India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున నేడు ఆసిఫాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్ రానున్నట్లు నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. పాత ఆర్టీఓ కార్యలయం ఎదుట, ప్రేమలు గార్డెన్ పక్కన మైదానంలో బహిరంగ సభ కోసం వేదికను ఏర్పాటు చేశారు. ఎంపీ అభ్యర్థి సుగుణ సొంత ప్రాంతం కావడం వల్ల సీఎం సభకు భారీ స్థాయిలో జనసమీకరణ చేసి సత్తా చాటాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ పరిశీలించారు. దీనిలో భాగంగా భద్రత చర్యల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు. హెలిపాడ్, సభాస్థలి, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు జిల్లా పోలీస్ అధికారులు, తదితరులు ఉన్నారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి వైపు నుంచి నిర్మల్ వైపు బైక్పై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడు కడెం మండలం ముసాయిపేట గ్రామానికి చెందిన రాహుల్గా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. RIMS ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న రాథోడ్ మహేందర్ డ్యూటీ ముగించుకుని బుధవారం నేరడిగొండ మండలంలోని తన స్వగ్రామానికి బైక్ పై బయల్దేరాడు. ఈ క్రమంలో NH44 దూద్ గండి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీకి చెందిన కాసర వేణి రవి అలియాస్ అశోక్ ఛత్తీస్గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. రాజయ్య-లక్ష్మి దంపతుల నలుగురు సంతానంలో రవి చిన్నవాడు. పిన్న వయసులోనే పీపుల్స్ వార్ పార్టీ అనుబంధ సంఘం సీకాసకు ఆకర్షితుడై 1991ప్రాంతంలో విప్లవ బాట పట్టాడు. సింగరేణి కోల్ బెల్టులో చాలాకాలం పనిచేసి దండకారణ్యానికి బదిలీ అయ్యారు. రవి తుది శ్వాస వరకు విప్లవ మార్గాన్ని వీడలేదు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని ఎమ్మెల్యే వెడ్మబొజ్జు అన్నారు. ఉట్నూర్ మండలం లక్కారాం గ్రామంలో గడప గడపకు మండల నాయకులతో కలిసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ లాండ్రి షాప్లో ఎమ్మెల్యే బట్టలను ఇస్త్రీ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.
తాటి చెట్టుపై నుంచి పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండలంలోని బాదంకుర్తి గ్రామంలో జరిగింది. బాదంకుర్తి గ్రామానికి చెందిన కంటి శంకర్ బుధవారం ఉదయం తాటి ముంజలు తెంపడానికి తాటి చెట్టు ఎక్కాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తాటి ముంజలు కోసే క్రమంలో తాటి చెట్టు పైనుండి పడి శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కంటి శంకర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. ఆయన మృతితో విషాదం నెలకొంది.
రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 30 నుంచి మే 28 వరకు వేసవి ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మే 4, 7, 11, 14, 18, 24, 25, 28వ తేదీల్లో బిలాస్పూర్ నుంచి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్ నుంచి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ను మే 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30వ తేదీల్లో సమ్మర్ స్పెషల్ ట్రైన్గా నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తునికాకు సేకరణకు వెళ్లి వృద్ధుడు మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని అటవీ ప్రాంతానికి దస్తురాబాద్ మండలం దేవునిగూడకు చెందిన మోకిరాల బక్కన్న ఆదివారం తోటి వారితో తునికాకు సేకరణకు వెళ్లాడు. భోజన సమయంలో తోటి వారిని తినమని చెప్పి సేకరణకు వెళ్లగా ఎంత వెతికినా దొరకలేదు. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున మే 2న ఆసిఫాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మే 5న రాహుల్ గాంధీ నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. మే4 న KCR మంచిర్యాలలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొనున్నారు. బీజేపీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్తో సభలను నిర్వహించాలని భావిస్తోంది.
Sorry, no posts matched your criteria.