వైద్యనిపుణుడు (1), గైనకాలజిస్ట్, డాటాఎంట్రీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు, అర్హులైన వారు పూర్తి వివరాలకు thanigaipaeds@gamail.com వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మృతురాలు డార్క్ బ్రౌన్ రంగు పూల చీర, బ్రౌన్ కలర్ డాట్స్ బ్లౌజ్, ఆకుపచ్చ పసుపు పచ్చ గాజులు ధరించి ఉంది. జీఆర్పీ ఎస్ఐ సుధాకర్ ఉత్తర్వు మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8712658596, 8328512176 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
మంచిర్యాల ఇక్బాల్ అహ్మద్ నగర్కు చెందిన ఎలక్ట్రిషియన్ షేక్ పాషా (40) గురువారం వడదెబ్బతో మృతిచెందినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. మృతుడు కొద్దిరోజులుగా మద్యం తాగుతూ అనారోగ్యానికి గురయ్యాడు. గురువారం ఇంట్లో నుంచి వెళ్లిన అతడిని ఎస్బీఐ బ్యాంకు ముందు ఉన్నట్లు గుర్తించారు .స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
కుబీర్ మండలంలోని పార్డి(కె) గ్రామానికి చెందిన విద్యార్థి బందెల అజయ్ (18) హైదరాబాదులో ప్రమాదానికి గురై మృతిచెందాడు.. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. అజయ్ హైదరాబాదులో డిగ్రీ చదువుతున్నాడు.. రెండ్రోజుల క్రితం ఆటోలో ప్రయాణిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఉన్న ఒక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
Way2News కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈనెల 17న ఆదిలాబాద్ సుభాష్ నగర్ కాలనీలో “మురికి కాలువ శుభ్రం చేసుకుంటున్న యజమానులు” అనే శీర్షికతో వార్త ప్రచురితమయ్యింది. దీంతో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో నాళాలను శుభ్రం చేయించారు. అలగే మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ సైతం నాళాలు తీసిన కుటుంబీకులతో మాట్లాడి ఏమైనా సమస్య ఉంటే తనను సంప్రదించాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో అసంతృప్తుల సెగ ఆయా పార్టీల్లో తల నొప్పిగా మారింది. ముఖ్యంగా బీజేపీ పార్టీలో మాజీ ఎంపీ గోడం నగేష్కు టికెట్ కేటాయింపుతో విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ, నేతల మధ్య అనైక్యత పార్టీకి తలనొప్పిగా మారింది.
నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి జాతీయ రహదారి పై గల బస్ స్టేషన్ వద్ద గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఓ వ్యక్తి వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. ఆ వ్యక్తికి సుమారు 50 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. చామనఛాయతో ఉన్న ఈ వ్యక్తి బిక్షాటన చేసేవాడని ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
ADB ఎంపీ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ 7, TDP 6 సార్లు, TRS 2 సార్లు గెలుపొందాయి. మరోవైపు కాంగ్రెస్ (ఐ), సోషలిస్టు పార్టీ, బీజేపీ ఒక్కోసారి విజయం సాధించాయి. తొలి ఎన్నికల్లోనే సోషలిస్ట్ నుంచి బరిలో ఉన్న మాధవరెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. గడిచిన 4 ఎన్నికలను పరిశీలిస్తే.. ఒక్కోసారి ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తూ వచ్చారు. మరి ఈ ఎన్నికలో ఎవరిని గెలిపిస్తారో చూడాలి మరి.
రెబ్బెన మండలం దేవులగూడా సమీపంలో గురువారం రెండు లారీలు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వెనుకాల ఢీకొన్న లారీ పక్కనే ఉన్న హోటల్ లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.